ప్రసవ యాతన
ప్రభుత్వాసుపత్రులే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందినీ నియమిస్తున్నాం. మౌలిక
వైద్యులు లేక గర్భిణులకు ఇబ్బంది
మత్తు వైద్య నిపుణులకూ కొరతే
సీఎం ప్రకటనలు నీటిమూటలే!
చాలాచోట్ల ప్రైవేట్ వైద్యమే దిక్కు
ఈనాడు - అమరావతి
ప్రభుత్వాసుపత్రులే కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వైద్యులు, ఇతర పారా మెడికల్ సిబ్బందినీ నియమిస్తున్నాం. మౌలిక సదుపాయాలకు కొరత లేకుండా చూస్తున్నాం.
- తరచూ ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలివి.
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను చూస్తే.. ముఖ్యమంత్రి మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన ఉండడంలేదు. రాష్ట్రంలో 181 సీహెచ్సీలు ఉంటే వివిధ ప్రాంతాల్లోని 15 సీహెచ్సీల్లో ఈ ఏడాది జులై వరకు ఒక్క ప్రసవమూ జరగలేదు. 1 నుంచి 9లోపు ప్రసవాలు జరిగిన సీహెచ్సీలు 67 మాత్రమే. కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కనీసం సహజసిద్ధంగా జరిగే ప్రసవాలూ ఇప్పుడులేవు. చాలాచోట్ల గైనకాలజిస్టులు, మత్తు వైద్యులు లేరు. కొన్నిచోట్ల వీరిద్దరూ ఉంటే కనీస అవసరాలైన రక్తనిధి వంటి సౌకర్యాలు లేవు. దీంతో సాధారణ ప్రసవాలు జరిగే కేసులు తప్ప కాస్త రిస్కు అనుకున్న కేసులను ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లమని సూచిస్తున్నారు. రక్తపోటు కారణంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలలో గత శుక్రవారం నిండు గర్భిణిని గుంటూరుకు పంపించబోతుంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులే అడ్డుకుని ఆ ఆసుపత్రిలోనే ప్రసవం జరిగేలా చేశారు. అక్కడ ముగ్గురు గైనకాలజిస్టులు ఉండడం గమనార్హం. ఇలా చాలాచోట్ల గర్భిణులు, రోగులకు సరైన ఆరోగ్య పరీక్షలు చేయకుండానే వైద్యులు పెద్దాసుపత్రులకు వెళ్లిపోమనడం రివాజుగా మారుతోంది. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలోని సీహెచ్సీల్లో ప్రసవాలే ఎక్కువగా జరుగుతుంటాయి. అయినా.. వైద్యులు కొన్నిచోట్ల ముందుకురాకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఈ పరిస్థితుల్లో దూరాభారం ప్రయాణం చేయలేక చాలామంది స్థానిక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి, వేలాది రూపాయలను చెల్లించుకుంటున్నారు. వైద్యవిధాన పరిషత్లో చేపట్టిన పునర్వ్యవస్థీకరణ కారణంగా వైద్యుల స్థానాల మారడంవల్ల కూడా సమస్యలొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిజేరియన్లు తగ్గించి సహజ ప్రసవాలకు కృషి చేయాల్సిన ప్రాంతీయ, సామాజిక ఆసుపత్రులు ఆ విషయంలో విఫలమవుతున్నాయి.. ముఖ్యంగా మత్తు వైద్య నిపుణులు లేక కాస్త రిస్కు అనిపించిన కేసులను చూడటంలేదు. శస్త్రచికిత్సలు, సిజేరియన్ల సమయంలో మత్తు వైద్యుల సేవలు కీలకం. ఆ నిపుణులు లేక గర్భిణులను ప్రసవం కోసం ఇతర ఆసుపత్రులకు పంపేస్తున్నారు. కొన్నిచోట్ల మత్తు వైద్యులతోపాటు గైనకాలజిస్టులూ లేరు.
* ప్రకాశం జిల్లా దర్శి సామాజిక వైద్యశాలలో నెలకు 70 నుంచి 80 వరకు ప్రసవాలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం 15 నుంచి 20 వరకే జరుగుతున్నాయి. మత్తు వైద్యుడు లేనందున.. సహజంగా జరిగే ప్రసవ కేసులను మాత్రమే చేర్చుకుంటున్నారు. కాస్త ఇబ్బంది అనిపిస్తే చాలు గర్భిణులను ఒంగోలు లేదా చీమకుర్తి పంపుతున్నారు. కొందరు తప్పనిసరై ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లిస్తున్నారు.
* కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో మూడు నెలల నుంచి మత్తు వైద్యుడు లేరు. అనంతపురంలోని సీడీ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా ప్రసవాలే జరగడంలేదు.
* పీలేరులోని 100 పడకల కమ్యూనిటీ ఆసుపత్రిలో కొన్ని నెలలుగా మత్తు వైద్యులు లేక శస్త్రచికిత్సలు అవసరమైన వారు మదనపల్లె లేదా తిరుపతికి వెళ్లాల్సి వస్తోంది. రాయచోటి ప్రభుత్వాసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అత్యవసర కేసులు కడప వెళ్తున్నాయి. ప్రతి బుధవారం కలికిరి లేదా వేరే ప్రాంతం నుంచి డిప్యుటేషన్పై మత్తుమందు వైద్యులు రాయచోటికి వస్తున్నారు. రాజంపేటలో వంద పడకల ఆసుపత్రి ఉన్నా మత్తు వైద్యులు లేక రోగులు తిరుపతి, కడప వెళ్తున్నారు.
సీఎం ఇలాకాలో ఇలా..
ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందులలోని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో 22 మంది వైద్యులకుగానూ 10 మందే ఉన్నారు. 3 గైనకాలజిస్టు పోస్టులున్నా ఒక్కరూ లేరు. ఇద్దరు మత్తు వైద్యులకుగానూ ఒకరు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఇక్కడ సాధారణ ప్రసవాలే చేస్తున్నారు. జులైలో 5, ఆగస్టులో ఇప్పటివరకు 13 జరిగాయి. రిస్కు ఉన్న కేసులను కడప రిమ్స్కు పంపుతున్నారు. పీలేరు, రాజంపేట, రాయచోటి ఆసుపత్రుల్లో మత్తుమందు వైద్యులు లేక అత్యవసర కేసులను బయటకు పంపుతున్నారు.
3 ఆసుపత్రులకు ఒక్కరే
మదనపల్లె డివిజన్లోని కలికిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు చెందిన మత్తు వైద్య నిపుణుడు 3ఆసుపత్రుల్లో పనిచేయాల్సి వస్తోంది. సోమ, శుక్రవారాలు పీలేరు ఆసుపత్రి, బుధవారం రాయచోటి ఆసుపత్రి, మిగిలిన రోజుల్లో కలికిరిలో పనిచేయాల్సి వస్తోంది. దీనివల్ల అత్యవసర కేసులకు తగిన సమయంలో శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితులు కనిపించడంలేదు.
రెండేళ్ల నుంచి ప్రసూతి వైద్యులు లేరు
గుంటూరు జిల్లా కొల్లిపర మండల సీహెచ్సీలో గత రెండేళ్ల నుంచి గైనకాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. దీనివల్ల ఇక్కడ ప్రసవాలు చేయడంలేదు. బాపట్ల జిల్లా మార్టూరు సీహెచ్సీలోనూ గైనిక్, మత్తుమందు వైద్యులు లేరు. పర్చూరు సీహెచ్సీలోనూ గైనిక్ వైద్యులు లేరు, రక్త పరీక్షల నిర్ధారణ, ఎక్సరే మిషన్లు లేవు.
శస్త్రచికిత్సలు జరగక పదేళ్లు!
ప్రకాశం జిల్లా కనిగిరిలోని కమ్యూనిటీ వైద్యశాలలో మత్తుమందు వైద్యులు లేనందున శస్త్రచికిత్సలు జరగక పదేళ్లయింది. మత్తు వైద్యులు ఉంటే నెలకు కనీసం 25 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరుగుతాయి. ఈ ఆసుపత్రి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకే పరిమితమైంది.
అరకులోయలో ఒక్కరూ లేరు
* అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇద్దరు మత్తు వైద్య నిపుణులకు గాను ఒక్కరూ లేరు. పాడేరు జిల్లా ఆసుపత్రి వైద్యుడే అరకులోయలో సేవలందిస్తున్నారు.
* శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, కవిటి, బారువా సీహెచ్సీల్లో ప్రసవాలే జరగడంలేదు.
* కుప్పం ప్రాంతీయ ఆసుపత్రి, పలమనేరు ప్రాంతీయ ఆసుపత్రి ఒకటి, 2 నెలల నుంచి మత్తు వైద్యులు లేనందున సాధారణ ప్రసవాలే చేస్తున్నారు. వి.కోట సీహెచ్సీలో మత్తుమందు వైద్యుడు చాలాకాలం నుంచి లేరు.
డిప్యుటేషన్ల వల్ల అరకొరగానే సేవలు!
కొన్ని ఆసుపత్రుల వారు సమీపంలోని ఆసుపత్రుల్లోని మత్తు వైద్యులను పిలిపిస్తున్నారు. కానీ అత్యవసరమైన వారికి వీరి సేవలు అందడంలేదు. ‘ఖాళీ స్థానాల్లో బోధనాసుపత్రులు, ప్రజారోగ్య శాఖ పరిధిలో పనిచేసే స్పెషలిస్టు వైద్యులను నియమించే చర్యలు మొదలయ్యాయి. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’ అని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?