సంస్కరణల పొగ
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు సంస్కరణల సెగ తగులుతోంది. పాఠశాల విద్యలో సంస్కరణలు, జూన్లో వచ్చిన రెగ్యులర్ పదో తరగతి ఫలితాలు విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపాయి. మరోపక్క కరోనా సమయంలో ఫీజులు చెల్లించలేక ప్రైవేటు
ప్రభుత్వ పాఠశాలల నుంచి టీసీలు తీసుకుంటున్న విద్యార్థులు
ప్రైవేటులో ఫీజులు చెల్లించలేక కొందరు వెనక్కి
రెగ్యులర్ పది ఫలితాలు, విలీనం, హేతుబద్ధీకరణ కారణాలు!
ఈనాడు - అమరావతి
ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలకు సంస్కరణల సెగ తగులుతోంది. పాఠశాల విద్యలో సంస్కరణలు, జూన్లో వచ్చిన రెగ్యులర్ పదో తరగతి ఫలితాలు విద్యార్థుల ప్రవేశాలపై ప్రభావం చూపాయి. మరోపక్క కరోనా సమయంలో ఫీజులు చెల్లించలేక ప్రైవేటు బడుల నుంచి వచ్చినవారిలోనూ కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారు. పాఠశాలల విలీన నిర్ణయం కొందరు విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేస్తోంది. కొన్నిచోట్ల వాగులు, వంకలు, ప్రధాన, జాతీయ రహదారులు దాటి విలీన పాఠశాలకు వెళ్లాల్సి రావడంతో తల్లిదండ్రులు వారిని దగ్గర్లో ఉన్న, లేదా రవాణా సదుపాయం ఉన్న ప్రైవేటు బడులకు పంపుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ పదోతరగతి ఫలితాలు పడిపోవడంతోనూ కొందరు ప్రైవేటు బాట పట్టారు. విద్యార్థులు వెనక్కి వెళ్లిపోవడంపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ముగిస్తే గానీ ఎందరు టీసీలు తీసుకున్నారనే వివరాలు తెలియవు. పట్టణాల కంటే గ్రామాల్లోనే ఎక్కువగా ఇలా ప్రభుత్వ బడుల్లో టీసీలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో సీట్ల కోసం ఇప్పటికీ సిఫార్సు లేఖలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కొవిడ్ తగ్గడమా.. సంస్కరణలా?
కరోనా కారణంగా గత రెండేళ్ల్లుగా ప్రైవేటు పాఠశాలలు సరిగా కొనసాగలేదు. దానికి తోడు తల్లిదండ్రుల ఆదాయాలు పడిపోయి ప్రైవేటులో ఫీజులు చెల్లించలేక కొందరు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చారు. ఇప్పుడు కొవిడ్ తగ్గి, సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ఇలాంటివారిలో కొందరు వెనక్కి వెళ్లిపోతున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
* కరోనా సమయంలో మూతపడిన ప్రైవేటు బడుల్లో కొన్నింటిని ఈ ఏడాది తెరిచారు. గతంలో ఈ బడుల నుంచి వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కొందరు తల్లిదండ్రులు అటు మొగ్గుచూపుతున్నారు.
* గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన అమ్మఒడి ఆర్థికసాయాన్ని జూన్లో ఇచ్చారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆ మొత్తానికే చదువు చెబుతామంటూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ప్రవేశాల సమయంలో రూ.5వేలు చెల్లిస్తే చాలంటూ పిల్లల్ని చేర్చుకుంటున్నాయి.
* విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం చేపట్టారు. చాలా ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే ఉన్నారు. ఉపాధ్యాయుల కొరత కొన్నిచోట్ల ప్రవేశాలపైప్రభావం చూపుతోంది.
* పభుత్వ పాఠశాలల్లో జూన్లో విడుదల చేసిన రెగ్యులర్ పదో తరగతి ఫలితాలు దారుణంగా పడిపోయాయి. చాలా బడుల్లో 50% లోపే వచ్చాయి. పదోతరగతిలో ఫెయిలైన పిల్లల తోబుట్టువులను తల్లిదండ్రులు కొన్నిచోట్ల ప్రైవేటు పాఠశాలలకు మారుస్తున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చేరేవారిలో 6,7,8,9 తరగతుల వారూ ఉంటున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో టీసీలు అడుగుతున్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ చేస్తున్నారు.
* అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం మంగళాపురం ప్రాథమికోన్నత పాఠశాల నుంచి 6,7,8 తరగతులను విజయరాజుపేట పాఠశాలలో విలీనం చేయగా.. 35మందికి 15మందే విలీన బడిలో చేరారు.
* గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7 తరగతులను అల్లంవారిపాలెం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. 45మందిలో 30మంది టీసీలు తీసుకెళ్లారు.
* నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలోని నిడుముసులు ప్రాథమిక పాఠశాల నుంచి 3,4,5 తరగతులను సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల్లో 11మందికి టీసీలు ఇవ్వగా.. తొమ్మిది మంది మాత్రమే ప్రాథమికోన్నత బడిలో చేరారు. ఇప్పుడు 1,2తరగతుల్లో ఐదుగురేమిగిలారు.
* అనంతపురంలోని ఓ పురపాలక ఉన్నతపాఠశాలలో 120మంది వరకు టీసీలు తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)