అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ
పోలీసుల మోహరింపు... రహదారుల దిగ్బంధనం... ఖాకీల కవాతు... అడుగడుగునా ఆంక్షలు ఒక వైపు... జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే
రాజధాని రైతుల మహా పాదయాత్రలో ఉత్కంఠ
పోలీసులు ఆంక్షలు విధించినా... భారీగా తరలివచ్చిన మద్దతుదారులు
ఈనాడు, అమరావతి-న్యూస్టుడే, నెహ్రూచౌక్, గ్రామీణం(గుడివాడ): పోలీసుల మోహరింపు... రహదారుల దిగ్బంధనం... ఖాకీల కవాతు... అడుగడుగునా ఆంక్షలు ఒక వైపు... జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదాలు... రైతన్నల పచ్చ జెండాల రెపరెపలు... పిల్లలు.. పెద్దల నీరాజనాలు మరోవైపు.... అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పోలీసులు ఆంక్షలు విధించినా... పలు ప్రాంతాల నుంచి భారీగా కర్షకులు, మహిళలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మహా పాదయాత్ర 13వ రోజు 16 కిలోమీటర్లు సాగి విజయవంతంగా ముగిసింది.
రాజధాని రైతులు గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం ఉదయం గుడ్లవల్లేరు మీదుగా గుడివాడకు చేరుకోవాల్సింది. ఈ నియోజకవర్గానికి వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వైకాపా కార్యకర్తలకు, అమరావతి రైతులకు మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. సంఘీభావం ప్రకటించాలని వివిధ నియోజకవర్గాలకు చెందిన తెదేపా నాయకులు తలపెట్టారు. శుక్రవారం రాత్రి పలువురు తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. విజయవాడ, పెనమలూరు వైపు నుంచి తెదేపా, ప్రజాసంఘాల నాయకులు రాకుండా కంకిపాడు మండలం దావులూరు టోల్ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నాయకుల వాహనాలను వెనక్కి మళ్లించారు. మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు -గుడివాడ జంక్షన్ దగ్గర వాహనాన్ని అడ్డుకొని మళ్లించారు. ఏలూరు వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. మధ్యాహ్నం దాకా ఎలాంటి వాహనాలను గుడివాడ పట్టణంలోకి అనుమతించలేదు. దాదాపు 500 మంది పోలీసులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి గుడివాడకు తరలి వచ్చి వీధుల్లో కవాతు నిర్వహించారు. అప్పటికే పాదయాత్ర గుడ్లవల్లేరు, అంగలూరు గ్రామాలను దాటి బొమ్మలూరుకు చేరుకుంది. బొమ్మలూరు వద్ద మధ్యాహ్న భోజనానికి కొంత విరామం ఇచ్చారు. ఈ లోగా వివిధ మార్గాల నుంచి ఒక్కొక్కరిగా వందలు, వేలుగా జనం అక్కడకు చేరుకున్నారు. ప్రజా సంఘాలతో పాటు తెదేపా, జనసేన, వామపక్షపార్టీలు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చాయి. జనం విపరీతంగా గుమిగూడటంతో డీఎస్పీ సత్యానందం, అమరావతి పరిరక్షణ సమితి, తెదేపా నాయకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. గుడివాడలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని, హైకోర్టు అనుమతి ఇచ్చిన దాని కంటే ఎక్కువమందిని అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించి రోప్ పార్టీతో పాదయాత్ర సాగేలా పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ పట్టణం, నెహ్రూ చౌక్ మీదుగా ఏలూరు రోడ్డుకు చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అమరావతి నినాదాలతో గుడివాడ పట్టణం దద్దరిల్లింది.
తొడకొట్టి సవాల్ విసిరిన నేతలు...
గుడివాడలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా నేతలు, అమరావతి రైతులు పలువురు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సవాల్ విసిరారు. దమ్ముంటే బయటకు రావాలంటూ వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అంబేడ్కర్ సెంటర్ ప్రాంతంలో కొద్దిసేపు పాదయాత్ర ఆగింది. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న కొడాలి నానిని చెప్పు దెబ్బలతో సత్కరించాలంటూ ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు నినాదాలు చేశారు. బూటు కాలుతో కొడతానని హెచ్చరించారు. జగన్, నానికి వ్యతిరేకంగా తొడకొట్టి సవాల్ విసిరారు. అమరావతికి చెందిన ఓ మహిళా రైతు కూడా తొడకొట్టి సవాల్ చేశారు. గుడివాడ పట్టణానికి వచ్చామని నక్కలా దాక్కున్న నాని బయటకు రావాలంటూ తెదేపా సీనియర్ నేత ఆనంద్బాబు ప్రసంగించారు. కొడాలి నానికి చెందిన సినిమా థియేటర్ నుంచి కొంతమంది అనుచరులు పాదయాత్ర వైపు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలకు సర్దిచెప్పి పాదయాత్ర ముందుకు సాగేలా చూశారు. గుడివాడలో మహా పాదయాత్ర సందర్భంగా పోలీసులు, డప్పు కళాకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో కళాకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కళాకారులు కొద్దిసేపు నిరసనకు దిగారు. గుడివాడ సెంటర్లో తనను పోలీసు బలగాలు ఆపుతున్నా ఆగకుండా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బైక్పై వెళ్లి అమరావతి రైతుల పాదయాత్రను చేరుకున్నారు. గుడ్లవల్లేరు వద్ద తెదేపా నేతలు పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ... స్వామి వారి రథానికి పూజలు నిర్వహించి రూ.5 లక్షల చెక్కును విరాళంగా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావుకు అందించారు.
పలువురి సంఘీభావం..
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రలో పలువురు నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన తెదేపా నేతలు, నియోజకవర్గ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు... మహాపాదయాత్రకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమరావతి దళిత జేఏసీ తరపున పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: రేవంత్
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు