ప్రభుత్వం మొండికేస్తే ‘యాప్ డౌన్’
యాప్ ఆధారిత నమోదుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొత్తం యాప్లను డౌన్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ-హాజరు నమోదుపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు
ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం
నేడు మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో ఫ్యాప్టో భేటీ
సానుకూల నిర్ణయం రాకపోతే కార్యాచరణపై ప్రకటన
ఈనాడు, అమరావతి: యాప్ ఆధారిత నమోదుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే మొత్తం యాప్లను డౌన్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ-హాజరు నమోదుపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులను కలవనున్నారు. యాప్ల భారంతో బోధనకు ఏర్పడుతున్న ఆటంకాలు, ఈ-హాజరుతో క్షేత్రస్థాయిలో వస్తున్న సమస్యలను వారికి విన్నవించనున్నారు. వారి నుంచి వచ్చే హామీ మేరకు కార్యాచరణ ప్రకటించనున్నారు. సానుకూల హామీ లభించకపోతే అన్ని యాప్లను నిలిపివేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల హాజరు, మరుగుదొడ్ల శుభ్రత, విద్యాకానుక, ‘నాడు-నేడు’ పనుల వివరాలను ఉపాధ్యాయులు యాప్ల్లో నమోదు చేస్తున్నారు. తమ సొంత సెల్ఫోన్ల ద్వారానే వాటిని నిర్వహిస్తున్నారు. యాప్ల డౌన్ ప్రకటిస్తే ఆ వివరాల సేకరణ నిలిచిపోతుంది. సొంత సెల్ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకొని, హాజరు నమోదు చేయబోమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులకు బుధవారం కూడా ఉపాధ్యాయులు వినతులు సమర్పించారు. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలు ప్రత్యేక నమూనా సిద్ధం చేసి పంపాయి. బుధవారం ఈ-హాజరు నమోదు 50 శాతంలోపే నమోదైంది. చాలామంది ఉపాధ్యాయులు యాప్లను డౌన్లోడ్ చేసుకోలేదు. సిగ్నల్స్, సాంకేతిక సమస్యల కారణంగా కొందరి హాజరు నమోదు కాలేదు.
వ్యక్తిగత భద్రతకు ముప్పు!
ముఖ ఆధారిత యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫోన్లోని వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని ఉపాధ్యాయులు అంటున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాల్స్ మేనేజ్, ఫొటోలు, వీడియోల మేనేజ్కు అనుమతి ఇవ్వాల్సి వస్తోందని, లోకేషన్ ఆన్ చేస్తేనే హాజరు తీసుకుంటోందని, దీని కారణంగా తమ వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఫోన్లోని సమాచారం ఇతరులు తెలుసుకునే వీలుంటుందని ఆందోళన చెందుతున్నారు. కొందరైతే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న ఫోన్ను పక్కనపెట్టి వ్యక్తిగత కాల్స్ కోసం మరో ఫోన్ వాడుతున్నారు. ప్రభుత్వమే డివైజ్లు, డాటా ఇస్తే హాజరు నమోదుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఈ-హాజరును తాము వ్యతిరేకించడం లేదని చెబుతున్నారు. సొంత ఫోన్లో యాప్లు వేసుకోవడాన్నే వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు.
86 మందికి షోకాజ్ నోటీసులు..
బుధవారం మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థుల హాజరు నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 86 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కర్నూలు జిల్లా విద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాప్ పని చేయకపోవడం వల్లనే హాజరు నమోదు చేయలేకపోయామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ముఖ హాజరుతో ముప్పుతిప్పలు
వెంకట్నగర్ (కాకినాడ), న్యూస్టుడే: పాఠశాలల్లో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదులో రెండోరోజూ ఇబ్బందులు తప్పలేదు. కొందరు యాప్ డౌన్లోడ్ కోసమే గంటల తరబడి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. బుధవారం ఉదయం 9 గంటలకు ఒకేసారి వేలమంది హాజరు నమోదుకు సిద్ధమవడంతో సర్వర్ స్తంభించి సేవలు నిలిచిపోయాయి. చాలామందికి లాగిన్ అయ్యేందుకే అవకాశం రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు. మధ్యాహ్నం వరకు సర్వర్ అందుబాటులోకి రాకపోవడంతో ఉపాధ్యాయుల హాజరు నమోదు కాలేదు. ఈ విధానం బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ