రెస్కోల్లో నేతల పెత్తనం
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ లిమిటెడ్ (రెస్కో)ల పాలనా వ్యవహారాలన్నీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అందులో జరిగే వివిధ కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. రెస్కోలో
వారి కనుసన్నల్లోనే కార్యకలాపాలు
సిబ్బంది నియామకాల్లోనూ ఇష్టారాజ్యం
లైసెన్సు గడువు ముగిసినా పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి
ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్-విశాఖపట్నం
గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ లిమిటెడ్ (రెస్కో)ల పాలనా వ్యవహారాలన్నీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అందులో జరిగే వివిధ కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. రెస్కోలో వచ్చే లాభాలను నేతలు పంచుకుంటున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. సిబ్బంది నియామకాల్లో సైతం వారు చెప్పిందే నడుస్తోంది. అందువల్లే రెస్కోల విద్యుత్ పంపిణీ లైసెన్సులను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) రద్దు చేస్తే.. వాటిని మళ్లీ పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ సిఫారసు చేయించారు. సిఫారసు ఉత్తర్వులను ఏపీఈఆర్సీ ఆమోదించక ముందే అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోల పరిధిలో విద్యుత్ బిల్లుల వసూళ్లను రెస్కో చేపట్టడం వివాదాస్పదమైంది. లైసెన్సు లేని సంస్థ బిల్లులు వసూలు చేసుకుంటున్నా.. డిస్కంల అధికారులు కేసు కూడా పెట్టలేకపోతున్నారంటే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. రెస్కో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే సీఎండీలపై పెత్తనం చెలాయించడం స్థానిక నేతలకు సర్వసాధారణంగా మారింది. రెస్కోలో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా సంస్థను ఈపీడీసీఎల్ పరిధిలోకి తీసుకురావాలని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ లేఖలు రాశారు. ఒక మంత్రి అడ్డుపడి దాన్ని సహకార రంగంలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు సమాచారం.
అంతా అడ్డుగోలు వ్యవహారమే
అనకాపల్లి రెస్కోకు ప్రస్తుతం పాలకవర్గమే లేదు. జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరుడు రెస్కో వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. ఇక్కడ ఏం కొనాలన్నా.. ఎవర్ని నియమించుకోవాలన్నా అంతా ఆయన ఇష్టమే. విద్యుత్తు తీగల నుంచి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల వరకు అన్నింటా కమిషన్లు ముట్టజెప్పాలి. కాంట్రాక్ట్ సిబ్బంది నుంచి ఇంజినీరింగ్ అధికారి నియామకం వరకు రేట్లు పెట్టి వసూళ్లు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో తమ బంధువు ఒకర్ని విద్యార్హత లేకపోయినా లైన్మన్గా నియమించుకుని తర్వాత ధ్రువపత్రాలు సృష్టించి కార్యాలయ సిబ్బందిగా మార్చుకున్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు రెస్కో పరిధిలోని కార్యకలాపాలను ఈపీడీసీఎల్ పర్యవేక్షణలోకి తీసుకున్న తర్వాత కూడా అనధికారికంగా 33 మందిని రెస్కో ద్వారా నియమించి, భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాలు చెల్లవని ఈపీడీసీఎల్ జీతాలు నిలిపేసింది. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా సహకార సంఘంలోకి రెస్కో వస్తుందని, మీ జీతాలకు మాది పూచీ అంటూ వారిని నేతలు బుజ్జగిస్తున్నారు.
ఏటా రూ.100 కోట్లపైనే వ్యాపారం
అనకాపల్లి, చీపురుపల్లి, కుప్పం పరిధిలోని వినియోగదారులకు రెస్కోల ద్వారా విద్యుత్ పంపిణీ జరుగుతోంది. విద్యుత్ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు, ఇతర విడిభాగాల కొనుగోలు, విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ మొత్తాన్ని రెస్కోలే పర్యవేక్షిస్తున్నాయి. ఈ కొనుగోళ్లలోనే భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులకు ఏటా సుమారు 711.42 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, సుమారు రూ.135.42 కోట్ల బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తంలో రెస్కోల నిర్వహణ ఖర్చులు పోను.. మిగిలింది డిస్కంలకు చెల్లిస్తాయి. విద్యుత్ పంపిణీ కోసం రెస్కోలకు ఏపీఈఆర్సీ జారీ చేసిన లైసెన్సు గడువు 2021 మే నాటికి ముగిసింది. దాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించని ఏపీఈఆర్సీ.. ఆ కార్యకలాపాలను డిస్కంలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో రెస్కోలపై పెత్తనం చేస్తున్న స్థానిక నాయకులు పలుకుబడి ఉపయోగించి లైసెన్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి సిఫారసు చేయించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక ఏపీఈఆర్సీ ఆమోదం పొందకుండానే అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోల పరిధిలో బిల్లులు వసూలు చేశారు. సుమారు రూ.18 కోట్లు రెస్కోల ఖాతాల్లో జమ వేసుకున్నారు. దీనిపై ఏపీఈఆర్సీ సుమోటోగా విచారణ చేపట్టింది.
రూ.3 కోట్లకు తేలని లెక్కలు
అనకాపల్లి రెస్కో పరిధిలో జూన్, జులై నెలల విద్యుత్ బిల్లులుగా వసూలు చేసిన మొత్తంలో రూ.2,95,31,340కు లెక్కలు ఇంకా తేలలేదు. 2022 మే, జూన్లకు సిబ్బంది జీతాల కోసం రూ.2,21,58,991 ఖర్చు చేసినట్లు రెస్కో తెలిపింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.5,16,90,331 పెండింగ్లో పెట్టింది. వాటిని ఇతర ఖర్చుల కింద వెచ్చించినట్లు చెబుతోంది. ఈ లెక్కలను తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) అధికారులు పరిశీలించాక.. ఏ మేరకు అక్రమాలు జరిగాయో తేలుతుందని ఒక అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి