ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ 22 నుంచి

ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ ప్రవేశాలకు ఈనెల 22 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా

Published : 18 Aug 2022 04:56 IST

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ ప్రవేశాలకు ఈనెల 22 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయకేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈఏపీసెట్‌లో మొత్తం 1,73,572 మంది అర్హత సాధించారు. వీరిలో ఎంపీసీ స్ట్రీమ్‌ అభ్యర్థులకు మొదట కౌన్సెలింగ్‌ చేపట్టారు.

* ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు: ఈనెల 22-30

* ధ్రువపత్రాల పరిశీలన: 23-31

* కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు: ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2

* ఐచ్ఛికాల మార్పు: 3న

* సీట్ల కేటాయింపు: 6న

* కళాశాలల్లో రిపోర్టింగ్‌: 6-12

* తరగతులు ప్రారంభం: 12 నుంచి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని