ఒంగోలులో మువ్వన్నెల శోభ
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఒంగోలులో ఆదివారం మూడు కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. రవిప్రియ మాల్సెంటర్
ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్టుడే: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘త్రివర్ణ ప్రకాశం’ పేరుతో ఒంగోలులో ఆదివారం మూడు కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. రవిప్రియ మాల్సెంటర్ నుంచి మినీ స్టేడియం వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు, ప్రజలు దాదాపు 10వేల మందికిపైగా పాల్గొన్నారు. ర్యాలీలో జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను ప్రదర్శించారు. దేశభక్తి గీతాల ఆలాపన, భారత్ మాతాకీ జై నినాదాలతో వీధులు హోరెత్తాయి. స్టేడియం చుట్టూ పతాకాన్ని ప్రదర్శించారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీ ఛైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, జిల్లా కలెక్టర్ దినేష్కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా