కడపకు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ కడపకు చేరుకున్నారు. సుమారు 6 నెలల అనంతరం ఇక్కడకు వచ్చిన ఆయన.. కేసు

Published : 24 Sep 2022 04:19 IST

ఈనాడు డిజిటల్‌, కడప : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్‌ కడపకు చేరుకున్నారు. సుమారు 6 నెలల అనంతరం ఇక్కడకు వచ్చిన ఆయన.. కేసు విచారణపై శుక్రవారం సమీక్షించినట్లు తెలిసింది. తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం, దర్యాప్తు ముమ్మరం చేసిన తరుణంలో అదనపు ఎస్పీ చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో బస చేసిన రామ్‌సింగ్‌ వారం రోజుల పాటు ఇక్కడే ఉండి కేసు దర్యాప్తును సమీక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని