ఆ 1416 ఎకరాలను విడుదల చేయండి
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వాన్పిక్ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జప్తుచేసిన 1,416.91 ఎకరాల పట్టా భూములను జప్తు
వాన్పిక్ ఆస్తుల జప్తుపై ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
అప్పిలేట్ ట్రైబ్యునల్ నిర్ణయం సరికాదని ధర్మాసనం వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వాన్పిక్ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జప్తుచేసిన 1,416.91 ఎకరాల పట్టా భూములను జప్తు నుంచి విడుదల చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలంగాణ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆస్తుల జప్తు చట్టవిరుద్ధమని చెబుతూనే.. వాటి విడుదలకు కింది కోర్టును ఆశ్రయించాలని దిల్లీలోని అప్పీలేట్ ట్రైబ్యునల్ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రకాశం జిల్లాలో రూ.23.23 కోట్ల విలువైన 561.20 ఎకరాలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రూ.27.72 కోట్ల విలువైన 855.71 ఎకరాలను విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది. ఆస్తుల జప్తుపై అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ 561 ఎకరాలపై వాన్పిక్ పోర్ట్సు లిమిటెడ్, 855 ఎకరాల జప్తుపై వాన్పిక్ ప్రాజెక్ట్స్, 11వేల ఎకరాలపై రెండు కంపెనీలు కలిపి వేర్వేరుగా దాఖలుచేసిన మూడు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సుదీర్ఘ వాదనల అనంతరం జులై 7న వాయిదా వేసింది. ఈ మూడు పిటిషన్లలో రెండింటిని అనుమతిస్తూ తీర్పు చెప్పింది. 2017 జులైలో 11,804.78 ఎకరాల ఎసైన్డ్ భూముల జప్తుపై వాన్పిక్ ప్రాజెక్ట్స్, వాన్పిక్ పోర్ట్సు లిమిటెడ్ దాఖలుచేసిన పిటిషన్పై మరింత విచారణ చేపట్టాలని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసు ఆధారంగా ఈడీ 2014లో 1,416 ఎకరాలను, 2017లో 11,804 ఎకరాలను తాత్కాలిక జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తాత్కాలిక జప్తును ధ్రువీకరిస్తూ దిల్లీలోని ఎడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీచేయడంతో వీటిని సవాలు చేస్తూ కంపెనీలు అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. వీటిపై 2019లో ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీచేస్తూ తాత్కాలిక జప్తు చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇందులో ఎలాంటి క్విడ్ ప్రోకో లేదని, జప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, విచారణ పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుందని, అంతవరకు ఆస్తుల జప్తు సరికాదంది. అయితే ఆస్తుల విడుదలకు కింది కోర్టుకు వెళ్లాలని, ఇందులో రాష్ట్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పవచ్చంటూ చెప్పడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తుల జప్తునకు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనలతోపాటు సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వెలువరించిన తీర్పులను ప్రస్తావిస్తూ వాన్పిక్ పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ ఆస్తులను విడుదల చేయాలంటూ ఈడీని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం