యాప్ హాజరుపై అంతర్గత పోరు
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యాప్ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. యాప్ ఆధారిత హాజరును ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఇతర
డౌన్లోడ్ చేసుకోవద్దంటున్న ఉపాధ్యాయ సంఘాలు
నేటి నుంచి తప్పనిసరని విద్యాశాఖ అధికారుల ఆదేశాలు
గురువుల సెల్ఫీ పాట్లు
చిత్రంలోని వ్యక్తులు సెల్ఫోన్లో ఫొటోలు దిగుతున్నారనుకుంటే పొరపాటే. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఉపాధ్యాయుల పడుతున్న పాట్లు ఇవి. ఉపాధ్యాయుల హాజరు నమోదుపై ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటి ప్రకారం మొబైల్ యాప్లో సెల్ఫీ అప్లోడ్ చేస్తేనే హాజరు నమోదవుతుంది. మంగళవారం నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ యాప్లో ముఖం, కళ్లు తదితర ఫొటోలు అప్లోడ్ చేసుకునేందుకు సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గౌరిదేవిపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. సిగ్నల్స్ అందకపోవడంతో వివరాలు అప్లోడ్ కావడం లేదని వారు వాపోతున్నారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో సంకేతాలు అందవని, ఇక్కడ ఈ విధానానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
- ఎటపాక, న్యూస్టుడే
నాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల యాప్ ఆధారిత హాజరుపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. యాప్ ఆధారిత హాజరును ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో), ఇతర ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల సూచనలతో చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. మంగళవారం నుంచి యాప్లో హాజరు వేయాల్సిందేనని, దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది పాఠశాల విద్యలో ఉపాధ్యాయులు, అధికారుల మధ్య అంతర్గత పోరుకు దారి తీసింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆన్లైన్ హాజరుపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్యాశాఖ ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ ఆధారిత) హాజరు నమోదుకు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చింది. ఉపాధ్యాయుల సెల్ఫోన్లోనే దీన్ని డౌన్లోడ్ చేసుకుని, తమ ఫొటోలను అప్లోడ్ చేయాలి. ప్రతిరోజూ పాఠశాల వద్ద యాప్ ఓపెన్ చేసి, హాజరు నమోదు చేయాలి. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం తిరిగివెళ్లేటప్పుడు రెండు పర్యాయాలు హాజరు నమోదు చేయాలి.
అనేక సందేహాలు
యాప్ హాజరుపై ఉపాధ్యాయుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కిలోమీటరు దూరంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేశారు. ఉపాధ్యాయులను కొత్త బడిలో సర్దుబాటు చేశారు. యాప్లో మాత్రం పాత పాఠశాలలోనే ఉన్నట్లు చూపిస్తున్నారు. వీరి హాజరు నమోదుపై అనేక ఫిర్యాదులు రావడంతో సోమవారం రాత్రి విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలిచ్చారు. అప్పటికే ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయినందున మంగళవారం ఉదయం హాజరు ఎలాగనే ఆందోళన నెలకొంది.
* ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏదైనా కారణంతో ఉపా ధ్యాయులు కొంచెం ఆలస్యంగా వస్తే.. సగం రోజు హాజరు లేకున్నా పాఠాలు చెప్పాలా? సెలవు తీసుకోవాలా? సెలవు తీసుకుంటే అప్పటికప్పడు వేరే ఉపాధ్యాయుణ్ని ఎలా సర్దుబాటు చేస్తారో స్పష్టత లేదు.
* ఉదయం 9 గంటల్లోపే హాజరు వేయాలనే నిబంధన పెట్టారు. ఎక్కడైనా నెట్వర్క్ సమస్యతో హాజరుపడకపోతే పరిస్థితి ఏమిటనేదీ సందిగ్ధమే.
* యాప్ను ఉపాధ్యాయుల సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు. స్మార్ట్ఫోన్ లేని ఉపాధ్యాయులు ఏం చేయాలి? కొంత మంది టీచర్లకు స్మార్ట్ఫోన్ వినియోగంపై సరైన అవగాహన లేదు. వీరి హాజరు నమోదు ఎలా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
* ప్రభుత్వమే తమకు ట్యాబ్లు ఇచ్చి, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని చెబుతున్నారు.
యాప్ హాజరును రద్దు చేయాలి
-నరహరి, రమణయ్య, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
సెల్ఫోన్లో హాజరు వేసే విధానాన్ని రద్దు చేయాలి. సొంత సెల్ఫోన్లో ఈ యాప్ వేసుకోవడం వల్ల ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచార భద్రతకు విఘాతం కలుగుతుంది. ఏకోపాధ్యాయులు సకాలంలో హాజరుకాకపోతే ఆ పాఠశాల ఆ రోజు మూతపడుతుంది. గతంలోలాగా డివైజ్లు, ఇంటర్నెట్ సదుపాయం ఇస్తే హాజరు వేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం
- హృదయరాజు, చిరంజీవి, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
ఉపాధ్యాయులందరికీ స్మార్ట్ఫోన్లు లేవు. చాలా ప్రాంతాల్లో నెట్వర్క్ సౌకర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టి, విద్యావ్యవస్థను కార్పొరేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. యాప్ల భారం తగ్గించి, బోధనకు అవకాశం ఇవ్వాలి.
ఆఫ్లైన్ ఎంచుకునే అవకాశం
- సురేష్కుమార్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ
* నెట్వర్క్ సమస్య లేకుండా ఆఫ్లైన్ ఎంపిక అవకాశం ఇచ్చాం. సిగ్నల్ వచ్చిన తర్వాత డేటా సర్వర్కు వస్తుంది. ఇప్పటికే రంపచోడవరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాం.
* పాఠశాలలు ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతాయి. ఉపాధ్యాయులు దీనికి అర్ధగంట ముందే రావాలి. కాబట్టి హాజరు నమోదు ఆలస్యమవుతుందనే సమస్య ఉండదు. యాప్ హాజరు నమోదును కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత ఎంత మంది ఆలస్యంగా వస్తున్నారు? నెట్వర్క్ సమస్య ఎన్నిచోట్ల ఉంటోంది వంటివి పరిశీలించి, ఉదయం 9 గంటల నిబంధనపై నిర్ణయం తీసుకుంటాం.
* ఎక్కువ రోజుల సెలవుకు సంబంధించిన మరో సబ్మాడ్యూల్ను యాప్లో త్వరలో తీసుకువస్తాం.
* ట్రెజరీలకు వెళ్లే పని లేకుండా ఉపాధ్యాయుల జీతాల బిల్లుకూ ఆన్లైన్ హాజరును అనుసంధానించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు