రైల్వేజోన్ సాధ్యం కాదు
ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించిన షాక్ నుంచి విశాఖ ప్రజలు తేరుకోక ముందే రైల్వేశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదని ఆ
విశాఖ కేంద్రంగా ఏర్పాటు లాభదాయకం కాదని రైల్వేశాఖ స్పష్టీకరణ
దానిపై మీ స్థాయిలో నిర్ణయం తీసుకోవద్దు... కేబినెట్కు పంపాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి
మిగతా డిమాండ్లకు తెలంగాణ అధికారుల అభ్యంతరం
రాజధానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ విజ్ఞప్తి
విభజన సమస్యలపై దిల్లీలో సమావేశం
ఈనాడు - దిల్లీ
ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించిన షాక్ నుంచి విశాఖ ప్రజలు తేరుకోక ముందే రైల్వేశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు మంగళవారం కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కుండ బద్దలుకొట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య విభజన సమస్యల పరిష్కారంతో పాటు, ఆ చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుపై ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో రైల్వేబోర్డు అధికారులు జోన్ అంశంపై స్పష్టత ఇచ్చారు. కొత్త జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకే ఆ డీపీఆర్ను ఆమోదించలేదని పేర్కొన్నట్లు సమాచారం. అందుకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. లాభదాయకం కాదనే దానికి చట్టపరంగా హామీ ఇచ్చారని, లాభాలు వస్తే ఏ చట్టంతో అవసరం లేకుండా రైల్వేశాఖ ఏర్పాటు చేసేదని చెప్పారు. లాభం లేకపోయినా రాజకీయ కారణాల దృష్ట్యా కేంద్రం దేశంలో ఎన్నో జోన్లను ఏర్పాటుచేసిందని, అందువల్ల విశాఖ జోన్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో కేంద్రహోంశాఖ కార్యదర్శి జోక్యం చేసుకుంటూ జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయం మీ స్థాయిలోనే తీసుకోవద్దని, ఆ విషయాన్ని కేబినెట్ ముందు పెడితే, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని సూచించినట్లు తెలిసింది.
ఏపీ అధికారులు రాజధానికి మరో రూ.వెయ్యి కోట్లు కోరినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇస్తామన్నారని, ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చినందున మిగిలిన రూ.1,000 కోట్లను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తిచేసినట్లు తెలిసింది. అందుకు కేంద్ర అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకు చేసిన ఖర్చులకు లెక్కలు చెబితే మిగిలిన నిధుల విడుదల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీ అధికారులు శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నిర్మాణానికి రూ.29వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పినందున, ఆమేరకు నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.
విభజన చట్టంలోని షెడ్యూల్ 9లోని సంస్థలను షీలాబిడే సిఫార్సుల ప్రకారం, షెడ్యూల్ 10లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచాలని ఏపీ అధికారులు కోరగా, అందుకు తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. హెడ్క్వార్టర్స్ అన్న పదంపై కోర్టులో కేసులు దాఖలయ్యాయని, అవి తేలేవరకూ షీలాబిడే కమిటీ సిఫార్సుల అమలుకు వీల్లేదని స్పష్టంచేశారు. షెడ్యూల్ 10లోని ఆస్తులు ఎక్కడున్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, నగదును మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పిందని, ఆ విషయంలో మార్పులు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఏపీఎస్ఎఫ్సీని విభజించాలని ఏపీ అధికారులు కోరగా, అలా చేయాలంటే హెడ్క్వార్టర్స్ అన్న పదంపై స్పష్టత రావాలని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 238 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని, ఇప్పటికీ ఈ విషయం కోర్టులో ఉందని చెప్పారు. ఆ భూమి విషయాన్ని పక్కనపెట్టి, మిగిలిన ఆస్తుల విభజనను పూర్తిచేయాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందిస్తూ హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని ఈ కేసును పరిశీలించాలని సిబ్బందికి చెప్పారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల పంపిణీపై చర్చ జరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం కాగ్ సాయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. పౌరసరఫరాల కార్పొరేషన్ విభజనకు ముందు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉపయోగించుకున్న క్యాష్ క్రెడిట్ బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం విడుదల చేసే ఆహార సబ్సిడీలో తెలంగాణ వాటాను బదిలీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆ క్యాష్క్రెడిట్ అసలును చెల్లిస్తామని తెలంగాణ అధికారులు షరతు విధించారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలను సరిదిద్దుతూ విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో పన్ను రీఫండ్లు ఏవైనా ఉంటే అవి ఆ ప్రాంతానికే చెందుతాయని, పన్ను బకాయిలు ఉంటే రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన చెల్లించాలని చెప్పారని, దీనివల్ల రీఫండ్లలో ఎక్కువ భాగం తెలంగాణకు వెళ్తుంటే, బకాయిల్లో ఎక్కువ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి వస్తోందని, ఈ లోపాన్ని సరిదిద్దుతూ చట్టసవరణ చేయాలని ఏపీ అధికారులు కోరారు. అందుకు తెలంగాణ వారు ససేమిరా అన్నారు. తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల గురించి అడగ్గా... నీతి ఆయోగ్ అయిదేళ్లకే ఆ నిధులను సిఫార్సు చేసిందని, ఇప్పటికే ఆ మొత్తం ఇచ్చామని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటివరకు రూ.1,750 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049 కోట్లకే వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిందని, మిగిలిన లెక్కలు చెప్పిన తర్వాత తదుపరి విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమావేశంపై ఏపీ ప్రభుత్వ అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. సానుకూలంగా జరిగిందని.. మూడు, నాలుగు అంశాల్లో ఏపీకి అనుకూలంగా ఉత్తర్వులు రావొచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజ్ గుల్జార్, రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి అరుణ్కుమార్, జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, దిల్లీలో ఏపీ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ప్రకాశ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల గురించి 5 పేజీల పత్రికా ప్రకటన విడుదల చేయగా, ఏపీ అధికారులు ఏమీ చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని డిమాండ్లకూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అన్ని సమస్యలూ అపరిష్కృతంగానే మిగిలినట్లయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి