Bhogapuram Airport: త్వరలో భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన?
అన్ని అడ్డంకులను అధిగమించి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ
విశాఖ ఎయిర్పోర్టు మూసివేతకు నౌకాదళం, ఏపీఏడీసీఎల్ ఒప్పందం
ఈనాడు, అమరావతి: అన్ని అడ్డంకులను అధిగమించి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ విమానాశ్రయాన్ని భోగాపురానికి తరలించడానికి భారత నౌకాదళం అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై నౌకాదళం, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) అధికారులు ఇటీవల దిల్లీలో సంతకాలు చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై ఉన్న కోర్టు కేసుల విచారణ కూడా తుది దశకు చేరింది. త్వరలో తీర్పు రానుంది.
విశాఖ విమానాశ్రయాన్ని మూసేయడంపై నౌకాదళ అధికారులతో ఏపీఏడీసీఎల్ ఏళ్లుగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ సమస్యను పరిష్కరించకుండా భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మించి ప్రయోజనం లేదని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది. నగరానికి సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని వినియోగించడానికే ప్రజలు ఆసక్తి చూపుతారు. దీనివల్ల రూ.కోట్లు వెచ్చించి కొత్తది నిర్మించినా ప్రయాణికులు వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తోంది. నౌకాదళం భద్రత దృష్ట్యా విశాఖ విమానాశ్రయం విస్తరణ సాధ్యమవడం లేదు. దీంతో సేవలను పెంచేందుకు భోగాపురం విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
నౌకాదళానికి 170 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం
విశాఖ విమానాశ్రయం 300 ఎకరాలలో ఉంది. ఇందులో 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా ఎంవోయూలో నిబంధన చేర్చారు. మిగిలిన 130 ఎకరాలను ఏంవోయూ నిబంధనల మేరకు ఏఏఐకి అప్పగించనున్నారు. మరోవైపు భోగాపురంలో నిర్మాణానికి మరో 28 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంది. దీనిపై ఉన్న కోర్టు కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?