Andhra News: జైళ్ల అధికారికి నగరపాలన.. పలుకుబడితో కోరుకున్నచోట పోస్టింగులు
జైళ్లశాఖలో అదనపు సూపరింటెండెంట్గా ఉన్న అధికారి మహా విశాఖ నగర పాలక సంస్థలో (జీవీఎంసీ) కీలక విభాగానికి అదనపు కమిషనరు.సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఏలూరు నగరపాలక సంస్థకు కమిషనరు
డిప్యుటేషన్పై 38 మంది రాక
* జైళ్లశాఖలో అదనపు సూపరింటెండెంట్గా ఉన్న అధికారి మహా విశాఖ నగర పాలక సంస్థలో (జీవీఎంసీ) కీలక విభాగానికి అదనపు కమిషనరు.
* సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఏలూరు నగరపాలక సంస్థకు కమిషనరు
* స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో (సెబ్) అసిస్టెంట్ కమిషనరు రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థకు వైస్ ఛైర్మన్
ఈనాడు, అమరావతి: పురపాలక, నగర పరిపాలనతో సంబంధం లేని ఇతర శాఖలకు చెందిన అధికారులకు పలుకుబడితో కీలక బాధ్యతలు దక్కుతున్నాయి. జైళ్లు, సాంఘిక సంక్షేమశాఖ, సెబ్ అధికారులే కాదు.. వైద్య కళాశాలలో అధ్యాపకురాలు, వ్యవసాయ, సహకారశాఖలో సహాయ సంచాలకులు, డిప్యూటీ రిజిస్ట్రార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనరు.. ఇలా దాదాపు 38 మంది డిప్యుటేషన్పై పుర, నగరపాలక సంస్థల్లో కమిషనర్లు, సహాయ, ఉప కమిషనర్లుగా పని చేస్తున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల్లో వైస్ ఛైర్మన్లుగా, కార్యదర్శులుగా కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరిలో అత్యధికులు ప్రభుత్వంలో తమ పలుకుబడినుపయోగించి గత రెండు, మూడేళ్లలోనే నచ్చిన చోటుకు డిప్యుటేషన్పై పోస్టింగులు తెప్పించుకున్నారు.
పుర, నగరపాలక సంస్థల్లో, పట్టణాభివృద్ధి సంస్థల్లో కమిషనర్లుగా, వైస్ ఛైర్మన్లుగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత కలిగిన అధికారులకు పురపాలకశాఖలో కొదవ లేదు. అయినా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చే అధికారుల సంఖ్య భారీగా పెరుగుతోంది.విచిత్రం ఏమిటంటే సీనియర్ అధికారులు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై వచ్చే జూనియర్ అధికారుల కింద పని చేస్తున్నారు. కమిషనర్ల సర్వీసు నిబంధనల్లో ఏ పోస్టునూ డిప్యుటేషన్పై నియమించడానికి లేదు. ఇలాంటి నియామకాలు నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోవడం లేదు.
పురపాలనపైనే ఎందుకీ ప్రేమ?
ఇతర ప్రభుత్వశాఖల్లో కంటే ఎక్కువ మంది పుర, పట్టణాభివృద్ధిశాఖలో డిప్యుటేషన్పై పని చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కీలకమైన పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలను చేతుల్లో పెట్టుకుంటే నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చన్న భావనతోనూ చాలామంది ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అనిశా ఇటీవల కొన్ని తనిఖీలు నిర్వహించినపుడు వెలుగు చూసిన అక్రమాల్లో డిప్యుటేషన్పై పని చేస్తున్న కొందరి అధికారుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది.
పుర, నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల్లో డిప్యుటేషన్పై కమిషనర్లు, అదనపు కమిషనర్లు, వైస్ ఛైర్మన్లుగా పని చేస్తున్న ఇతర ప్రభుత్వశాఖల అధికారులు
పుర, నగరపాలక కమిషనర్లు: 12
వైస్ ఛైర్మన్లు: 6
అదనపు కమిషనర్లు, ఉప కమిషనర్లు: 10
జోనల్ కమిషనర్లు: 2
కార్యదర్శులు: 6
ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు: 2
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం