అంధ విద్యార్థినికి ప్రధాని ప్రశంస

విశాఖలోని సాగర్‌నగర్‌ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్‌.మాధురి జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ

Updated : 16 Aug 2022 05:14 IST

విశాఖపట్నం (సాగర్‌నగర్‌), న్యూస్‌టుడే: విశాఖలోని సాగర్‌నగర్‌ సమీప ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఎస్‌.మాధురి జాతీయ జెండా విశిష్టతను వర్ణిస్తూ చేసిన ప్రసంగానికి ప్రధానమంత్రి మోదీ ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారని ప్రిన్సిపల్‌ ఎం.మహేశ్వరరెడ్డి సోమవారం పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన పాఠశాలలో పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో జెండాలోని మూడు రంగులను తాకుతూ దేశభక్తి అనుభూతిని పొందానని మాధురి సంతోషం వ్యక్తం చేసింది. ఈ అంశం కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తన ట్విటర్‌లో ఉంచారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించి..మాధురి చెప్పిన విషయం నిజమని, జాతీయ జెండాలోని మూడు రంగులు దేశ ప్రజలందరి హృదయాలను తాకాయని అభినందనలు తెలుపుతూ రీట్వీట్‌ చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని