కుప్పాన్ని పులివెందులలా చూస్తా
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించాం. 39 నెలల్లో రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.1,17,667 కోట్ల నగదు బదిలీ చేశాం.
అవసరమైన నిధులు విడుదల చేస్తా
జనవరి నుంచి వృద్ధాప్య పింఛను రూ.2,750
మా ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే
వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించాం. 39 నెలల్లో రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.1,17,667 కోట్ల నగదు బదిలీ చేశాం. అన్నివర్గాలకూ కలిపితే ఇది రూ.1,71,244 కోట్లు. అర్హతే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం.
- సీఎం జగన్
ఈనాడు డిజిటల్, చిత్తూరు
ప్రస్తుతం ఇస్తున్న వృద్ధాప్య పింఛనును వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,750కి పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు 33 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన ఆరోపించారు. ‘కుప్పాన్ని నా సొంత నియోజకవర్గం పులివెందులలా చూస్తా.. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు విడుదల చేస్తా’ అని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని పునరుద్ఘాటించారు. చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక పరిధిలోని అనిమిగానిపల్లె సమీపంలో శుక్రవారం వైఎస్ఆర్ చేయూత మూడో విడత నిధుల విడుదల కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై ప్రసంగించారు. ఆయన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ‘వైకాపా అధికారంలోకి రాకముందు ఉన్న బడ్జెటే.. ఇప్పుడూ ఉంది. తెదేపా హయాంలో కన్నా మా ప్రభుత్వం అప్పులు తక్కువ చేసింది. అప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు? అప్పటి పాలనకు.. ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా’ అని జగన్ పేర్కొన్నారు. ‘మీ ఎమ్మెల్యే గురించి నాలుగు మాటలు చెబుతా. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పలేం. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉంది. హంద్రీ-నీవా కాలువ పనులు పూర్తి చేస్తే కరవు ఉండదని తెలిసినా.. ఆయన పరిష్కారం చూపలేకపోయారు.
కుప్పంలో నిత్యం 5వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. మరో ఆరు నెలల్లో హంద్రీ-నీవా పనులు పూర్తి చేస్తాం. కుప్పం బ్రాంచ్ కాలువ (కేబీసీ) సామర్థ్యాన్ని పెంచుతాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ ఆటంకాలు తొలగించి నిర్మాణాలు చేపడతాం. ఇక్కడి ప్రజలు అభివృద్ధి వైపు చూశారు కాబట్టే పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేసింది. చంద్రబాబుకు ఇప్పటివరకూ కుప్పంలో ఇల్లు కూడా లేదు. ఆయన నియోజకవర్గానికి స్థానికేతరుడు’ అని జగన్ దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఇన్ఛార్జి మంత్రి ఉష శ్రీచరణ్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేగౌడ, ఎంఎస్ బాబు, ఆరణి శ్రీనివాసులు, ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఏపీఎస్ఆర్టీసీ వైస్ఛైర్మన్ విజయానందరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, జేసీ వెంకటేశ్వర్, ఎస్పీ రిషాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీగా బారికేడ్లు: జగన్ ముఖ్యమంత్రిగా తొలిసారి కుప్పం రావడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు, వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రహదారుల పక్కన, ఇళ్లపైనా ఖాకీలు పహరా కాశారు. సీఎం సభకు కుప్పం నియోజకవర్గవాసుల కన్నా ఎక్కువగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లోని మహిళలు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని వారిని తరలించడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ