ఆగమేఘాలపై కార్యవర్గం
రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా అది సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యునిగా,
ధార్మిక పరిషద్పై ప్రభుత్వం ఉత్తర్వులు
నేడు కోర్టు ధిక్కరణ కేసు విచారణ నేపథ్యంలో నిర్ణయం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై ధార్మిక పరిషద్ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల కిందట గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా అది సోమవారం బయటికొచ్చింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్గా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యునిగా, కమిషనర్ కార్యదర్శిగా, తితిదే ఈవో సహా ఇతర సభ్యులు కలిపి మొత్తం 21 మంది కార్యవర్గంతో దీనిని ఏర్పాటు చేసింది. ఓ కేసు విషయంలో హైకోర్టు ఆదేశాల ధిక్కరణపై మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చాలాకాలంగా పూర్తి స్థాయి కార్యవర్గం ధార్మిక పరిషద్ లేదు. దేవాదాయ మంత్రి, ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తితిదే ఈవో కూడిన పరిషద్ మాత్రమే కొనసాగుతోంది. 2020లో తిరుపతి హథీరాంజీ మఠాధిపతిని తొలగిస్తూ అప్పటి దేవాదాయ కమిషనర్, ధార్మిక పరిషద్ కార్యదర్శి హోదాలో ఆదేశాలిచ్చారు. దీనిపై ఆ మఠాధిపతి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి కార్యవర్గం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగురితో కూడిన ధార్మిక పరిషద్ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ చట్టసవరణ చేసింది. దీనిని కూడా న్యాయస్థానం ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో ఎందుకు ఏర్పాటు చేయడంలేదని నిలదీసింది. కొంతకాలం కిందట దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కేసుపై మంగళవారం విచారణ జరగనుంది.
* మరోవైపు వైఎస్ఆర్ జిల్లాలో బ్రహ్మంగారి మఠానికి చెందిన మఠాధిపతి మృతి చెందడంతో.. ఆయన ఇద్దరు భార్యల కుమారుల్లో ఎవరిని మఠాధిపతిగా నియమించాలనే దానిపై వివాదం ఏర్పడింది. దేవాదాయశాఖ తరఫున తాత్కాలికంగా ఒక ఇన్ఛార్జిని నియమించారు. మఠాధిపతి రెండో భార్య హైకోర్టును ఆశ్రయించారు. నలుగురితో కూడి ధార్మిక పరిషద్కు అధికారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి పరిషద్ ఏర్పాటు చేసినట్లు దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
సభ్యులు వీరే..
హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కె.సూర్యారావు, రిటైర్డ్ ఐఏఎస్ అజేయ కల్లాం, దేవాదాయశాఖ రిటైర్డ్ అదనపు కమిషనర్ ఏబీ కృష్ణారెడ్డి, వంశపారంపర్య ధర్మకర్తలు దాతులూరి జగన్నాథరాజు చౌట్రీ (భీమవరం)కి చెందిన ఎం.రామకుమార్రాజు, అన్నవరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇనుగంటి వెంకటరోహిత్, యాదాల్ల పిచ్చయ్య చౌట్రీ (కడప) డాక్టర్ జ్వాలా చైతన్య, చాకవారి చౌట్రీ (పాలకొల్లు) చాకా ప్రభాకరరావు, మాకా బాలాజీ, రాజన్ సుభాషిణి, తిరుమల పెద్ద జీయంగార్ మఠం మఠాధిపతి, వైఎస్ఆర్ జిల్లా పుష్పగిరి మఠం మఠాధిపతి, దాతలు సంగా నర్సింహరావు, యూకే విశ్వనాథరాజు, ఆగమ పండితులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్.శ్రీరామశర్మ, ఛార్టర్డ్ అకౌంటెంట్ శ్రీరామమూర్తిలను ప్రభుత్వం పరిషద్లో సభ్యులుగా నియమించింది. దేవాదాయ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, తితిదే ఈవో కాకుండా.. మిగిలిన 17 మంది అనధికార సభ్యుల పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. వీరిలో కె.సూర్యారావు ప్రస్తుతం దేవాదాయశాఖ న్యాయ సలహాదారుగా ఉన్నారు.
ధార్మిక పరిషద్ అధికారాలివి..
దేవాదాయశాఖకు సలహా మండలిగా వ్యవహరిస్తుంది. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకవర్గాలను నియమిస్తుంది. ఉల్లంఘనలు జరిగి, ఫిర్యాదులు వచ్చినపుడు మఠాధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం.. మఠాధిపతి చనిపోతే కొత్తవారిని నియమించే అధికారం ధార్మిక పరిషద్కు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల