టాపర్లలో అబ్బాయిలు.. ఉత్తీర్ణతలో అమ్మాయిలు
తెలంగాణ ఎంసెట్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ఎనిమిది మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో ఏడుగురూ వారే. టాపర్లలో ఒక్కో విభాగంలో ఏడుగురు ఏపీ విద్యార్థులే కావడం
ఇంజినీరింగ్లో 80.41%, అగ్రికల్చర్లో 88.34% ఉత్తీర్ణత
గత ఏడాది కంటే తగ్గుదల
తొలి 10 ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులదే హవా
తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల
ఈనాడు-హైదరాబాద్, అమరావతి, పీసీపల్లి, రేగిడి, కొత్తవలస, న్యూస్టుడే
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్లో అబ్బాయిలు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో ఎనిమిది మంది, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో ఏడుగురూ వారే. టాపర్లలో ఒక్కో విభాగంలో ఏడుగురు ఏపీ విద్యార్థులే కావడం విశేషం. ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం జేఎన్టీయూహెచ్ ప్రాంగణంలో విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. నిరుడు ఇంజినీరింగ్లో 82.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈసారి 80.41 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో గత ఏడాది 92.48 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఈసారి 88.34 శాతానికి పడిపోయింది. మొత్తం 160 మార్కుల్లో 40 వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు. టాపర్లలో అబ్బాయిలు సత్తా చాటినా.. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే పైచేయి. రెండు విభాగాల్లోనూ వారే మూడు శాతం ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్, వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంసెట్ ర్యాంకర్ల మనోగతాలు
అన్నయ్యే స్ఫూర్తి
-పి.లక్ష్మీసాయి లోహిత్రెడ్డి, ఇంజినీరింగ్లో ప్రథమ ర్యాంకు
మా సొంతూరు ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు. నాన్న మాల్యాద్రిరెడ్డి, అమ్మ లక్ష్మీకాంతం. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు మా అన్నయ్య లోకేశ్రెడ్డి స్ఫూర్తి. ఆయన గతేడాది నిర్వహించిన తెలంగాణ ఎంసెట్లో 23వ ర్యాంకు, జేఈఈ అడ్వాన్స్డ్లో 5వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ముంబయి ఐఐటీలో చదువుతున్నారు. నేను జేఈఈ మెయిన్, ఎంసెట్కు ఒకే తరహాలో సన్నద్ధమయ్యాను. గణితానికి నిత్యం రెండు గంటలు, ఫిజిక్స్కు 3 గంటలు, కెమిస్ట్రీకి 4 గంటల సమయం కేటాయించాను. అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుంది.
ఐఐటీలో సీఎస్ఈయే లక్ష్యం
-నక్క సాయిదీప్తిక, ఇంజినీరింగ్లో రెండో ర్యాంకు
మా సొంతూరు విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని ఖండ్యాం గ్రామం. నాన్న జయరాం కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఇంజినీర్గా పనిచేస్తుండగా, తల్లి జ్యోతి గృహిణి. ఏపీ ఎంసెట్లో 37వ ర్యాంకు, జేఈఈ మెయిన్లో 99.92 శాతం మార్కులతో 120వ ర్యాంకు పొందాను. తాజాగా తెలంగాణ ఎంసెట్లో రెండో ర్యాంకు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో సీటు సాధించి సీఎస్ఈ చదవాలన్నది నా లక్ష్యం.
స్టార్టప్ కంపెనీ పెడతా
-పోలిశెట్టి కార్తికేయ, ఇంజినీరింగ్లో మూడో ర్యాంకు
మా అమ్మానాన్నలు కోటేశ్వరరావు, కోటేశ్వరిల పోత్సాహం బాగా ఉంది. ఐఐటీ ముంబైలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం. నేనొక్కడ్నే ఉద్యోగం చేయటం కాదు.. పదిమందికి ఉపాధి చూపటమే ధ్యేయం. జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరిలో జాతీయస్థాయిలో 16వ ర్యాంకు కాగా.. ఈడబ్ల్యూఎస్ కోటాలో మొదటి ర్యాంకు వచ్చింది. సగటున రోజుకు 14 గంటలు చదివేవాణ్ని.
న్యూరాలజిస్టునవుతా
-జూటూరి నేహ, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకు
తెలంగాణ ఎంసెట్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలవటం ఎంతో ఆనందాన్నిచ్చింది. గొప్ప న్యూరాలజిస్టును అవ్వాలనేది లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. నీట్లోనూ మంచి స్కోర్ సాధిస్తానని నమ్మకం ఉంది. రోజుకు సగటున 14 గంటలు చదివేదాన్ని. కళాశాలలో అధ్యాపకుల మార్గదర్శనం, పాత ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేశాను. అకాడమీ పుస్తకాలతో పాటు జాతీయ పాఠ్యపుస్తకాలు చదివాను. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏపీ, తెలంగాణ ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించగలిగా.
వైద్యవిద్య అభ్యసించాలని...
-వంటాకు రోహిత్, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో రెండో ర్యాంకు
మాది అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం పొడుగుపాలెం. ప్రస్తుతం విజయనగరం జిల్లా కొత్తవలసలో ఉంటున్నాం. తండ్రి గౌరినాయుడు వ్యవసాయదారుడు. తల్లి దేముడమ్మ గృహిణి. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో 88వ ర్యాంకు పొందాను. నీట్లో మంచి ర్యాంకు సాధించి వైద్య విద్యను అభ్యసించాలన్నది నా లక్ష్యం.
ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే..
-కళ్లం తరుణ్కుమార్రెడ్డి, అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో మూడో ర్యాంకు
డాక్టర్ని అవ్వాలనేది కల. ఎంసెట్, నీట్ పరీక్షలకు రోజుకు సగటున 18 గంటలు చదివేవాడిని. అమ్మానాన్నలు కె.శివనాగిరెడ్డి, కోటేశ్వరి అంతగా చదువుకోకపోయినా నా విషయంలో వెన్నంటి నిలిచారు. తాత అంజిరెడ్డి బాగా ప్రోత్సహించారు. పాఠ్యాంశాలను ఏరోజుకారోజు ప్రణాళికాబద్ధంగా చదవటం, గత పరీక్షల ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయటంతోనే అత్యధిక మార్కులు సాధించగలిగాను. న్యూరాలజీ చదివి డాక్టర్గా స్థిరపడాలనుకుంటున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!