ఇన్ఛార్జి రాజశేఖరే ఇక ఏఎన్యూ రెగ్యులర్ వీసీ
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్ పేటేటి రాజశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల నుంచి ఇన్ఛార్జి వీసీగా
గవర్నర్, సీఎం సంతకాలు పెట్టినా జీవో జారీలో జాప్యం
రిజిస్ట్రార్గా ఉండగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు
ఈనాడు, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్ పేటేటి రాజశేఖర్ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల నుంచి ఇన్ఛార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఆయన వర్సిటీలో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడం, వైఎస్సార్ విగ్రహం నెలకొల్పడం వంటివి చేసి ప్రభుత్వానికి దగ్గరయ్యారనే అభిప్రాయం విశ్వవిద్యాలయం వర్గాల్లో ఉంది. వీసీగా రాజశేఖర్ నియామక దస్త్రంపై గవర్నర్, సీఎంలు సంతకం పెట్టి 15 రోజులు గడిచిపోయింది. జీవో ఇవ్వటానికి ఇన్ని రోజులు సమయం తీసుకోవటం వెనుక పెద్ద తతంగమే చోటుచేసుకుంది. ఆయన నియామకంపై పునరాలోచన చేయాలని వర్సిటీలోని పలువురు టీచింగ్, నాన్టీచింగ్ అధ్యాపకులు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య తదితరులు ప్రభుత్వ పెద్దలను కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్, సీఎం సంతకం అయిన తర్వాత కూడా జీవో వెలువరించకుండా మంత్రి, ఉన్నతాధికారులు ఇన్నాళ్లు కాలయాపన చేశారని తెలుస్తోంది. ఏఎన్యూతో పాటు రాష్ట్రంలోని మరో ఐదారు వర్సిటీలకు ఉపకులపతుల నియామకానికి ఏడాది క్రితమే సెర్చ్ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పట్లో ఏఎన్యూ నియామకాన్ని ఒక్కటే పెండింగ్లో పెట్టి మిగిలిన వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించటం సంచలనమైంది. ప్రొఫెసర్ రాజశేఖర్ గతంలో వర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో గత తెదేపా ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో విచారణకు ఆదేశించింది. చక్రపాణి కమిటీ ఆయనపై ఆర్థిక అవకతవకలను నిర్ధారించి చర్యలకు సిఫార్సు చేసింది. ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై రంగయ్య కమిటీని వేసింది. ఆ కమిటీ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది. చర్యలు తీసుకునే లోపే సార్వత్రిక ఎన్నికలు రావడం, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చక్రపాణి కమిటీ నివేదికను పక్కన పెట్టారు. ఆ నివేదికను అనుసరించి రాజశేఖర్పై చర్యలు చేపట్టాలని అప్పటి వర్సిటీ పాలక మండలి సభ్యురాలు ప్రొఫెసర్ రత్నశీలామణి ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో తిరిగి ప్రభుత్వం విశ్రాంత ఉపకులపతి నిరుపమారాణి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి తిరిగి విచారణ చేయించింది. ఆ కమిటీ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. నిరుపమారాణి కమిటీ నివేదికను వర్సిటీ పాలక మండలిలో పెట్టి రాజశేఖర్కు అనుకూలంగా తీర్మానం చేయడంతో ప్రభుత్వం చక్రపాణి కమిటీ నివేదికను డ్రాప్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. చక్రపాణి కమిటీ నివేదికను ప్రభుత్వం డ్రాప్ చేయటాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ రత్నశీలామణి హైకోర్టులో కేసు వేశారు. ఆ పిటిషన్ ఇంకా బెంచి మీదకు రాలేదు. ఈలోపే రాజశేఖర్ను రెగ్యులర్ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!