సీఎం సభ ఉంటే.. నిబంధనలు బలాదూర్!
విద్యార్థులను ఇంటి నుంచి బడి, కళాశాలకు తీసుకెళ్లడం, మళ్లీ వారిని ఇంటికి చేర్చడానికే విద్యాసంస్థల బస్సులు వినియోగించాలి. ఇది రవాణాశాఖ కచ్చితమైన నిబంధన. ఏదైనా విజ్ఞాన
కుప్పం సభకు వందల సంఖ్యలో విద్యాసంస్థల బస్సులు
దగ్గరుండి సమకూర్చిన రవాణాశాఖ అధికారులు
ఈనాడు, అమరావతి: విద్యార్థులను ఇంటి నుంచి బడి, కళాశాలకు తీసుకెళ్లడం, మళ్లీ వారిని ఇంటికి చేర్చడానికే విద్యాసంస్థల బస్సులు వినియోగించాలి. ఇది రవాణాశాఖ కచ్చితమైన నిబంధన. ఏదైనా విజ్ఞాన ప్రదర్శనలకు విద్యార్థులను తీసుకెళ్లాలంటే రవాణాశాఖకు సమాచారం ఇవ్వాలి. ఇది మినహా మరే ఇతర సభలు, సమావేశాలు, కార్యక్రమాలు, వేడుకలకు బడి బస్సులు వాడకూడదు. ఈ నిబంధనలు ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రైవేటు వ్యక్తుల విషయంలోనే అమలవుతున్నాయి. సీఎం సభలు, అధికార పార్టీ కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి.. రవాణాశాఖ తన నిబంధనలను తానే ఉల్లంఘిస్తోంది. నిబంధనలు తమకు వర్తించవనేలా వ్యవహరిస్తోంది. ఏదైనా జిల్లాలో సీఎం సభ ఉంటే చాలు.. వందల్లో విద్యాసంస్థల బస్సులను రవాణాశాఖ అధికారులే సమకూరుస్తున్నారు. బస్సులు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇదే తంతు సాగుతుండగా, శుక్రవారం కుప్పంలో జరిగిన సీఎం సభకూ ఇలాగే రవాణాశాఖ ప్రత్యేక పర్యవేక్షణలో విద్యాసంస్థల బస్సులను సమకూర్చి.. నిబంధనలతో తమకు పనిలేదని నిరూపించుకున్నారు.
బడి బస్సులన్నీ చలో కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన సీఎం సభకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి 1,000 వరకు బస్సులు, వాహనాలు సమకూర్చగా.. ఇందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 400, ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు, మ్యాక్సీ క్యాబ్లు 350 వరకు ఉన్నాయి. మిగిలిన 250 ప్రైవేటు విద్యాసంస్థల బస్సులేనని తెలిసింది. సమావేశానికి జనాన్ని తరలించేందుకు బస్సులు పంపాల్సిందేనని రవాణాశాఖ అధికారులు కొద్దిరోజుల ముందుగానే అన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు చెప్పారు. అవి గురువారం రాత్రికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని రవాణాశాఖ కార్యాలయాలకు బస్సులను పంపేశాయి. అక్కడ అధికారులు దగ్గరుండి.. ఏయే బస్సులు ఏ గ్రామాలకు వెళ్లి జనాలను తీసుకురావాలనే రూట్ నిర్ణయించి పంపారు. అవన్నీ జనాలను ఎక్కించుకొని, కుప్పం సభకు తీసుకొచ్చి.. మళ్లీ వారిని గ్రామాల్లో దించాయి.
ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు శుక్రవారం అనధికారికంగా సెలవు ప్రకటించాయి. తరగతులు జరగవని, విద్యార్థులను పంపొద్దని తల్లిదండ్రులకు ముందే సమాచారం పంపించాయి. బడి బస్సులు తీసుకున్నందున ప్రైవేటు బడులకు సెలవు ప్రకటిద్దామని.. కొన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులను కోరినట్లు సమాచారం. ఇలా అధికారిక ఆదేశాలిస్తే నెగెటివ్ ప్రచారం జరుగుతోందని, అందుకే బడులు నిర్వహించొద్దని అనధికారికంగా చెప్పాలంటూ డీఈవోలు సూచించారని తెలిసింది.
బస్సులు ఇవ్వకుంటే 32 నిబంధనలు గుర్తుకొస్తాయి
సీఎం సభలకు బస్సులు ఇచ్చేందుకు ఏదైనా విద్యాసంస్థ ముందుకు రాకపోతే.. వాటిపై రవాణాశాఖ నిబంధనల పేరుతో విరుచుకుపడుతుంది. మోటారు వాహన చట్టంలో బడి బస్సుల నిర్వహణకు 32 నిబంధనలు ఉన్నాయి. అడిగినన్ని బస్సులు ఇవ్వకపోతే.. అధికారులు వీటిలో ఏదో ఒక నిబంధన ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తారు.
ఏడేళ్ల కిందట కలెక్టర్లకు లేఖలు
విద్యాసంస్థల బస్సులను రాజకీయ, ప్రైవేటు కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు వినియోగించొద్దని 2015 ఫిబ్రవరిలో అప్పటి రవాణాశాఖ కమిషనర్ జి.అనంతరాము కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు. కానీ ఇదెక్కడా అమలు కావడం లేదు. సీఎం కార్యక్రమాలకు రవాణాశాఖ అధికారులు పోటీపడి బడి బస్సులు సమకూరుస్తూనే ఉన్నారు.
కొంత కాలంగా ఇదే తంతు
* ఈ ఏడాది జులైలో వాహనమిత్ర పథకం మూడోవిడత కార్యక్రమం విశాఖలో నిర్వహించగా.. దీనికి విశాఖపట్నం జిల్లా పరిధిలో పెద్ద సంఖ్యలో విద్యాసంస్థల బస్సులు వినియోగించారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అక్కడి జిల్లా రవాణాశాఖ అధికారి.. డీఈవోకి అధికారికంగా లేఖ ఇచ్చి మరీ సెలవు ఇచ్చేలా చూశారు.
* జులైలోనే గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన వైకాపా ప్లీనరీకి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల విద్యాసంస్థల బస్సులను రెండు రోజులపాటు మళ్లించారు. దీనివల్ల జులై 5,6 తేదీలకు బదులు 11న బడులు తెరవాల్సి వచ్చింది.
* ఈ ఏడాది ఏప్రిల్లో ఒంగోలులో జరిగిన సీఎం సభకు కాన్వాయ్ వాహనం కోసం.. రవాణాశాఖ అధికారులు దౌర్జన్యం చేశారు. వాహనంలో తిరుపతి వెళ్తున్న ఓ కుటుంబం భోజనం కోసం హోటల్ వద్ద రాత్రి ఆగితే, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని సీఎం కాన్వాయ్కి తరలించారు. దీంతో ఆ కుటుంబం రాత్రివేళ రోడ్డుపై నిలిచిపోయి అవస్థలు పడాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు