HCA: అభిమానంతో ఆటలు
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అంటేనే వివాదాల నిలయం. కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకున్న హెచ్సీఏ.. ఇప్పుడు లేక లేక ఓ అంతర్జాతీయ
టీ 20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకంలో గందరగోళం
జింఖానాలో తొక్కిసలాట.. లాఠీఛార్జి
20 మందికి గాయాలు.. హెచ్సీఏపై విమర్శలు
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అంటేనే వివాదాల నిలయం. కొన్నేళ్లుగా అవినీతి, అక్రమాలు, అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకున్న హెచ్సీఏ.. ఇప్పుడు లేక లేక ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు అవకాశం వస్తే, సవ్యంగా టికెట్లు విక్రయించలేక జాతీయస్థాయిలో అభాసుపాలైంది. ఆదివారం ఉప్పల్లో జరగాల్సిన భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో హెచ్సీఏ వైఖరి ఆదినుంచీ అనుమానాస్పదంగా ఉంది. చివరికి అభిమానుల ఒత్తిడి తట్టుకోలేక సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం చేపట్టినా.. కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో అభిమానుల ప్రాణం మీదకు వచ్చింది.
ఈనాడు, హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్కు సంబంధించి గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హెచ్సీఏ వైఫల్యం అభిమానుల్ని అష్టకష్టాలకు గురిచేసింది. మొత్తం టికెట్లన్నీ ఆన్లైన్లోనే అమ్మాలని హెచ్సీఏ మొదట నిర్ణయించగా.. పేటీఎంలో టికెట్ల కోసం ప్రయత్నించినవారికి తీవ్ర నిరాశ తప్పలేదు. నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైనట్లు చూపించడంతో అభిమానులు బుధవారం జింఖానా ముందు ఆందోళనకు దిగారు. స్టేడియం లోపల బైఠాయించారు. దీంతో హెచ్సీఏ గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జింఖానాలో టికెట్లు అమ్ముతామని ప్రకటించింది. దీంతో రాత్రి ఒంటి గంట నుంచే అభిమానులు మైదానం గేట్ల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 8 గంటలకల్లా వేల సంఖ్యలో తరలివచ్చారు. గేట్లు తెరవగానే కొందరు లోపలికి వెళ్లి వరుసలో నిల్చున్నారు. అభిమానుల సంఖ్య పెరిగిపోవడంతో భద్రతా సిబ్బంది గేట్లు మూసేశారు. రానురాను అభిమానుల సంఖ్య పెరిగిపోయి.. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకు బారులు తీరారు. ఉదయం 10.30 గంటలకు టికెట్ల విక్రయం మొదలవుతుందనగా గేట్లు తెరిచారు. ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున తోసుకుంటూ రావడంతో ముందు నిలుచున్నవారు కిందపడిపోయారు. వారిని తొక్కుకుంటూ కొందరు ముందుకెళ్లిపోయారు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. లాఠీఛార్జి చేశారు. కిందపడిపోయిన వారిని పక్కకు తీసుకొచ్చారు. స్పృహ తప్పి పడిపోయిన జింఖానా స్వీపర్ రంజిత (48)కు కానిస్టేబుల్ నవీన సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. తొక్కిసలాటలో 20 మంది గాయపడగా.. రంజితతో పాటు బేగంపేట ఠాణా కానిస్టేబుల్ శ్రీకాంత్ (36), కవాడిగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్ (23), తిరుమలగిరి ఇందిరానగర్ వాసి విద్యార్థి సయ్యద్ ఆలియా (19), కొంపల్లి బహదూర్పల్లికి చెందిన సాయి కిశోర్ (25), సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్కు చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్యాదవ్ (37), జేఎన్టీయూ కేపీహెచ్బీ వాసి సుజాత (26)లను ఆసుపత్రికి తరలించారు. వీరిలో సాయికిశోర్, సుజాతలను ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జి చేశారు. మరోవైపు మధ్యాహ్నం తర్వాత టికెట్లు అయిపోయినట్లు నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఉసూరుమంటూ వెనుదిరిగారు.
కొరవడిన నియంత్రణ
క్రికెట్ అభిమానులు భారీగా తరలి వస్తారన్న అంచనా ఉన్నా.. నియంత్రణకు బ్యారికేడ్లు పెట్టలేదు. క్యూలైన్లు ఏర్పాటు చేయలేదు. కనీసం మంచినీళ్లు కూడా లేకుండా గాలికొదిలేశారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్, మిగతా ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం ఈ దుస్థితికి కారణమన్న విమర్శలొస్తున్నాయి.హెచ్సీఏ నిర్వహణ లోపం కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని, దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి న్యాయపరమైన చర్యలు చేపడతామని హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు కమిషనర్ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.
ఘటనపై విచారణ చేపట్టాలి: పవన్కల్యాణ్
హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ టికెట్లను పారదర్శకంగా విక్రయిస్తే లాఠీఛార్జి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కాదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జింఖానా గ్రౌండ్స్లో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు