సివిల్ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్ చట్టం రద్దు
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ నెల 13న గవర్నర్ జారీచేసిన ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్లో
ఆర్డినెన్సు జారీ చేసిన గవర్నర్
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ నెల 13న గవర్నర్ జారీచేసిన ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్లో ప్రచురించింది. ప్రస్తుతం ట్రైబ్యునల్ వద్ద పెండింగ్లో ఉన్న కేసులన్నింటినీ కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్కు బదిలీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం గడువులోగా వాటిని పరిష్కరించాలని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత సివిల్ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్ హైదరాబాద్లోనే కొనసాగుతోంది. 2020 ఫిబ్రవరి 1 నుంచి ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2009 నుంచి ఇప్పటిదాకా ట్రైబ్యునల్లో 719 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అభియోగాలు నమోదు చేసి ట్రైబ్యునల్లో పెండింగ్లో ఉన్న కేసుల్ని వేరే సంస్థకు బదిలీ చేసేందుకు చట్టప్రకారం అవకాశం లేనందున మొత్తం చట్టాన్నే రద్దు చేస్తూ ఆర్డినెన్సు ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!