నీట్, జేఈఈ విలీనం!
విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్, జేఈఈ మెయిన్ను
సీయూఈటీ కూడా
మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు
నూతన విధాన రూపకల్పనకు త్వరలో నిపుణుల కమిటీ ఏర్పాటు
వచ్చే ఏడాది నుంచి నూతన విధానం అమల్లోకి తేవాలనే యోచన
‘ఈనాడు’ ఇంటర్వ్యూలో యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్
ఈనాడు, దిల్లీ: విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్, జేఈఈ మెయిన్ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్కుమార్ చెప్పారు. ‘‘ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీయే(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీయే దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాం’’ అని ఆయన తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తీసుకురాబోతున్న కొత్త విధానంపై ‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
పరీక్ష విధానంలో రానున్న మార్పులు ఏమిటి?
ప్రస్తుతం నీట్ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రాస్తారు. జేఈఈ విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తారు. సీయూఈటీలోనూ ఈ సబ్జెక్టులతోపాటు 61 విభిన్న ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా అన్నింటికీ కలిపి ఒకే సీయూఈటీ నిర్వహిస్తే విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నాం. ఇలా చేసినప్పుడు నీట్లో ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు తీసుకొని సీటు ఇస్తాయి.
* ఇంజినీరింగ్ విద్యా సంస్థలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాయి.
* ఇంజినీరింగ్, మెడిసిన్లలో సీట్లు దొరకని విద్యార్థులు ఇదే ప్రవేశపరీక్ష స్కోర్తో ఇతర సాధారణ యూనివర్సిటీల్లో తమకు నచ్చిన కోర్సుల్లో చేరొచ్చు.
విలీన విధాన ఆలోచన ఎలా వచ్చింది?
సీయూఈటీ(సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో నీట్, జేఈఈ మెయిన్తో కలిపి మూడు ప్రధాన పరీక్షలు నడుస్తున్నాయి. చాలా మంది ఈ మూడూ రాస్తారు. అప్పుడే ఒకే విద్యార్థి మూడు పరీక్షలు రాయాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన వచ్చింది.
దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయి? ప్రవేశపరీక్ష ఒకటి కావడమేనా?
బహుళ పరీక్షల బాధ నుంచి విద్యార్థులకు విముక్తి లభిస్తుంది. అదే పెద్ద ప్రయోజనం. ఒక పరీక్షపై దృష్టిపెడితే సరిపోతుంది. అదికూడా 12వ తరగతిలో చదివిన అంశాలపై దృష్టిపెడితే చాలు. మల్టిపుల్ఛాయిస్ క్వశ్చన్స్లో నాలుగురకాల పరీక్ష ఉంటుంది. కొన్ని.. విద్యార్థుల జ్ఞాపకశక్తికి పరీక్షపెడతాయి. ఇంకొన్ని.. ఇచ్చిన జవాబుల్లో ఎంచుకున్న ప్రకారం వారి విశ్లేషణ శక్తిని పరీక్షిస్తాయి. మరికొన్ని సింపుల్కాన్సెప్ట్ ఆధారంగా ఉంటాయి. అలాగే ఒక పేరా ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలుంటాయి.
సాధారణ కేంద్ర విశ్వవిద్యాలయాల పరీక్షలతో పోలిస్తే నీట్, జేఈఈ చాలా కఠినంగా ఉంటాయి కదా? ఇప్పుడు వాటిని మిగతా వాటితో కలిపేస్తే వాటి నాణ్యతపై ప్రభావం చూపదా?
మన విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను వాళ్లు 12వ తరగతిలో ఏం చదివారన్నదాని ఆధారంగా పరీక్షించాలి. అంతే తప్ప హైస్టాండర్డ్స్ పేరుతో వారికి తెలియనివి, చదవనివి ప్రవేశపరీక్షల్లో ఇచ్చి, వాటిని అర్థం చేసుకొనేందుకు పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్లేలా చేయకూడదు. అలా ఉంటే అక్కడ కోచింగ్కు గిరాకీ పెరుగుతుంది. పిల్లలపై అనవసరమైన భారాన్ని మోపడం మంచిదికాదు. సీయూఈటీ ప్రశ్న పత్రంపట్ల విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్టూలో వాళ్లు ఏం చదివారన్నదానిపై ఆధారపడి ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్షలు అలాగే ఉండాలి.
ప్రవేశపరీక్షల విలీన అధ్యయన కమిటీ ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారు?
నెల, రెండు నెలల్లో కమిటీ ఏర్పాటుచేయొచ్చు. అది ఆరునెలల్లో సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రవేశపరీక్షలను అధ్యయనం చేస్తుంది. ఒకే ప్రవేశపరీక్ష ఎలా పెట్టవచ్చో సిఫార్సులు చేస్తుంది. ఆ సిఫార్సులను యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఎన్టీయేలు కలిసి కూర్చొని చర్చించి పరీక్ష విధానాన్ని రూపొందిస్తాయి. అయితే అంతకుముందే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములను మానసికంగా సిద్ధంచేయడానికి ఇప్పటి నుంచే చర్చ మొదలుపెట్టాం. దానివల్ల లాభనష్టాలు తెలిసి వచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.
ఇప్పుడు నీట్, జేఈఈ ర్యాంకులు ఇస్తున్నారు. సీయూఈటీలోనూ ర్యాంకులు ప్రకటిస్తారా?
ఆ విషయం కమిటీ నిర్ణయిస్తుంది. అయితే కొందరు మాత్రం మూడు వేర్వేరు పరీక్షలు రాసినప్పుడు మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఒకటే చేస్తే అవి తగ్గిపోవా అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకునే భవిష్యత్తులో సీయూఈటీని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నాం. మే, డిసెంబరులలో రెండుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి కాకపోయినా మరోసారి అవకాశం చేజిక్కించుకోవడానికి వీలవుతుంది.
కొంత ఆలస్యమైనా కొత్త విధానం రావడం తథ్యమా?
అవును. వీలైతే వచ్చే సంవత్సరమే దీన్ని అమల్లోకి తేవాలన్నది మా లక్ష్యం. ఒకవేళ చేయలేకపోతే 2024-25 సంవత్సరంలో తప్పకుండా తీసుకువస్తాం. ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు. అన్నికోణాల్లో ఆలోచించి, భాగస్వాములందరి అభిప్రాయాలు స్వీకరించి ముందుకు వెళ్లాలన్నదే మా ఉద్దేశం. అందుకే దీనిపై మేం చర్చను కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్