ప్రభుత్వ బడుల్లో రివర్స్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రివర్స్ గేర్లో పడినట్లయింది. తరగతుల విలీన ప్రభావంతోపాటు కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో
2021-22తో పోల్చితే ఈ ఏడాది 3.50 లక్షల మంది విద్యార్థుల తగ్గుదల
కరోనా వేళ దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో పెరిగిన విద్యార్థులు
తమ సంస్కరణల ఫలితమేనంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం
తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించకపోవడంతోనే మళ్లీ ప్రైవేటు బాట
పాఠశాలల విలీనం తెచ్చిన గందరగోళమూ కారణమే
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు రివర్స్ గేర్లో పడినట్లయింది. తరగతుల విలీన ప్రభావంతోపాటు కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా విద్యార్థుల సంఖ్య 3.50 లక్షలు తగ్గింది. విద్యా రంగంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలతోనే విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఇప్పటి వరకు గొప్పగా ప్రకటించుకున్న ప్రభుత్వం ఈసారి పిల్లలు తగ్గడంపై ఏం చెబుతుంది? ‘నాడు- నేడు’ కింద బడులకు రంగులు వేసి, అందంగా ముస్తాబు చేసినంత మాత్రాన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందా? నాడు- నేడు, విద్యా కానుకలతో పిల్లల సంఖ్య పెరిగితే ఏటా ఆ వృద్ధి కనిపించాలి కదా! లేదంటే గతేడాది ఉన్న వారే ఉండాలి కదా? పిల్లలు ఎందుకు తగ్గారు? నాణ్యమైన విద్య ఎక్కడ అందితే తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడికి పంపించేందుకు ఇష్టపడుతున్నారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన పేదలు, దిగువ మధ్యతరగతివారు ప్రైవేటు బడుల్లో ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అసర్ సర్వే-2021 ప్రకారం జాతీయ స్థాయి సరాసరి చూస్తే 2018లో 64.3 శాతం మంది ప్రభుత్వ బడుల్లో ఉండగా.. 2021కి 70.3 శాతానికి పెరిగింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 43.1 శాతం నుంచి 56.3 శాతానికి పెరిగింది. కానీ సంస్కరణలతోనే విద్యార్థులు పెరిగినట్లు ప్రభుత్వం, అధికారులు ప్రచారం చేశారు. అయితే అలా వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే భరోసా కల్పించకలేకపోయారని, అందువల్లే వారు తిరిగి ప్రైవేటు బాట పట్టారని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేశాం. ప్రభుత్వంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు 37 లక్షల నుంచి 44 లక్షలకు పెరిగారు.
- శాసనసభలో ఈ నెల 20న సీఎం జగన్
వాస్తవం: 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,29,356 మంది విద్యార్థులు ఉండగా.. ఈ ఏడాది 40.74 లక్షలకు తగ్గారు. దీన్ని ప్రస్తావించకుండా గతేడాది సంఖ్యపైనే సీఎం జగన్ మాట్లాడారు. విద్యా సంవత్సరం జులై 5న ప్రారంభమైంది. శాసనసభలో సెప్టెంబరు 20న విద్యా రంగంలో ‘నాడు-నేడు’పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆగస్టు 16కే ప్రవేశాలు ముగిశాయి. ప్రభుత్వం మాత్రం కొత్త విద్యార్థుల లెక్కలను విడుదల చేయకుండా జాగ్రత్త పడింది.
రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల మూసివేయం. ఎక్కడైనా మూసేసినట్లు ఉంటే చూపించండి.
-విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
వాస్తవం: ప్రభుత్వం అధికారికంగా ఒక్క పాఠశాల మూయకపోయినా తరగతుల విలీనంతో వాటికవే మూతపడే పరిస్థితి తీసుకొచ్చింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడిలోని అరుంధతిపేటలో గతేడాది ఆరుగురు విద్యార్థులు ఉండగా విలీనం తర్వాత ఒక్క విద్యార్థిని మాత్రమే మిగిలింది. ఆ ఒక్క విద్యార్థినికి ఒక ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 96 ప్రాథమిక బడుల్లో అయిదురుగు కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు తరలించడంతో ఇలాంటి బడులు ఇప్పుడు రాష్ట్రంలో కోకొల్లలుగా మిగిలాయి. వీటి పరిస్థితి ఏంటి?
బెడిసికొట్టిన విలీనం
నూతన విద్యా విధానమంటూ ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు.. కొన్నిచోట్ల చిన్న పిల్లలను దూరం పంపించలేక.. తల్లిదండ్రులు వారిని ప్రైవేటు బడుల్లో వేశారు. మిగిలిన 1, 2 తరగతుల్లో పిల్లల సంఖ్య అయిదులోపు ఉన్నవే అత్యధికంగా మిగిలాయి. ఈ బడులు కొనసాగుతాయో లేదో అంటూ కొందరు తమ పిల్లల్ని వేరే పాఠశాలలకు పంపించేశారు.
తగ్గితే కొత్త భాష్యం?
ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గడంపై ఉన్నతాధికారులు ఇప్పుడు కొత్త భాష్యం చెబుతున్నారు. ఏపీలో జననాల రేటు తగ్గిందని, ఎయిడెడ్ బడులు ప్రైవేటు పరం కావడమే కారణమని చెబుతున్నారు. జననాల రేటు తగ్గితే 2022-23 ఏడాదిలోనే ఒక్కసారిగా తగ్గిపోరు కదా? ఎయిడెడ్ బడులు ప్రైవేటుగా మారినందున అనుకున్నా వీటిలో తేడా కేవలం 90 వేలే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే