స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నా పింఛను అందలేదు
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లొచ్చినా ఇంతవరకు పింఛను ఇవ్వలేదని సమరయోధుడు మేళవాయి గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాదీకా
సమరయోధుడు మేళవాయి గోవిందరెడ్డి ఆవేదన
తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్టుడే: స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లొచ్చినా ఇంతవరకు పింఛను ఇవ్వలేదని సమరయోధుడు మేళవాయి గోవిందరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనను శనివారం అనంతపురంలోని జడ్పీ హాల్లో సన్మానించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో సమరయోధుల్లో జీవించి ఉన్న ఏకైక వ్యక్తి తానేనని, స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా పింఛను రాకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ముగ్గురు గవర్నర్లు, ఎంతోమంది కలెక్టర్లు పింఛనుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినా స్పందన లేదని ఆయన వాపోయారు. దేశంలో నానాటికీ అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. వీటిని పూర్తిగా అంతమొందించినప్పుడే దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని పేర్కొన్నారు. అనంతపురం ఎంపీ రంగయ్య స్పందిస్తూ గోవిందరెడ్డికి పింఛను ఇప్పించేలా ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!