చెత్తపన్నుపై నిలదీసిన వృద్ధురాలు
పన్నుల పెంపుపై ఓ వృద్ధురాలు వార్డు సచివాలయ సిబ్బందిని నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. చెత్త పన్ను కట్టమని అడిగిన సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
తాడేపల్లి, న్యూస్టుడే: పన్నుల పెంపుపై ఓ వృద్ధురాలు వార్డు సచివాలయ సిబ్బందిని నిలదీసిన ఘటన సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. చెత్త పన్ను కట్టమని అడిగిన సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ఘటన సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న తాడేపల్లిలోని పాత ఆరోవార్డు వడ్డెర కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వార్డు సచివాలయ సిబ్బంది వడ్డెర కాలనీలో చెత్త పన్ను వసూలు చేసేందుకు వెళ్లారు. గంజి వెంకమ్మ అనే వృద్ధురాలిని పన్ను కట్టాలని అడిగారు. దీంతో వెంకమ్మ పన్నుల పెంపుపై నిలదీశారు. ‘ఇంటి పన్ను రూ.600 నుంచి రూ.1200 చేశారు. 1200 వచ్చినోళ్లకు రూ.2వేలు వేస్తున్నారు. కరెంటు బిల్లు రూ.600 వచ్చేది. ఇప్పుడు రూ.1200 వేస్తున్నారు. ఇవన్నీ మేము ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలి’ అని ప్రశ్నించారు. చెత్త పన్ను ఇప్పుడు కట్టరా.. అంటూ సచివాలయ సిబ్బంది నిలదీశారు. ఎక్కడన్నా అప్పుతెచ్చి కడతాలే అనడంతో రోజూ మీ చుట్టూ తిరగమంటారా అంటూ సిబ్బంది ప్రశ్నించారు. మీరేమి తిరగొద్దు ఊడ్చేవాళ్ల చేతిలో పెడతాలే అంటూ సమాధానం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్