మావోయిస్టుల కోటలో ఎగిరిన మువ్వన్నెల జెండా

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో

Published : 15 Aug 2022 05:12 IST

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు’ సందడిగా నిర్వహించాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్‌ ఏరియా మూడు దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోట. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏటా ఆగస్టు 15న ఈ ప్రాంతంలో వీరు నల్లజెండాలు ఎగరవేసేవారు. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ క్యాంపుల ఏర్పాటు తరువాత తొలిసారిగా ఈ ఏడాది మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా - ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సరిహద్దు గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగరవేశారు. బీఎస్‌ఎఫ్‌-09 బెటాలియన్‌ ఆధ్వర్యంలో సరిహద్దులోని బోడోపొదర్‌, బోడోపొడ, పంపర్‌మెట్ల, దూలిపుట్‌, నక్కమామిడి, పనసపుట్‌, ఆండ్రాపల్లి, జొంత్రి తదితర ప్రాంతాల్లో ఆజాదీకా అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామాల్లోని మావోయిస్టు స్తూపాల వద్ద సైతం జాతీయ జెండాలు ఎగరవేసి ఉత్సవాలను నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని