రూ.10లక్షలకో పోస్టింగ్!
పదోన్నతులు పొందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల్లో (ఎంపీడీవో) కొందరిని కీలక పోస్టుల్లో నియమించడం వెనక లక్షలాది రూపాయలు చేతులు మారాయనీ, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే
పదోన్నతులు పొందిన ఎంపీడీవోల్లో కొందరికి కీలక స్థానాలు
మంత్రి పేషీలో ఒకరిద్దరు చక్రం తిప్పినట్లు ఆరోపణలు
ఈనాడు - అమరావతి
పదోన్నతులు పొందిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల్లో (ఎంపీడీవో) కొందరిని కీలక పోస్టుల్లో నియమించడం వెనక లక్షలాది రూపాయలు చేతులు మారాయనీ, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యమిచ్చారనీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారందరికీ అడిగిన చోట అడిగినట్లుగా నియమించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీలోని ఒకరిద్దరు తెరవెనక ఉండి చక్రం తిప్పినట్లు సమాచారం. పోస్ట్ ప్రాధాన్యం బట్టి రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 237 మంది ఎంపీడీవోలకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించిన విషయం తెలిసిందే. వీరిలో పలువురికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారులు(జడ్పీ సీఈవో)గా, జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా) పథక సంచాలకులు(పీడీ)గా, జడ్పీ డిప్యూటీ సీఈవోలుగా, జిల్లా పంచాయతీ అధికారులు(డీపీవో)గా పోస్టింగ్లు ఇవ్వడం వెనుక పెద్ద ‘కథే’ నడిచింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, డ్వామా పీడీలుగా ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఎంపీడీవో జీతంపై పని చేస్తున్న పలువురు అదే చోట కొనసాగేలా పెద్దఎత్తున పైరవీలు చేసుకున్నారు. జిల్లా మంత్రులతో సిఫార్సు చేయించుకోవడం, అవసరమైన చోట సొమ్ములు సమర్పించుకున్నారు. మూడు జిల్లాల్లో జడ్పీ సీఈవోలు, నాలుగు జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలు, మూడు జిల్లాల్లో డ్వామా పీడీలు అదే చోట కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జడ్పీ డిప్యూటీ సీఈవోల్లో ఇద్దరు ముగ్గురు అదే జిల్లాల్లో సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) నిర్వహించేలా ఉత్తర్వులు తెచ్చుకోవడంలో సఫలీకృతులయ్యారు. నాలుగు జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారులను కూడా అదే స్థానాల్లో కొనసాగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులిచ్చింది.
డబ్బులు ఇవ్వని వారి పేర్లు జాబితా నుంచి తొలగింపు!
పదోన్నతులు పొందిన ఎంపీడీవోలకు సీనియారిటీపై ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఇవ్వాలో ప్రాథమికంగా ఒక జాబితా తయారైంది. దీని ఆధారంగా మంత్రి పేషీలోని కొందరు సంబంధిత ఎంపీడీవోలకు ఫోన్లు చేసి ప్రతిపాదిత పోస్టింగ్ ఇవ్వాలంటే కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలు చెల్లించాలని రాయబేరాలు సాగించారన్న ఆరోపణలు వినవచ్చాయి. డబ్బులు ఇవ్వలేమన్న వారందరి పేర్లు జాబితాల్లో నుంచి పక్కన పెట్టి, ముందుకొచ్చిన వారికి పోస్టింగ్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు జూనియర్లను ప్రాధాన్యం గల స్థానాల్లో నియమించారు. రెండున్నర దశాబ్దాల నిరీక్షిణ తరువాత పదోన్నతులు కల్పించినందుకు సంతోషించాలో, పైరవీకారులకే కీలక పోస్టింగ్లు ఇవ్వడంపై బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని పలువురు ఎంపీడీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పైరవీలు చేసుకోలేని, అడిగిన డబ్బు ఇవ్వలేని వారిలో చాలామందికి ప్రాధాన్యం లేని పోస్టింగులు ఇచ్చారు. ఇతర ప్రభుత్వశాఖల్లో, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో పోస్టింగుల పొందిన వారిలో చాలా మంది ఇదే కోవకు చెందుతారు. మంత్రి పేషీ సిఫార్సు చేసిన వారికే సంబంధిత ఉన్నతాధికారులు కీలక పోస్టింగ్లు ఇవ్వడం గమనార్హం.
ప్రాంతానికో నేత పైరవీలు..
రాయలసీమలో ఎంపీడీవో ఒకరు జడ్పీ సీఈవోగా చాలాకాలంగా పని చేస్తున్నారు. ఆయనకు పదోన్నతి కల్పించి అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పదోన్నతులు పొందిన ఎంపీడీవోల్లో ఆయన కంటే సీనియర్లు ఉన్నప్పటికీ... జిల్లా మంత్రి, అదే ప్రాంత అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో ఆయన్నే కొనసాగించారు.
ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో డ్వామా పథక సంచాలకులు(పీడీ)గా రెండున్నరేళ్లుగా పని చేస్తున్న ఎంపీడీవో ఒకరిని అదే చోట కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఒక మంత్రి మద్దతుతో పాటు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ప్రజాప్రతినిధి వద్ద ఎంపీడీవో సమీప బంధువు పని చేస్తున్నందున అక్కడి నుంచి కదిపే సాహసం చేయలేకపోయారు.
ఎంపీడీవో ఒకరిని పదోన్నతిపై కోస్తా ప్రాంతంలో ఒక జిల్లాకు జడ్పీ డిప్యూటీ సీఈవోగా నియమించారు. మంత్రి పేషీలోని ఒకరిద్దరి సహకారంతో ఆయనకు జడ్పీ సీఈవోగా కూడా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం లభించింది. ఇక్కడ రెగ్యులర్ సీఈవోను నియమించాల్సి ఉన్నా...డిప్యూటీ సీఈవోకే ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు