రాష్ట్రానికి పారిశ్రామిక దిగ్గజాలు
దేశంలో పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలంతా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంవైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. భజంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు, అదానీలు, ఆర్సెలర్ ఆదిత్య మిత్తల్,
దావోస్ నుంచి మేమే ఎక్కువ పెట్టుబడులు తెచ్చాం
అసెంబ్లీలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: దేశంలో పేరొందిన పారిశ్రామిక దిగ్గజాలంతా మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంవైపు అడుగులు వేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. భజంకాలు, బంగర్లు, సింఘ్వీలు, బిర్లాలు, అదానీలు, ఆర్సెలర్ ఆదిత్య మిత్తల్, రుయాలు, టాటాలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారని చెప్పారు. వారిలో పూర్తి స్థాయిలో నమ్మకం పెంపొందిస్తున్నామని, గతంలో చంద్రబాబు హయాంలో అయితే ఏది కావాలన్నా నాకెంత? అనే పరిస్థితి ఉండేదని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘కడప జిల్లా బద్వేలులో భజంకాలు సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను పెడుతున్నారు. శ్రీ సిమెంట్స్ ఏర్పాటుకు బంగర్లు, సన్ ఫార్మా పెట్టేందుకు సింఘ్వీలు వచ్చారు. కుమార మంగళం బిర్లా తన ప్లాంటును ప్రారంభించారు’ అని వివరించారు. ‘రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలంతా సంతోషంగా ఉన్నారు కాబట్టే 2020 సులభతర వాణిజ్యం ర్యాంకుల్లో 97.89% మార్కులతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. 2021-22 సంవత్సరంలో 2010-11 స్థిర ధరల ప్రకారం (కాన్స్టెంట్ ప్రైసెస్) 11.43% వృద్ధిరేటుతో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాం’ అని చెప్పారు. ‘విశాఖ చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక నడవాల పనులు వేగవంతం చేస్తున్నాం. రెండు నైపుణ్య విశ్వవిద్యాలయాలు, వాటి పరిధిలో 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటు ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని తెలిపారు.
2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు..
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2,06,638 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. అందులో 1,25,110 మంది గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనం ద్వారా 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులు, 16,880 మంది వైద్య, 6,321 మంది విద్యా రంగాల్లో ఉన్నారని వివరించారు. ఆప్కాస్ ఏర్పాటు ద్వారా 95,212 మంది ఒప్పంద ఉద్యోగులకు పూర్తి జీతాలు అందిస్తున్నామన్నారు. ఉద్యోగుల వివరాలు, పథకాలవారీ లబ్ధిదారుల సంఖ్యను సభలో ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
కొవిడ్ సమయంలోనూ పెట్టుబడులు తెచ్చాం
కొవిడ్ సమయంలోనూ విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, చంద్రబాబు దావోస్ వెళ్లి తెచ్చిన వాటి కంటే తామే ఎక్కువ తెచ్చామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ‘చంద్రబాబు హయాంలో ఏడాదికి సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడి సమకూరితే.. మా ప్రభుత్వ హయాంలో రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి’ అని వివరించారు. ‘2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.46,280 కోట్లతో 99 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించగా 62,541 మందికి ఉద్యోగాలు వచ్చాయి. రూ.9,742.51 కోట్ల వ్యయంతో 35,181 ఎంఎస్ఎంఈలు (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ఏర్పాటు కాగా 2,11,374 మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.39,655 కోట్లతో నిర్మాణ దశలో ఉన్న 55 భారీ ప్రాజెక్టుల ద్వారా 78,792 మందికి ఉద్యోగాలు వస్తాయి. రూ.91,129 కోట్ల పెట్టుబడుల అంచనాతో చేపట్టే 10 ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 40,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్నం, కృష్ణా, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్ ఆధ్వర్యంలో నిర్మించే ప్లాంట్ల ద్వారా రూ. 1,06,800 కోట్ల పెట్టుబడితో 72,900 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని సీఎం పేర్కొన్నారు. ‘కొప్పర్తిలో 6,800 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కారిడార్, మెగా పారిశ్రామిక హబ్ ద్వారా 1,03,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాం’ అని వివరించారు. దేశంలోని 17 రాష్ట్రాలతో పోటీ పడి కాకినాడ బల్క్ డ్రగ్ పార్కును సాధించామన్నారు. దీనిద్వారా 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని, కేంద్రం రూ.1,000 కోట్లు ఇస్తుందని చెప్పారు.
దగదర్తి బదులుగా మరోచోట విమానాశ్రయం
నెల్లూరు జిల్లా దగదర్తి బదులుగా మరో ప్రాంతంలో ఒంగోలు వైపు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు జగన్ చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించే విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో నడుస్తున్న భూ వివాదం చివరి దశకు వచ్చిందని వివరించారు. విమానాశ్రయ పనులు పూర్తయ్యే నాటికి రోడ్డు పూర్తి చేస్తామని, కేంద్రం నుంచి దీనికి మద్దతు ఉందని పేర్కొన్నారు. ‘నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళంజిల్లా భావనపాడు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కాకినాడలో ప్రైవేటు రంగంలో సెజ్ పోర్టును గ్రీన్ఫీల్డ్ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం. రూ.3,500 కోట్ల వ్యయంతో 9 చేపల రేవులు నిర్మిస్తున్నాం. నాలుగింటిని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి