70వేల మంది ఉద్యోగులు ఉసూరు
పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులు అందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 70 వేల మంది ఉద్యోగులు
పదవీ విరమణ వయసు పెంచకపోవడంపై ఆవేదన
62 ఏళ్లు తమకూ వర్తింపజేయాలని ప్రభుత్వ రంగ, కార్పొరేషన్ల ఉద్యోగుల డిమాండ్
ఈనాడు, అమరావతి: పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులు అందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 70 వేల మంది ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఈ నెల 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఎవరికి పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుంది? ఎవరికి వర్తించదో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. దీనిపై బాధిత ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయం స్పష్టం చేయడానికి 9 నెలల సమయం అవసరమా?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విధానం? వారితో సమంగా పని చేస్తున్న తమకు మరో విధానమా అని మండిపడుతున్నారు. తమకు కూడా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను సవరణ ఉత్తర్వులు ఇస్తుందని కొన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా ఎప్పుడూ ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చేస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని, ముందు తొలగించి- తర్వాత ఆ వెసులుబాటు కల్పిస్తే తమ వల్లే ఇది సాధ్యమయిందనే క్రెడిట్ పొందేందుకు ఇలా చేస్తున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ అనుబంధంగా అనేక ఇతర సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులూ ఉన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వీరికి జీతాలు, భత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లు, సొసైటీ చట్టం కింద ఏర్పడ్డ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లు, గ్రంథాలయాలు, అనేక యూనివర్సిటీల్లో పనిచేసే బోధనేతర సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోరు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి సంబంధించి మళ్లీ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 60 నుంచి 62 ఏళ్ల వయసుకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినా.. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉన్న ఉద్యోగుల విషయంలో ముందు స్పష్టత ఇవ్వలేదు. తొమ్మిది నెలల తర్వాత ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహా మిగిలిన వారికి ఇది వర్తించబోదని తేల్చేసింది.
కొన్ని బోర్డుల్లో తీర్మానాలు...
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా బీసీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు 60 ఏళ్లు నిండినా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. జీతాలు పొందుతున్నారు. మరికొన్ని చోట్ల వారి బోర్డుల్లో తీర్మానాలు ఆమోదించి కొనసాగుతున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఈ విషయం పేర్కొంది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా 62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది.
- ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా తమకు కూడా పదవీ విరమణ వయసు పెంచాలని ఆయా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రభుత్వపెద్దలను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అనేక పర్యాయాలు మాట్లాడారు. ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఉపసంహరించుకుని తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
పదవీ విరమణలో గందరగోళం
కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు తదితరాల్లో పని చేసే ఉద్యోగుల్లో 2022 జనవరి తర్వాత 60 ఏళ్లు నిండిన వారూ ఉన్నారు. వారిలో కొందరు పదవీ విరమణ చేయగా మరికొందరు అలాగే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కొందరు న్యాయస్థానానికి వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు ఉద్యోగాల్లో కొనసాగవచ్చని- ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయా ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు జీతాలు తీసుకోకుండానే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. రేపో, మాపో పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోతుందా, జీతాల బకాయిలు రాకపోతాయా అన్న ఉద్దేశంతో వారు అలాగే కొనసాగుతున్నారు.
ఎప్పటి నుంచో మా డిమాండ్ వినిపిస్తున్నాం
మాకు కూడా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని 9 నెలల నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పీఆర్సీపై చర్చలు జరిపిన రోజుల్లో కూడా ఈ డిమాండ్ ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి వినిపించాం. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చినా మేం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం.
- డి.మధుసూదన్రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం
ఇంకా ప్రయత్నాలు మానలేదు
పదవీ విరమణ వయసుపై ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు సవరించి ఇవ్వాలని కోరుతున్నాం. మంత్రులను కలిసి ఈ విషయాన్ని వివరించాం. సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిసింది. ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులు సవరించి తాజాగా ఆదేశాలు ఇస్తారనే సమాచారం మాకు ఉంది.
- వెంకటప్పరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం
మేం ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం
కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, యూనివర్సిటీ బోధనేతర సిబ్బందికి కూడా 62 ఏళ్లకు పదవీ విరమణ పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. అడిగి, అడిగి అలిసిపోయాం. ఇప్పటికీ మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి సాధిస్తామనే నమ్మకం ఉంది.
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?