పోలవరం ముంపుపై సమగ్ర అధ్యయనం చేయాలి
పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఏపీ చేపట్టాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్
కాళేశ్వరం అదనపు టీఎంసీకి అనుమతులు ఇవ్వాలి
కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖకు తెలంగాణ లేఖలు
ఈనాడు, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపు ప్రభావం, తెలంగాణ ప్రాంతంలో పరిరక్షణ చర్యలను ఏపీ చేపట్టాలని కోరుతూ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ముంపు ఏర్పడుతోందని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏపీ స్పందించి రెండు రాష్ట్రాల పరిధిలో రక్షణ చర్యలు చేపట్టిందని, తెలంగాణలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అదనపు టీఎంసీ తరలింపునకు అనుమతులివ్వాలని మరో లేఖలో కోరారు. కర్ణాటక చేపడుతున్న ఎగువ తుంగ-భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వడం సరికాదని మరో లేఖ ద్వారా తెలిపారు. లేఖల్లో ఏం చెప్పారంటే...
* పోలవరం ప్రాజెక్టు స్పిల్వే 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో (42.67 మీటర్లు) సీడబ్ల్యూసీ డిజైన్ చేయగా 36 లక్షల క్యూసెక్కుల మేరకు మాత్రమే నిర్మించారని ఐఐటీ హైదరాబాద్ అధ్యయనం చెబుతుంది. ఈ మేరకు వచ్చే ముంపుపైనే సాంకేతికంగా అధ్యయనం జరిగింది. ఇప్పటికే భద్రాచలం టెంపుల్ టౌన్, మణుగూరు భారజల కర్మాగారం, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాలతో పాటు పలు గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే నది వెనుక భాగంలో ఏర్పడే పూడికతో ముంపు పెరుగుతుంది. ఈ కోణంలో అధ్యయనం చేయాలి.
నివేదికను ఏపీ పట్టించుకోవడం లేదు
* గోదావరిలో కలిసే నదులు పోటెత్తడం వల్ల సాగుభూములు, ఎత్తిపోతల పథకాలు, ఐటీసీ పార్కు, భారజల కర్మాగారం ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే వంద గ్రామాల్లో ముంపు ఏర్పడుతుండగా మరో అరవై గ్రామాలకు ప్రమాదం ఉంది. భదాద్రి జిల్లాలోని ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ నివేదిక సూచిస్తుండగా ఏపీ పట్టించుకోవడం లేదు.
* పోలవరం జలాశయం వెనుక మిగులు, వరద జలాల ఆధారంగా ఏపీ పలు ఎత్తిపోతల పథకాలు చేపట్టింది. వీటి కోసం ప్రాజెక్టులో నిల్వను ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగిస్తే ఎంతో ప్రమాదం. ఈ నిర్మాణాలను నిలువరించాలి.
* పోలవరం స్పిల్వే, కాఫర్ డ్యాం (42.5 మీటర్లు) పూర్తవ్వగా ఈ ఏడాది జులైలో 38.76 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యాక పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్ల వద్ద నిల్వ ఉంటే దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు రెండు వైపులా అదనంగా 60 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో జలాశయంలో గరిష్ఠ స్థాయి 193.5 అడుగుల వద్ద (59 మీటర్లు) నిల్వ ఉన్న సమయంలో భద్రాచలం వద్ద వరద స్థాయి 33.60 లక్షల క్యూసెక్కులు ఉండే అవకాశాలున్నట్లు సీడబ్ల్యూసీ 2012లో పేర్కొంది. దీనికి అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేయాలి.
* కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగానే అదనపు టీఎంసీ తరలింపునకు చేపడుతున్న నిర్మాణాలపై (కంపోనెంట్లు) మాత్రమే సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. గోదావరి బోర్డు జారీ చేయాల్సిన అనుమతుల ప్రక్రియకు కోర్టు ఉత్తర్వులు వర్తించవు. కేంద్రం జారీ చేసిన గెజిట్లో పేర్కొన్న అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితా నుంచి దీనిని తొలగించండి.
* కర్ణాటక చేపట్టిన ఎగువ తుంగ, ఎగువ భద్ర ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం ఇచ్చిన అనుమతులు నిలిపివేయాలి. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పు అమల్లోకి రావాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు కృష్ణా పరీవాహక(సబ్ బేసిన్-8) పరిధిలోనివి. కేడబ్ల్యూడీటీ-1 ఆ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్