ఏలూరు.. రైతు సెలయేరు
ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదాలు హోరెత్తగా ఏలూరు జిల్లాలో మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు అన్నదాతలు చేపట్టిన పాదయాత్ర కొనికి, సకల కొత్తపల్లి, సత్యవోలు, పెదపాడు మీదుగా కొత్తూరుకు సోమవారం చేరుకుంది.
జిల్లాలో మహాపాదయాత్రకు ఘనస్వాగతం
నినాదాలతో హోరెత్తించిన అమరావతి రైతులు
పలు పార్టీలు, సంఘాల నాయకుల సంఘీభావం
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే- దెందులూరు, పెదపాడు: ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదాలు హోరెత్తగా ఏలూరు జిల్లాలో మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు అన్నదాతలు చేపట్టిన పాదయాత్ర కొనికి, సకల కొత్తపల్లి, సత్యవోలు, పెదపాడు మీదుగా కొత్తూరుకు సోమవారం చేరుకుంది. మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, అమరావతి పాటల మధ్య కోలాహలంగా సాగిన యాత్రకు గ్రామగ్రామాన జనం నీరాజనాలు పలికారు. పాదయాత్ర దారి ఇరువైపులా నిల్చొని పూల వర్షం కురిపించారు. రైతులకు దిష్టి తీసి హారతులు పట్టారు. రైతు రథానికి పూజలు చేస్తూ బిందెలతో నీరు పోస్తూ ముందుకు సాగనంపారు. యాత్రకు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బళ్లతో స్థానిక రైతులు ప్రదర్శన ఏర్పాటుచేశారు.
వైద్య విద్యార్థులు, న్యాయవాదుల మద్దతు
మహాపాదయాత్రకు వివిధ వర్గాలు మద్దతు ప్రకటించాయి. యువతుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసులవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలవారే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల మహిళా రైతులు తరలివచ్చారు. రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థులు యాత్రలో పాల్గొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని వారు నినదించారు. పాదయాత్రలో ఏలూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు యాత్రలో పాల్గొని రైతులతోపాటు నడిచారు. తాడేపల్లిగూడెం నుంచి పాదయాత్రలో పాల్గొన్న కవలలు రామలక్ష్మణ్ అందరినీ ఆకర్షించారు. విశాఖ వరకూ యాత్రలో పాల్గొంటామని వారు తెలిపారు. కష్టనష్టాలను భరిస్తూ రైతులు యాత్ర కొనసాగిస్తున్నారు. అమరావతి నుంచి పాదయాత్రలో నడుస్తున్న మహిళా రైతు వనజాక్షి కాళ్లకు బొబ్బలెక్కాయి.
* రైతు పాదయాత్రకు మద్దతుగా బాపులపాడు గ్రామ రైతులంతా కలిసి రూ.1.75 లక్షల విరాళం అందజేశారు. పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామస్థులు రైతుల వైద్య సదుపాయాల కోసం రూ.50 వేలు, పాదయాత్రకు రూ.2.15 లక్షల విరాళం అందించారు.
మద్దతు పలికిన పార్టీలు, సంఘాలు
మాజీ మంత్రులు కె.జవహర్, పితాని సత్యనారాయణ, తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, తెనాలి శ్రావణ్కుమార్, ఏలూరు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి బడేటి చంటి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతీదేవి, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ గౌడ్ తదితరులు యాత్రలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు.
రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు
అమరావతి రైతుల పాదయాత్ర మొదలుకానున్న కొనికి గ్రామంలో ఆదివారం రాత్రికి రాత్రే వైకాపా వర్గీయుల వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి.
15వ రోజు యాత్ర ఇలా..
ప్రారంభం: పెదపాడు మండలం కొనికి గ్రామం
ముగింపు: కొత్తూరు
నడిచిన దూరం: 15 కి.మీ.
కన్నెర్ర చేయడానికి రైతులేం తప్పు చేశారు?
ప్రశ్నించిన జేఏసీ నాయకులు
‘మేమంతా గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తుంటే.. కన్నెర్ర చేస్తే యాత్ర ఆగిపోతుందని మంత్రులు చెబుతున్నారు. కన్నెర్ర చేయడానికి రైతులేం తప్పు చేశారు? దొంగలంతా కలిసి ఒకే పార్టీలో చేరారు’ అని జేఏసీ నేత తిరుపతిరావు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో మొదటి రోజు పాదయాత్ర ముగిశాక విలేకరులతో ఆయన మాట్లాడారు. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నాయకులను సమీకరించి రెచ్చగొట్టేలా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు. మరోవైపు సీపీఎస్ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తొడగొట్టిన మంత్రి ఏమయ్యారు?’ అని ఆయన ప్రశ్నించారు. అమరావతి వారికి అరసవల్లిలో ఏం పని అని.. శ్రీకాకుళంనుంచి పాదయాత్ర మొదలు పెడదామని మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారని మహిళా జేఏసీ నేత శైలజ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే