ప్రభుత్వ బడుల్లో నాణ్యత డొల్ల
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల బేస్లైన్ పరీక్ష నిర్వహించింది. ప్రథమ్ సంస్థతో రూపొందించిన ఆంగ్లం, గణితం,
తెలుగులో పేరాను చదవలేకపోయిన 6, 7, 8 తరగతుల్లోని 41.58% మంది
ప్రభుత్వం నిర్వహించిన బేస్లైన్ పరీక్షతో విద్యార్థుల సామర్థ్యాలు బహిర్గతం
ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల బేస్లైన్ పరీక్ష నిర్వహించింది. ప్రథమ్ సంస్థతో రూపొందించిన ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలతో మౌఖిక, రాతపరీక్షలు నిర్వహించింది. 2-10 తరగతులకు ఒకే మౌఖిక పరీక్ష నిర్వహించింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్థాయిలను నిర్ణయించింది. తెలుగులో పేరా లేదా కథ, ఆంగ్లంలో పదాలు లేదా వాక్యాలు చదివినవారికి, గణితంలో 99 కన్నా ఎక్కువ విలువ సంఖ్యలను గుర్తించిన వారికి రాతపరీక్ష నిర్వహించింది. 2-5 తరగతులకు గణితంలో రాతపరీక్ష లేదు. తెలుగు, ఆంగ్లంలో 2-5 తరగతులకు ఒక ప్రశ్నపత్రం, మూడు సబ్జెక్టుల్లో 6-10 తరగతులకు మరో ప్రశ్నపత్రంతో రాత పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలను పరిశీలిస్తే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నట్లు అర్థమవుతోంది. 9,10 తరగతుల్లో ఆంగ్లవాక్యం చదవలేనివారు 46.92% ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రూ.20కోట్ల వ్యయం చేసింది.
రెండంకెల తీసివేతలు కష్టమే..
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం మూడోతరగతి పూర్తయ్యేసరికి తెలుగులో ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం రావాలి. ఆంగ్లంలో చిన్న పేరాను చదివి అర్థం చేసుకోవాలి. గణితంలో 999 వరకు అంకెలను గుర్తించడం, రెండు, మూడు అంకెలతో ఉన్న కూడికలు, తీసివేతలు రావాలి. కానీ ఎనిమిదో తరగతికి వచ్చినా విద్యార్థుల్లో ఈ సామర్థ్యాలు ఉండటం లేదు.
* గణితంలో 99కన్నా ఎక్కువ విలువగల సంఖ్యలను గుర్తించలేని వారు నాలుగు, ఐదు తరగతుల్లో 38.04% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 22.64% ఉన్నారు.
* రెండంకెల తీసివేతలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 40.69% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 24.13% ఉన్నారు.
* ఒక అంకెతో రెండు అంకెలను భాగించాల్సిన లెక్కలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 82.37% ఉండగా.. 6,7,8 తరగతుల వారు 58.65% ఉన్నారు.
* ఆంగ్లంలో చిన్నవాక్యం చదవలేని వారు 4, 5 తరగతుల్లో 83.9%, 6,7,8 తరగతుల్లో 65.24% ఉన్నారు.
‘మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాము. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది’ ఇలా తెలుగులో ఇచ్చిన చిన్నపేరాను సైతం ప్రభుత్వ బడుల్లోని నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు 65.04% మంది తప్పులు లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతులవారిలోనూ 41.58% చదవలేదు.
బెండపూడి ఎక్కడ?
కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వపాఠశాల విద్యార్థులు ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ బెండపూడిలోనూ ఆంగ్లంలో కొందరి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ పాఠశాలలో 511మంది ఉండగా.. వీరిలో 485 మంది బేస్లైన్ పరీక్షకు హాజరయ్యారు.
* 6,7,8 తరగతులలో 290మందికి 58.27% ఆంగ్లంలో చిన్నవాక్యాన్ని చదవలేకపోయారు.
* 9,10 తరగతుల్లో 195మంది విద్యార్థులుండగా.. వారిలో 45.64% ఆంగ్లంలో వాక్యం చదవలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం
రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. -
దస్తగిరి వినతిపై వివరాల సమర్పణకు సమయం ఇవ్వండి
ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పలువురు హంతకుడిగా చిత్రీకరిస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్న టీవీ ఛానళ్లను నియంత్రించాలని కోరుతూ అప్రూవర్ దస్తగిరి దాఖలుచేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఆర్థికసంఘం నిధులపై దిగొచ్చిన ప్రభుత్వం
కేంద్రం నెల రోజుల క్రితం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను తన దగ్గరే పెట్టుకున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ సమర్పణలో గందరగోళం
ప్రభుత్వ ఉద్యోగులు జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నందున వారు పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకోకుండా దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
సీపీఎస్ రద్దుపై మాట దాటేసిన బొత్స
భోగాపురం ఎయిర్ పోర్టును మరో ఏడాదిలో ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
సుజనాచౌదరి రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతి
భాజపా నేత సుజనాచౌదరిపై రుణ పరిష్కార ప్రక్రియకు అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ-హైదరాబాద్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
సీఎస్, డీజీపీలపై.. ఈసీ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!