చిక్కిపోతోంది నిషిద్ధ జాబితా!
నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములను గతానికి భిన్నంగా వేగంగా తొలగిస్తున్నారు. జిల్లాల కలెక్టర్ల నిర్ణయాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియలో అధికారులపై
చుక్కల భూములపై రాజకీయ ఒత్తిళ్లు
గతానికి భిన్నంగా వేగంగా పరిష్కారాలు
కడప, అన్నమయ్య జిల్లాల దూకుడు
ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్-కడప
నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూములను గతానికి భిన్నంగా వేగంగా తొలగిస్తున్నారు. జిల్లాల కలెక్టర్ల నిర్ణయాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పిస్తూ ఉత్తర్వులను జారీ చేస్తోంది. ఈ ప్రక్రియలో అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు అధికంగా పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఉత్తర్వుల్లో అధిక భాగం కడప, అన్నమయ్య జిల్లాలకు చెందినవే ఉంటుండటం చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప శివారులోని సీకే దిన్నె ప్రాంతాల్లోని ఎకరాలకొద్ది భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించేస్తున్నారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి, పెద్దశెట్టిపల్లి, చాపాడు మండలం పల్లవోలు, ఓబులవారిపాలెం మండల కేంద్రం, రాయచోటి మండలం చెర్లోపల్లి, జమ్మలమడుగు మండలం పెద్దనందలూరు, పులివెందుల మండలం అచ్చవల్లి గ్రామం, ముద్దనూరు మండల కేంద్రం, ఇతర ప్రాంతాల్లోని భూములపై చుక్కలు తొలగించారు. అయితే... సాధారణ వ్యక్తులు ఎవరైనా తమ భూములపై ఉన్న చుక్కలను తొలగించాలని దరఖాస్తు చేసుకుంటే పట్టించుకునే వారే ఉండరని, వాటికి సానుకూలంగా ఉత్తర్వులు రావడమే లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో గత కొద్ది నెలల్లోనే వందలాది ఎకరాల భూమిని నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. ఓ ప్రజాప్రతినిధి ప్రొద్దుటూరు సమీపంలో నిషిద్ధ జాబితాలో ఉన్న భూమిని తన పరిధిలోకి తీసుకుని... ఆ తర్వాత చుక్కల తొలగింపు ఉత్తర్వులు పొందినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కలెక్టర్లదే తుది నిర్ణయం
ఆంగ్లేయుల హయాంలో ఆర్ఎస్ఆర్ (రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్) తయారీలో తప్పిదాలు దొర్లాయి. ప్రైవేట్ భూముల రీ-సర్వే సమయంలో యజమానులు అందుబాటులో లేకుంటే... వాటివద్ద చుక్కలు పెట్టారు. ఇలాంటి భూములను నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు దరఖాస్తులు అందితే జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను అనుసరించి భూ పరిపాలన శాఖ నిర్ణయం తీసుకునేది. అయితే... కలెక్టర్లే స్వయంగా నిర్ణయాలు తీసుకోవచ్చునని ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి కడప, అన్నమయ్య జిల్లాల్లో భూముల తొలగింపు ప్రక్రియ వేగం అందుకుంది. ఈ జిల్లాల్లో సుమారు 11 వేల దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలన దశలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోనూ దరఖాస్తుల పరిష్కారం సాగుతోంది. ప్రకాశం జిల్లా కనిగిరి, సంతనూతలపాడు, బాపట్ల జిల్లా వేటపాలెం, నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతాల్లో వందలాది ఎకరాలను నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్టణం మండలం బందరు గ్రామం, విజయవాడ శివారు చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామం, నెల్లూరు రూరల్ మండలంలో జులై 27న 158 ఎకరాలపై చుక్కలను తొలగించారు.
పరిశీలనలో 72 వేల దరఖాస్తులు
చుక్కల భూములకు విముక్తి కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా 77 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 72 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. అత్యధికంగా నెల్లూరు(13 వేలు), అనంతపురం(10,122), కర్నూలు(10 వేలు), పల్నాడు(9,500), నంద్యాల(6,800), ప్రకాశం(4,300), శ్రీసత్యసాయి(3,356), గుంటూరు జిల్లా(2 వేలు), ఇతర జిల్లాల్లో మరికొన్ని దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల నుంచి ఇప్పటికీ దరఖాస్తులు అందుతూనే ఉన్నాయి.
ప్రాథమికంగా ఇలా చేయాలి...
చుక్కల భూముల దరఖాస్తులను మొదట వీఆర్వో పరిశీలిస్తారు. తర్వాత తహసీల్దార్... ఆ భూములకు గతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయా? లింకు డాక్యుమెంట్లు ఉన్నాయా? వంటి వాటిని తనిఖీ చేసి సిఫార్సు చేస్తారు. అనంతరం ఉన్నతాధికారులు పరిశీలించాక దస్త్రాన్ని కలెక్టరేట్కు పంపాలి. అయితే ప్రస్తుతం వివిధ జిల్లాల్లో జరుగుతున్న చర్యలపై ఉన్నతస్థాయిలో నిశిత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్