బోధనార్థం.. ఇదం శరీరం
కొన్ని దశాబ్దాల కిందట రక్తదానం చేయాలన్నా వెనకాడేవారు. తర్వాత క్రమంగా అవయవదానాలూ మొదలయ్యాయి. తమ ఆప్తులు జీవన్మృతులుగా మారినప్పుడు (బ్రెయిన్డెడ్) వారి శరీరంలోని అవయవాలను అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా తమవారిని అమరులను చేయొచ్చన్న అవగాహన పెరిగింది. ఇప్పుడు..
రాష్ట్రంలో పెరుగుతున్న పార్థివదేహ దానాలు
ముందుగానే వైద్యకళాశాలలకు అంగీకారపత్రం
ఈనాడు, అమరావతి
కొన్ని దశాబ్దాల కిందట రక్తదానం చేయాలన్నా వెనకాడేవారు. తర్వాత క్రమంగా అవయవదానాలూ మొదలయ్యాయి. తమ ఆప్తులు జీవన్మృతులుగా మారినప్పుడు (బ్రెయిన్డెడ్) వారి శరీరంలోని అవయవాలను అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా తమవారిని అమరులను చేయొచ్చన్న అవగాహన పెరిగింది. ఇప్పుడు.. తమ ఆప్తుల పార్థివదేహాలను వైద్య కళాశాలలకు దానం చేసేందుకూ ముందుకొస్తున్నారు.
మానవ శరీరంలో వివిధ అవయవాల అమరిక తీరును వైద్య విద్యార్థులకు తొలి సంవత్సరంలోనే నేర్పుతారు. అందుకోసం వారికి మృతదేహాల అవసరం ఉంటుంది. అనాటమీ గురించి విద్యార్థులకు నేర్పించేటప్పుడు మృతదేహంలో ఒక్కో భాగాన్నీ తొలగిస్తారు. తర్వాత మళ్లీ వాటిని లోపల పెట్టేస్తారు. గతంలో ఇవి దొరకడం గగనంగా ఉండేది. క్రమంగా ప్రజలు ముందుకు రావడంతో పరిస్థితి కొంత మెరుగయ్యింది. కొంతకాలం క్రితం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి పార్థివదేహాన్ని తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాలకు అప్పగించారు. విశాఖలోని ఆంధ్ర, కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలకు 2019 నుంచి ఇటీవల వరకు 41, 24 భౌతికకాయాలు దానంగా వచ్చాయి. కర్నూలు, గుంటూరు, విజయవాడ వైద్యకళాశాలలకూ మృతదేహాలు దానంగా వస్తున్నాయి.
శ్మశానాల చుట్టూ తిరిగేవాళ్లం
వైద్య కళాశాలలు ప్రారంభించిన తొలినాళ్లలో విద్యార్థుల శిక్షణకు అవసరమైన మృతదేహాలు దొరక్క.. శ్మశానాల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయని కొందరు సీనియర్ వైద్యులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం అనాటమీ చట్టాన్ని 1948లో అమలుచేయగా తొలి దేహదానం 1956లో మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. విశాఖ ఆంధ్రా వైద్యకళాశాలలో ప్రతియేటా 250 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో చేరుతారు. వీరిలో 20-25 మంది విద్యార్థులకు ఒక్కో మృతదేహాన్ని కేటాయిస్తారు. తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల అనాటమీ విభాగ ప్రొఫెసర్ ఒకరు ‘విదేశాల్లో ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో సంతకాలు తీసుకుని మరణానంతరం పార్థివదేహాలు అప్పగించేలా పలువురు తల్లిదండ్రులు ముందే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు’ అని తెలిపారు. విజయవాడకు చెందిన సీనియర్ అధ్యాపకులు మాట్లాడుతూ ‘తాత ఎస్.మాలేకొండమ రాజు (97) పార్థివదేహాన్ని కొద్దికాలం కిందట గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు అప్పగించాం. ఆయన మరణానంతరం కుటుంబంలో అందరం చర్చించుకుని, నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దానం చేశాం’ అని తెలిపారు.
పలు రకాలుగా..
సాధారణంగా మార్చురీ విభాగానికి వచ్చే నాన్ ఎమ్మెల్సీ కేసులకు పోలీసుశాఖ నుంచి నాట్ట్రేస్డ్ సర్టిఫికెట్ వస్తే.. వాటినే వైద్యకళాశాలలకు అందజేస్తున్నారు. కర్నూలు బోధనాసుపత్రిలో ఏడాదికి నాలుగైదు అనాథ మృతదేహాలు వస్తున్నాయి. గుంటూరులోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల తమ మరణానంతరం మృతదేహాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేస్తూ పలువురు లేఖలు అందజేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల నుంచి అన్క్లెయిమ్డ్ మృతదేహాలను ఒక్కోటి రూ.25వేలకు కొంటున్నట్లు ఒక ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్య ప్రతినిధి చెప్పారు. అయితే.. ఈ వివరాలు వెలుగులోకి రావట్లేదు. 2017 జనవరి నుంచి 2021 నవంబరు వరకు 64 అన్క్లెయిమ్డ్ మృతదేహాలను ఆస్పత్రులు, పరిశోధన సంస్థలకు విక్రయించడం ద్వారా తిరువనంతపురం వైద్యకళాశాలకు రూ.6.40 లక్షలు వచ్చాయి. వీటిని ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమచేస్తున్నారు.
స్పష్టమైన మార్గదర్శకాలు లేక..
మృతదేహాల దానానికి మార్గదర్శకాలు స్పష్టంగా లేకపోవడంతో ఒక్కోచోట ఒక్కోరకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాశయంతో పార్థివదేహాల దానానికి ముందుకొచ్చేవారికి కళాశాలల నిర్వాహకుల నుంచి సహకారం లభించట్లేదు. వైద్య కళాశాలలకు పార్థివదేహాలను అప్పగించిన తర్వాత మళ్లీ చూసేందుకు కుటుంబసభ్యులను అనుమతించరు. ‘మృతదేహాలను కనీసం వాళ్లే తెప్పించుకుని, తగిన గౌరవమిచ్చే సంస్కృతి కనిపించట్లేదు. సహజమరణ ధ్రువీకరణ పత్రం కోసం ఒత్తిడి తేకుండా చూడాలి’ అని సావిత్రీబాయి ఫులే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ముందే అంగీకారం తెలపాలి
ఎవరైనా చనిపోకముందే.. మరణానంతరం తమ శరీరదానానికి అంగీకారం తెలియజేయాలి. ఒకవేళ తమవారి మృతదేహాలను కుటుంబసభ్యులు దానం చేయాలనుకుంటే రాతపూర్వకంగా తెలియచేయాలి. రిజిస్టర్డ్ వైద్యులు సహజ మరణంగా ధ్రువీకరిస్తేనే ఇలా తీసుకోవాలన్నది నిబంధన. మరణించిన ఆరు గంటల్లోగా మృతదేహాన్ని అప్పగించాలి, అది సాధ్యం కాకపోతే ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాలి.
అన్క్లెయిమ్డ్ బాడీలు ఇస్తే కొరత తీరుతుంది
అన్క్లెయిమ్డ్ బాడీలు దొరకడానికి, వాటిని స్వీకరించడానికి ఎక్కువ సమయం పడుతోంది. అవి ఇస్తే వైద్యకళాశాలలకు కొరత తీరుతుంది. మాకు పార్థివదేహాలు అందగానే వాటిని ఎంబామింగ్ చేస్తాం. దీనివల్ల ఎంత కాలమైనా అవి చెడిపోకుండా ఉంటాయి. విశాఖలో సేవాసంస్థల చొరవ వల్ల 2019లో 20, 2020లో 10, 2021లో ఏడు, 2022లో మూడు చొప్పున మృతదేహాలు వైద్యకళాశాలకు అందాయి.
- డాక్టర్ రవీంద్ర కిషోర్, అనాటమీ విభాగాధిపతి, ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖ
ప్రభుత్వం నుంచి గుర్తింపు ఇవ్వాలి
మరణానంతరం శరీరం కాలి బూడిద కావడం, లేదా మట్టిలో కలిసేకన్నా భావి వైద్యులకు జ్ఞానప్రదానం చేసేందుకు శరీరదానం ఉపయోగపడుతోంది. అందుకే పార్థివదేహాలను దానంగా ఇచ్చేందుకు కుటుంబసభ్యులు ముందుకొస్తున్నారు. ఇలా దానం చేసేవారికి ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటే క్రమంగా దానాలు పెరుగుతాయి.
- గూడూరు సీతామహాలక్ష్మి, కన్వీనర్, ఏపీ బాడీ డోనార్స్ అసోసియేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి