వసతులేవీ?
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల్లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సీనియర్ అధికారులు లేనిచోట జిల్లాల
జిల్లా కార్యాలయాల్లో బాలారిష్టాలు
కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లకూ వెంపర్లాట
హెచ్ఆర్ఏ సరిపోక ఉద్యోగుల అవస్థలు!
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగు నెలలు గడిచినా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల్లో అవసరాలకు తగ్గట్లు ఉద్యోగుల్లేక పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. సీనియర్ అధికారులు లేనిచోట జిల్లాల కలెక్టర్లు, జేసీలపై పనిభారం పెరుగుతోంది. ప్రముఖుల పర్యటనలతో ఎప్పుడూ తీరిక లేకుండా ఉండే విశాఖ, ఎన్టీఆర్, తిరుపతి తదితర జిల్లాల్లో ప్రొటోకాల్ విధులకు సరిపడా అధికారులు లేరు. మౌలిక వసతులు, సిబ్బంది కొరత అన్ని జిల్లాలో ఉండగా, కొన్నిచోట్ల పునర్విభజన తాలూకు బాలారిష్టాలు తొలగిపోలేదు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలువురు కలెక్టర్లు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తలెత్తుతున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి చర్యలు మందకొడిగానే సాగుతున్నాయి.
ఆర్డీవో కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి వేతనాలు, బిల్లుల చెల్లింపులు జరగాలంటే డీడీవో కోడ్తో సీఎఫ్ఎంఎస్ ఐడీ అనుసంధానమై ఉండాలి. ఇది జరగక పలువురు ఆర్డీవోలు, సిబ్బందికి వేతనాల చెల్లింపులు ఏప్రిల్ నుంచి జరగడంలేదు. చిత్తూరు జిల్లా నగరి, పలమనేరు, కుప్పం ఆర్డీవోలకు జీతాలు రాలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్లలో ఏప్రిల్-జూన్ మధ్య వేతనాలు అందలేదు. బాపట్ల జిల్లా బాపట్ల డివిజన్, పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్ కార్యాలయ సిబ్బందిదీ అదే పరిస్థితి.
* బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్ కార్యాలయాల్లో కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్ల కొనుగోలుకు నిధుల కొరత ఉంది. పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ ఈ సమస్యలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్, తూర్పుగోదావరి కలెక్టరేట్లోని స్పందన హాలు, వీసీ హాలు, కోనసీమ కలెక్టరేట్ బిల్డింగ్, క్యాంప్ ఆఫీస్లకు జనరేటర్ సౌకర్యం లేదు. ఉన్నచోట పెట్రోల్, డీజిల్ ఖర్చులకు నిధుల్లేవు.
* విశాఖకు తరచూ ప్రముఖులు, రాష్ట్ర ఉన్నతాధికారులు వస్తుండగా.. వారి పర్యటన ఏర్పాట్లు చూసేందుకు ప్రొటోకాల్ అధికారులు సరిపడా లేరు. వివిధ విభాగాల్లోని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. విశాఖ జిల్లాలో భూవివాదాలు ఎక్కువగా ఉండగా, కలెక్టరేట్లో నాలుగు సెక్షన్లే ఉన్నాయి. రెవెన్యూ యంత్రాంగంపై పనిభారం పెరుగుతోంది. విశాఖ కలెక్టరే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు నోడల్ ఆఫీసర్గా ఉన్నందున సర్వీసు వ్యవహారాలు, పెన్షన్ ప్రతిపాదనలు పరిశీలించడం భారంగా మారింది.
* తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి అదనంగా నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని తిరుపతి, పుత్తూరు, గూడూరుకు ఉప విద్యాశాఖాధికారిగా, సమగ్రశిక్ష అభియాన్ ఏపీవో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
అధికారులేరి?
శ్రీకాకుళంలో డ్వామా పీడీ, కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, పరిశ్రమల శాఖ జీఎం తదితర పోస్టులు 11 వరకు ఖాళీగా ఉన్నాయి. బీసీ, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు రెండు జిల్లాల్లో పనిచేస్తున్నారు. అల్లూరి జిల్లాకు ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లు, 15 మంది కంప్యూటర్ ఆపరేటర్ల అవసరముంది. భీమునిపట్నం డివిజన్ కార్యాలయంలో తహసీల్దార్, డీటీ, ఇతర పోస్టులు 14 వరకు భర్తీ చేయాల్సి ఉంది. అరకులోయ, బొర్రా గుహలు, మారేడుమిల్లి, లంబసింగి, సీలేరు తదితర ప్రాంతాలకు వీఐపీల తాకిడి ఎక్కువ. ఆ మేరకు వాహనాల్లేవు. సిబ్బందీ లేరు. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, నందిగామ డివిజన్లలో 20 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి డివిజన్కు 16 మంది ఉద్యోగులు కావాలి. నెల్లూరులోనూ జడ్పీ, పరిశ్రమలు, మైనార్టీ, బీసీ సంక్షేమం తదితర కీలక శాఖలకు జిల్లాస్థాయి అధికారులు లేరు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు డిప్యూటీ కలెక్టర్ (కేఆర్ఆర్సీ) పోస్టులు కేటాయించలేదు. బాపట్ల జిల్లా బాపట్ల, పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఆర్డీవోతోపాటు డీటీ, జూనియర్ సహాయకుడు అటెండర్లను మాత్రమే నియమించారు. చీరాల, రేపల్లె డివిజన్లలోనూ ఉద్యోగుల కొరత ఉంది. మరోవైపు..బాపట్లలో హెచ్ఆర్ఏ 8% ఉండగా కొత్త జిల్లా ఏర్పడ్డాక అద్దెలు మూడింతలు పెరిగాయి. బాపట్లను టైర్-1 సిటీగా ప్రకటించి హెచ్ఆర్ఏ పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు.
* పల్నాడు జిల్లాకు చెందిన మైనార్టీ, దివ్యాంగ, ఇతర సంక్షేమ కార్యాలయాల ఇంజినీరింగ్ కార్యకలాపాలకు గుంటూరు జిల్లాపై ఆధారపడ్డారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు కరెంటు బిల్లుల కింద నెలకు రూ.50 వేలు, ఇతర ఆఫీసుల అవసరాలకు రూ.2.50 లక్షల చొప్పున కేటాయించాలని అధికారులు కోరారు. ప్రైవేట్ భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నెలకు రూ.3 లక్షల వరకు అద్దెలు చెల్లిస్తున్నారు. కనిగిరి డివిజన్ కార్యాలయంలో మౌలిక వసతులు, కంప్యూటర్లు, ఫర్నిచర్ కోసం రూ.50 లక్షలు అవసరమని అంచనా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ