ఆటోలో విద్యార్థిని అంతిమ ప్రయాణం

అనారోగ్యంతో చనిపోయిన ఓ యువతి మృతదేహాన్ని ఆటోలో తరలించిన దయనీయ ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కేజీబీవీలో దుక్కెరి దీపిక ఇంటర్‌ రెండో సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. జబ్బు

Published : 17 Aug 2022 03:48 IST

అందుబాటులో లేని ఆసుపత్రి అంబులెన్స్‌

జి.మాడుగుల, న్యూస్‌టుడే: అనారోగ్యంతో చనిపోయిన ఓ యువతి మృతదేహాన్ని ఆటోలో తరలించిన దయనీయ ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల కేజీబీవీలో దుక్కెరి దీపిక ఇంటర్‌ రెండో సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. జబ్బు పడటంతో తండ్రి పోతురాజు ఈనెల 3న కళాశాలకు వెళ్లి దీపికను ఇంటికి తీసుకెళ్లాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ.. ఆరోగ్యం విషమించింది. ఈనెల 14న పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రి అంబులెన్స్‌ అందుబాటులో లేదు. సూపరింటెండెంట్‌ స్పందించి ప్రైవేట్‌ ఆటోను సమకూర్చడంతో అందులోనే మృతదేహాన్ని స్వగ్రామం బొయితిలికి తరలించారు. ఎదిగొచ్చిన కుమార్తె చనిపోవడంతో కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని