సీపీఎస్పై ఆందోళనలకు సమాయత్తం
కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు చేయాలనే డిమాండ్తో సెప్టెంబరు 1న ఆందోళనలు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినట్లు ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని ఏపీసీపీఎస్యూఎస్ ప్రకటన
విజయవాడలో మిలియన్ మార్చ్కు సీపీఎస్ఈఏ పిలుపు
ఈనాడు, అమరావతి: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు చేయాలనే డిమాండ్తో సెప్టెంబరు 1న ఆందోళనలు నిర్వహించేందుకు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినట్లు ఏపీ ప్రభుత్వం సైతం చేయాలని, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం(ఏపీసీపీఎస్యూఎస్) అధ్యక్ష, కార్యదర్శులు సీఎం.దాస్, రవికుమార్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడిస్తామని.. ఇందులో 2 లక్షల సీపీఎస్ ఉద్యోగులతో పాటు 93వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొంటారని వెల్లడించారు. ‘‘అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులు జగన్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు, మంత్రులు, ప్రైవేటు సంస్థలతో కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. కొత్తగా గ్యారెంటీ పింఛన్ పథకం(జీపీఎస్) తీసుకొచ్చారు. ఉద్యోగుల వాటాపై కేంద్రం అప్పు ఇస్తామనడం, సుమారు రూ.వెయ్యి కోట్లు లేకపోయినా రూ.4,203కోట్లు అప్పు ఇస్తామని కేంద్రం రాజ్యసభలో ప్రకటించడంలో ఏపీ ప్రభుత్వ పాత్రపైనా అనుమానాలున్నాయి. ఉద్యోగులు 35నెలలు ఆదాయపన్ను చెల్లించినా డీఏ బకాయిలను చెల్లించలేదు’’ అని వెల్లడించారు.
చలో విజయవాడ..
సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానం ప్రవేశపెట్టాలనే డిమాండ్తో సెప్టెంబరు 1న చలో విజయవాడ (మిలియన్ మార్చ్) నిర్వహించనున్నామని ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి ప్రకటించారు. ‘‘సీపీఎస్ డబ్బులను తాకట్టుపెట్టి రుణం తీసుకోవడం దుర్మార్గం. ప్రతినెలా ప్రభుత్వం పంపాల్సిన సీపీఎస్ సొమ్ము సకాలంలో పంపకపోవడంతో ఉద్యోగులు వడ్డీని కోల్పోతున్నారు’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్