నిబంధనల సాకులు.. ‘మీ సేవ’కు బ్రేకులు!
ప్రజలకు అందుబాటులో సేవలను అందించే మీసేవ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అవి అందించే ముఖ్యమైన ఆన్లైన్ సేవలను క్రమంగా తగ్గిస్తోంది. వాటిని వార్డు/గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తోంది.
కీలక సేవలను నిలిపేసిన ప్రభుత్వం
సంక్షేమ పథకాలకు.. చెల్లని ధ్రువీకరణలు
ఈనాడు, అమరావతి: ప్రజలకు అందుబాటులో సేవలను అందించే మీసేవ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అవి అందించే ముఖ్యమైన ఆన్లైన్ సేవలను క్రమంగా తగ్గిస్తోంది. వాటిని వార్డు/గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తోంది. పైగా గ్రామ సచివాలయాల నుంచి తీసుకున్న ధ్రువపత్రాలే వివిధ సంక్షేమ పథకాలకు చెల్లుబాటు అయ్యేలా చేస్తోంది. మీసేవ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
మీసేవ అందించే పలు కీలక సేవలను ప్రభుత్వం ఏడాదిగా నిలిపేస్తూ వస్తోంది. పేరుకు 553 సేవలున్నా.. అందులో ప్రజలకు ఎక్కువగా అవసరమైనవి 25 మాత్రమే. ప్రస్తుతం ఆర్వోఆర్ 1బి, ఆదాయ, కుల ధ్రువీకరణ వంటివే అందుబాటులో ఉన్నాయి. మ్యుటేషన్లో భాగంగా టైటిల్ డీడ్, పాస్బుక్ సేవలు, అడంగల్లో సవరణలు, ఎఫ్ఎంబీ, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు, వాటిలో సవరణలు, ఆధార్ ఈకేవైసీ, జిల్లా స్థాయి సర్వే వంటి వాటిని తొలగించి.. సచివాలయాలకు బదిలీ చేసింది. దీంతో మీసేవలో లావాదేవీల సంఖ్య సుమారు 50 శాతానికి పడిపోయిందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. సేవలపై వచ్చే ఆదాయం పెరిగితే.. అందుకు అనుగుణంగా నిర్వాహకుల కమీషన్నూ పెరగాలి. ప్రభుత్వం ‘ఏ’ కేటగిరీ సేవలకు రుసుమును రూ.35 నుంచి రూ.40కి, ‘బి’ కేటగిరీ సేవలకు రూ.45 నుంచి రూ.50కి పెంచింది. ఆ మొత్తాన్నీ ప్రభుత్వమే తీసుకుంటోంది. పెంపుతో మీసేవ నిర్వాహకులకు ఒరిగిందేమీ లేదు. కమీషన్నూ మొత్తాన్నీ ప్రతి నెలా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. రాష్ట్రంలోని 11వేల మీసేవ కేంద్రాలతో ప్రతి నెలా ప్రభుత్వశాఖలకు సుమారు రూ.15 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
సచివాలయంలో తీసుకుంటేనే చెల్లుబాటు!
చేయూత పథకం కోసం ప్రభుత్వం అందించే దరఖాస్తుపై సచివాలయం నుంచి తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొనడం గమనార్హం. ప్రజలను సచివాలయాల వైపు వెళ్లేలా చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు తెస్తోందని మీసేవ నిర్వాహకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అంజన్కుమార్ ఆరోపించారు.
* బయోమెట్రిక్ ద్వారా నిర్వాహకులు వేలిముద్రలు వేస్తేనే సర్వర్లోకి లాగిన్ అయ్యేలా ప్రభుత్వం సాంకేతికతలో మార్పులు తీసుకొచ్చింది. ఒక కేంద్రంలో నలుగురు ఆపరేటర్లు ఉంటే ప్రతి ఒక్కరి లాగిన్కూ నిర్వాహకుడు అవసరమవుతోంది. దీంతో ఇతర పనులు మానుకుని అక్కడే ఉండాల్సి వస్తోంది.
* సంయుక్త కలెక్టర్లు జారీ చేసిన ప్రొసీడింగ్, మీసేవ కేంద్రాలను నిర్వహించే ప్రైవేటు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలు పంపాలని 30శాతం కేంద్రాలకు అధికారులు లాగిన్కు అవకాశం నిలిపివేశారని నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడెక్కడ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
హామీలకు శిలువ!
గత ఎన్నికలకు ముందు.. మ్యానిఫెస్టో అనే పదానికి తానే తొలిసారిగా అర్థం కనిపెట్టినట్లు చెప్పారు జగన్. దాన్ని బైబిల్తో పోల్చి ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకుని గద్దెనెక్కారు. తీరా చూస్తే.. ఈ ఐదేళ్ల పాలనలో అదే బైబిల్ను దైవసమానంగా చూసే క్రైస్తవులను జగన్ వంచించారు. -
అక్రమాల కిరణం!
అవినీతి, అరాచకం కలగలిసిన అక్రమాల ‘కిరణం’ ఆయన. కొండల్ని కొల్లగొట్టారు.. ప్రభుత్వ భూముల్ని చెరబట్టారు.. ఇసుకలో దోచేశారు.. రియల్ ఎస్టేట్ దందాల్లో ఆరితేరారు.. ఒకప్పుడు రోజువారీ ఖర్చులకూ కటకటలాడిన ఆయన.. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్లకు పడగలెత్తారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
జలభగ్నం
‘‘పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. -
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ
ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
అయిదేళ్లు చాల్లేదా..జగన్?
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పదే పదే చెబుతున్న వైకాపా ప్రభుత్వం.. వారి పిల్లల కోసం నిర్మించిన గురుకుల పాఠశాల భవనాన్ని మాత్రం పట్టించుకోలేదు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
అయినవాళ్లకే భద్రత
ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులకు వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పిస్తుంది. కానీ వ్యవస్థల విధ్వంసానికి తెగబడుతున్న జగన్ ప్రభుత్వం మాత్రం ఆ భద్రతనూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోంది.