ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ నిర్వీర్యం!
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై దృష్టి పెట్టిన వైకాపా ప్రభుత్వం ఎన్నడూ అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. దీనివల్ల వైద్య విద్యలో కీలకమైన పరిశోధనలు జరగడం లేదు. ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాల
నానాటికీ దిగజారిపోతున్న ప్రగతి పనులు
నిధుల మళ్లింపుతో ఏమీ చేయలేని దుస్థితి
అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం ఆటంకాలు
ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై దృష్టి పెట్టిన వైకాపా ప్రభుత్వం ఎన్నడూ అభివృద్ధి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. దీనివల్ల వైద్య విద్యలో కీలకమైన పరిశోధనలు జరగడం లేదు. ప్రవేశాలు, పరీక్షలు, ఫలితాల వెల్లడికి మాత్రమే కార్యకలాపాలు పరిమితమయ్యాయి. ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా విద్యార్థుల ఫీజుల ఆధారంగా వచ్చిన మొత్తంలో అధిక భాగాన్ని ప్రభుత్వమే తీసేసుకుంది. గతేడాది చివర్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ రూ.400 కోట్లను మళ్లించుకుంది. ప్రస్తుతం వడ్డీ ఇస్తున్నా, అది ఎంతకాలమో తెలియదని ఉద్యోగులు చెబుతున్నారు. నిధులు ఖజానాలో ఉన్నప్పటికీ, అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి వస్తోంది. ఉద్యోగులకు నెలకు వేతనాల కింద రూ.12కోట్ల వరకు అవసరం కాగా, ప్రభుత్వం రూ.5.5 కోట్లే కేటాయిస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఫీజుల ద్వారా సర్దుబాటు చేస్తోంది. విశ్వవిద్యాలయ అవసరాలకు 221 మంది ఉద్యోగులు అవసరం కాగా 80 మందే శాశ్వత విధానంలో పని చేస్తున్నారు. మరికొందరు పొరుగుసేవల కింద నియమితులయ్యారు. పదోన్నతులు లేక సీనియర్ ఉద్యోగులు నష్టపోతున్నారు. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సుమారు 350 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థలకు వర్సిటీ మార్గదర్శకంగా ఉండాలి. కొత్తగా వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పే ప్రభుత్వం వాటికి దిశానిర్దేశం చేయాల్సిన విశ్వవిద్యాలయ అభివృద్ధిని తొక్కేస్తోంది.
అభద్రతా భావం
విశ్వవిద్యాలయాన్ని నడిపించే వీసీ, రిజిస్ట్రార్లోనూ అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు.. ఈ పదవుల్లో నుంచి తమను తప్పిస్తారోనన్న ఆందోళనలో వారు విధులు నిర్వర్తిస్తున్నారు. గత ప్రభుత్వం మారిన కొద్దికాలానికి అప్పటి వీసీ సీవీ రావును, రిజిస్ట్రార్ పదవిలో ఉన్న శంకర్ను ఇటీవల వైకాపా ప్రభుత్వం తప్పించింది. రిజిస్ట్రార్ పోస్టు భర్తీకి ఐదారు దరఖాస్తులు రాగా ‘మెచ్చిన’వారు లేరని నియామకాన్ని ప్రభుత్వం పక్కనబెట్టింది. ప్రస్తుతం ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
పొరుగు విధానంపైనే ఆధారం!
విశ్వవిద్యాలయానికి సొంత వైద్య కళాశాల, ఇతర విద్యాసంస్థలు లేనందున పొరుగు రాష్ట్రాల్లోని వైద్య బోధకుల ద్వారా పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన జరుగుతోంది. ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నా అవి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయ పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. అక్కడ పనిచేసే బోధకులపై వర్సిటీ పర్యవేక్షణ ఉండటం లేదు. అభివృద్దికి ఇదొక ప్రతిబంధకంగా మారుతోంది. వివిధ సంస్థల ఒప్పందాలతో నామమాత్రంగా పరిశోధనలు చేస్తున్నారు. అత్యాధునిక ల్యాబ్స్ లేవు. కిందటేడాది ఎన్నారై కోటా సీట్ల భర్తీలో బ్లాకింగ్ వ్యవహారం విశ్వవిద్యాలయాన్ని కుదిపేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనందువల్ల కార్యకలాపాలు తరచూ వివాదాస్పదమవుతున్నాయి.
అమరావతిని భ్రష్ఠు పట్టించడంతో...!
గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో విశ్వవిద్యాలయ కార్యకలాపాల విస్తృతి కోసం సుమారు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వైకాపా ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడంతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం 2.5 ఎకరాల విస్తీర్ణంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. స్థలం ఎక్కువగా ఉంటే వైద్య విద్యకు సంబంధించిన అన్ని రకాల మండళ్లు, కార్యాలయాలు ఒకేచోట ఉండేందుకు వీలవుతుంది. ప్రభుత్వ చర్యలతో అది సాధ్యం కాలేదు.
విద్యార్థులకు కొత్త అవస్థలు
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. 2022-23 విద్యా సంవత్సరంతో కోర్సులు పూర్తిచేసే వారికి కొత్త సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. అనుబంధ వైద్య విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఆరోగ్య విశ్వవిద్యాలయం సెమిస్టర్, వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది. ఎంబీబీఎస్, పీజీ, హోమియో, యునాని, ఆయుర్వేద, తదితర కోర్సులకు సంబంధించి సుమారు 20వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు చివరి సంవత్సరం మార్కుల మెమో వైఎస్సార్ పేరుతో, అంతకుముందు ఉన్న మార్కుల మెమోలు ఎన్టీఆర్ పేరుతో ఉండడంవల్ల ఉన్నత విద్య, ఉద్యోగాల్లో చేరేప్పుడు విద్యార్థులు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పేరు మారుస్తారు. దీనివల్ల ఎవరైనా చూస్తే ఎన్టీఆర్ పేరు కనిపించదు. ఈ సమస్యలపై అధికారులు స్పందిస్తూ.. ‘ప్రభుత్వం జారీచేసే గెజిట్లో పూర్తి వివరాలు ఉంటాయి. పేరు మార్పు ఎప్పటినుంచి అమల్లోకి వచ్చిందో వివరణ ఉంటుంది. దీనిని విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచుతారు. విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగాలను పొందే సమయంలో గెజిట్ ప్రతిని అదనంగా దరఖాస్తులతోపాటు జతచేస్తే మంచిది. ఒకవేళ ఆయా సంస్థల నుంచి విశ్వవిద్యాలయానికి సమాచారం వస్తే దానికి తగ్గట్లు పేరు మార్పు వ్యవహారంపై వివరణ పంపుతారు. కొన్నాళ్లు ఈ సాంకేతిక సమస్యలు తప్పవు. విశ్వవిద్యాలయం ఒకేసారి బల్క్లో మార్కుల మెమోలు, పట్టాలు ముద్రిస్తుంది. తాజా నిర్ణయంవల్ల కొన్ని ఉపయోగించలేని పరిస్థితులు తలెత్తుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్