ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి

Published : 27 Sep 2022 03:24 IST

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయం నుంచి  పల్లకీలో దుర్గమ్మ ఉత్సవమూర్తిని మల్లికార్జున మహామండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ ఏడాది అమ్మవారి ఉత్సవమూర్తిని అంతరాలయంలో ఉండే అమ్మవారి ఆకారంలో తీర్చి దిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని