బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
తిరుమలలో బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఏడు తలల శేష
పెద్దశేషవాహన సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఈనాడు, తిరుపతి: తిరుమలలో బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఏడు తలల శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి.. పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాత్రి 7.45 గంటల సమయంలో ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తలపై పట్టువస్త్రాలు పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని స్వామికి సమర్పించారు. అనంతరం వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకొని.. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తర్వాత మాడ వీధులలో పెద్ద శేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ముఖ్యమంత్రికి హారతి ఇచ్చి ఆశీర్వచనాలు అందించారు. 2023 సంత్సరానికి సంబంధించిన క్యాలెండర్లను, వచ్చే ఏడాదికి సంబంధించిన డైరీని సీఎం విడుదల చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు మోరంశెట్టి రాములు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను ముఖ్యమంత్రితో ఆవిష్కరింపజేశారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి సీఎంను తీసుకువచ్చి తులాభారంపై కూర్చోబెట్టి బియ్యంతో తులాభారం వేశారు. ముఖ్యమంత్రి బరువు సుమారు 82 కిలోలు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్తు సరఫరాలో అంతరాయం..
సీఎం వాహన మండపం వద్దకు చేరుకున్న సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తిరుమల మొత్తం విద్యుత్తు ఉండగా వాహన మండపం వద్దనే సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తితిదే అధికారులతోపాటు సీఎం భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే సరఫరా పునరుద్ధరణతో ఊపిరి పీల్చుకున్నారు.
అరగంటలోనే స్వామి దర్శనం
సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి రెండురోజుల నుంచి రద్దీ నామమాత్రంగానే ఉంది. సోమవారం 52,682 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇదే స్వల్పం. మంగళవారం ఉదయం కూడా రద్దీ లేకపోవడంతో మధ్యాహ్నం వరకు 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
సీవీఎస్వోతో వాగ్వాదం..
తిరుపతి మేయర్ బంధువు తులసీయాదవ్, సునీల్చక్రవర్తి, పెంచలయ్య తదితరులు ముఖ్యమంత్రి వచ్చే ముందు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేందుకు చూశారు. మహద్వారం వద్ద సీవీఎస్వో నరసింహకిశోర్ వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. వారు వాగ్వాదానికి దిగారు. పది నిమిషాల పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వచ్చే సమయం కావడంతో లోపలకు అనుమతించలేనని ఆయన గట్టిగా వాదించినా.. చివరికి అనుమతించారు. సీఎం జగన్ వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, రోజా, ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్రెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
నేడు పరకామణి భవనం ప్రారంభం
బుధవారం ఉదయం తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నసత్రం కేంద్రం ఎదురుగా రూ. 23 కోట్లతో దీన్ని నిర్మించారు. వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దంపతులు నూతనంగా నిర్మించిన అతిథిగృహాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు.
చిత్రంగా తితిదే ప్రదర్శన..!
తిరుమల, న్యూస్టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక కల్యాణవేదికలో తితిదే ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించి పరిశీలించారు. శ్రీవారిని దర్శించుకున్న దేశ రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రుల ఫొటోలను ఇక్కడ ఉంచారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కొందరు ప్రముఖుల ఫొటోలు పెట్టినా వారి పేర్లు, హోదా వివరాలు రాయలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో అసలు పెట్టనేలేదు. తర్వాత హడావుడిగా ఫొటో పెట్టినా తెదేపా అధినేత పేరును ప్రస్తావించలేదు. చివరకు పొరపాటును సరిదిద్దే క్రమంలోనూ చంద్రబాబు ఫొటోకు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్రెడ్డి పేరున్న స్టిక్కర్ పెట్టడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్