త్వరలో వీఐపీ దర్శన సమయంలో మార్పు
తిరుమలలో వీఐపీ దర్శనాలతోపాటు వసతి గదుల కేటాయింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల కొండపై
తిరుపతిలోనే వసతి గదుల కేటాయింపు
సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం
తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి
ఈనాడు, తిరుపతి: తిరుమలలో వీఐపీ దర్శనాలతోపాటు వసతి గదుల కేటాయింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల కొండపై రద్దీని నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 9.30 గంటల వరకు కొనసాగుతున్నాయని చెప్పారు. బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం పూర్తయిన తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయని వెల్లడించారు. వీఐపీ బ్రేక్తోపాటు ప్రొటోకాల్, శ్రీవాణి ద్వారా శ్రీవారిని దర్శించుకునే వారినీ ఇదే సమయంలో అనుమతిస్తామన్నారు. రాత్రి సమయంలో కంపార్టుమెంట్లలో ఉండే సర్వదర్శన భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం తితిదే ఈవో ధర్మారెడ్డి, సభ్యులు పోకల అశోక్కుమార్, బుర్రా మధుసూదన్ యాదవ్లతో కలిసి ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు.
‘ప్రస్తుతం వీఐపీ, శ్రీవాణి దర్శనాలకు ఇచ్చే కోటాను తగ్గించే అంశంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నాం.
* తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు కొవిడ్కు ముందు ఇచ్చిన తరహాలోనే టోకెన్లు ఇస్తాం. పెరటాసి మాసం పూర్తయిన వెంటనే తిరుపతిలో రోజుకు 20వేల వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం. అవసరమైతే ఆ సంఖ్యను పెంచుతాం. టోకెన్లు లేనివారు నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
* తిరుమలలోని వసతి గదులను త్వరలో తిరుపతిలో కేటాయించే ప్రక్రియ ప్రారంభించనున్నాం. ఒకవేళ కొండపై గదులు లభించకుంటే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో ఉండవచ్చు. తితిదే వసతి గృహాలునిండిపోతే ప్రైవేటులో ఉండేందుకు ఆస్కారం ఉంది. గది అవసరం లేదనుకుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చు. సామాన్య భక్తులకు పీఏసీ కేంద్రాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
* ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల ద్వారా శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం. మరో 12 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రైతుసాధికార సంస్థ, మార్క్ఫెడ్తో ఒప్పందం చేసుకున్నాం. రైతులకు సాధారణ ధర కంటే 15 నుంచి 20 శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.
* తిరుమలలో సామాన్య భక్తులకు వసతి కల్పించేందుకు రూ.95 కోట్ల వ్యయంతో కొత్తగా పీఏసీ-5 వసతి కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. ఇది పూర్తయితే 10వేల మందికి వసతి కల్పించవచ్చు.
శ్రీవారి ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు
శ్రీవారి ఆస్తులపై ఎప్పటికప్పుడు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం 960 ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు. 1974- 2014 వరకు సుమారు 114 ఆస్తులను విక్రయించారు. ఆ తర్వాత ఒక్కటి కూడా అమ్మలేదు. ఇదే తరహాలో ఏటా శ్వేతపత్రం విడుదల చేస్తాం’ అని వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు