8 కాళ్ల గొర్రెపిల్ల జననం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కావలి ముస్తాపురం పంచాయతీ పాతనాపురంలో చల్లా వెంకటేశ్వర్లుకు చెందిన గొర్రె శుక్రవారం 8 కాళ్ల పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల

Published : 24 Sep 2022 05:31 IST

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కావలి ముస్తాపురం పంచాయతీ పాతనాపురంలో చల్లా వెంకటేశ్వర్లుకు చెందిన గొర్రె శుక్రవారం 8 కాళ్ల పిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల మృతిచెందింది. దీనిపై పశుసంవర్ధక శాఖ ఏడీ సురేష్‌బాబు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ పిండం ఎదుగుదల సమయంలో ఏర్పడే జన్యులోపాల కారణంగా అవయవాలు అధికంగా కలిగిన పిల్లలు పుడతాయన్నారు. అవి సహజంగా బతకవని, పుట్టిన కాసేపటికే అవి మృతి చెందుతాయన్నారు.

- న్యూస్‌టుడే, కలిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని