అంకబాబుకు 41ఏ నోటీసులు ఎందుకు ఇవ్వలేదు?
గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంవోలోని ఒక కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపుల్లో
మీరు ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. ఆయన తిరస్కరించారనడానికి రుజువులున్నాయా?
సీనియర్ పాత్రికేయుడి అరెస్టు విషయంలో సీఐడీపై కోర్టు ప్రశ్నల వర్షం
సీఐడీ అధికారులకు నోటీసు
అంకబాబు రిమాండు తిరస్కరణ
ఈనాడు- అమరావతి, న్యూస్టుడే- గుంటూరు లీగల్: గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంవోలోని ఒక కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంటూ సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబు (73)ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులపై న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అంకబాబుకు నోటీసులు ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చారు? మీరు ఆయనకు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారనడానికి, ఆయన దాన్ని తిరస్కరించారనడానికి రుజువులేంటి’ అంటూ సీఐడీ అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. నాలుగు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అంకబాబుకు రిమాండు విధించాలన్న సీఐడీ అభ్యర్థనను తిరస్కరించింది. రూ.25 వేల సొంత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయాలంటూ గుంటూరు ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయమూర్తి జి.స్పందన శుక్రవారం రాత్రి ఆదేశాలిచ్చారు. అంకబాబు, మరికొందరిపై ఈ నెల 22న కేసు పెట్టిన సీఐడీ అధికారులు గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండు విధించాలని కోరారు.
వీడియో పరిశీలిస్తే తేలిపోతుంది
సీఆర్పీసీ 41ఏ నోటీసిచ్చేందుకు ప్రయత్నించినా తీసుకోవటానికి అంకబాబు నిరాకరించారని సీఐడీ తరఫు న్యాయవాది వివరించారు. ‘సీఐడీ అధికారులు నాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మా ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించేవరకూ సీఐడీ సిబ్బంది వీడియో తీశారు. దాన్ని చూస్తే నాకు నోటీసిచ్చారా? లేదా? నోటీసులు ఇవ్వాలని నేనే వారిని అడిగానా అనేది తేలిపోతుంది’ అని అంకబాబు చెప్పారు. సీఐడీ అధికారులు తన వాంగ్మూలాన్ని మార్చేశారన్నారు. సీనియర్ జర్నలిస్ట్నయిన తనను తెదేపా సానుభూతిపరుడ్ని అంటూ రిమాండు రిపోర్టులో పేర్కొన్నారని వివరించారు. న్యాయవాదులు తోట శ్రీధర్, కావూరి గోపీనాథ్, గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులు అంకబాబు తరఫున వాదనలు వినిపించారు.
సీఎంవో ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఫిర్యాదు: ‘అంకబాబు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు’ అంటూ సీఎంవో కార్యాలయ మేనేజర్ తిరుపతి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు. అభయగోల్డ్కు సంబంధించిన 20 కేసుల్లో అంకబాబు నిందితుడని వివరించారు. తాజాకేసులో విచారణ నిమిత్తం రిమాండు విధించాలని కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు.
బలవంతంగా లాక్కొచ్చారు: అంకబాబు: సీఐడీ అధికారులు తనను బలవంతంగా తీసుకెళ్లారని, ఓ అధికారైతే తన లుంగీ లాగేయటానికి ప్రయత్నించారని అంకబాబు ఆరోపించారు. విచారణ ఎదుర్కోవటానికి సిద్ధమేనని, నోటీసివ్వాలని కోరినా వారు పట్టించుకోలేదని న్యాయస్థానం బయట విలేకరులతో చెప్పారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, మందులు తెచ్చుకుంటానని చెప్పినా వినిపించుకోలేదన్నారు. తాను వాట్సప్ పోస్టు ఫార్వర్డ్ చేసిన గ్రూపులో అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారని, తాను చేసినది తప్పుడు పోస్టు అయితే.. వారు అప్పుడే హెచ్చరించి ఉండేవారు కదా అన్నారు.
అంకబాబుకు చంద్రబాబు ఫోన్
ఈనాడు, అమరావతి: న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అంకబాబు అరెస్టు అక్రమమని, ఆయనకు లేనిపోని దురుద్దేశాలు ఆపాదించారంటూ సీఐడీ పోలీసులపై మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.