డిజిటల్ చెల్లింపులకు ‘మోకాలడ్డు’
చిల్లర దుకాణాలు.. రోడ్డు పక్కన టిఫిన్ బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకూ ఎక్కడైనా జీపే, ఫోన్పే లాంటి డిజిటల్ మార్గాల్లో బిల్లులు చెల్లించగలం. కానీ, ఏటా దాదాపు రూ.25 వేల కోట్ల
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇప్పటికీ నగదే..
పారదర్శకతకు తిలోదకాలు... అక్రమాలకు తలుపులు
ఏటా రూ.25 వేల కోట్ల లావాదేవీలన్నీ నగదులోనే
డిజిటల్ చెల్లింపులు తెస్తామని నెలలు గడుస్తున్నా కానరాని చర్యలు
ఈనాడు, అమరావతి
చిల్లర దుకాణాలు.. రోడ్డు పక్కన టిఫిన్ బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకూ ఎక్కడైనా జీపే, ఫోన్పే లాంటి డిజిటల్ మార్గాల్లో బిల్లులు చెల్లించగలం. కానీ, ఏటా దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన సరకు అమ్ముతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బులిస్తేనే మందు ఇస్తారు. ‘ఓన్లీ క్యాష్.. నో డిజిటల్ పేమెంట్’ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీనిపై అధికారుల్ని ప్రశ్నిస్తే... ‘త్వరలోనే’ అంటూ దాటవేస్తున్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా కార్యాచరణ లేదు. ఉద్దేశపూర్వకంగానే మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగదు లావాదేవీలనే అనుమతించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ వెసులుబాటు కోసం ఇలా చేస్తున్నారన్నది మిస్టరీగానే ఉంది.
పారదర్శకత కోసం అవసరమంటూనే...
‘ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎలక్ట్రానిక్, డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడతాం. లావాదేవీల్లో పారదర్శకత, అక్రమాల నిరోధం కోసం డిజిటల్ చెల్లింపుల్ని అమలుచేస్తాం’ అని 2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ గతేడాది అక్టోబరు 1న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అయినా ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల ఏర్పాట్లకు అతీ గతీ లేకపోవడంలో ఆంతర్యమేంటి? అక్రమాలకు సహకరిస్తున్నట్లు కాదా? పారదర్శకతకు పాతరేసినట్లు కాదా?
15 రోజుల్లో అన్నారు... మూడు నెలలు దాటిపోయింది
‘మరో 15 రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తాం’ అని ఈ ఏడాది మార్చి 20న నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ సమాధానమిచ్చారు. మూడు నెలలు దాటినా ఇప్పటికీ ఎక్కడా ఆ ఊసే లేదు. కనీసం ప్రయోగాత్మకంగానైనా ఎక్కడా అమలు చేయలేదు.
రోజుకు రూ.70 కోట్లు... ఏడాదికి రూ.25,200 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్ముతారు. ఆ లెక్కన నెలకు రూ.2,100 కోట్లు, ఏడాదికి రూ.25,200 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తుంటారు. ఇంత వ్యాపారం జరుగుతున్నా ఎక్కడా డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం లేదు. నగదు చెల్లించి మద్యం కొనాల్సిందే.
నగదు మాయం వంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది కదా!
మద్యం విక్రయాల ద్వారా వచ్చిన నగదును సిబ్బంది మాయం చేశారని, లెక్కల్లో చూపించకుండా అవకతవకలకు పాల్పడ్డారనే ఘటనలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. నగదు లావాదేవీల వల్లే ఇలా జరుగుతోంది. అదే డిజిటల్ చెల్లింపులైతే ఇలాంటి అక్రమాలకు ఆస్కారమే ఉండదు. అయినా కానీ ప్రభుత్వం నగదు లావాదేవీలకే మొగ్గుచూపటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 వేల కోట్ల ఆన్లైన్ చెల్లింపులు
దేశవ్యాప్తంగా రోజుకు సగటున రూ.20 వేల కోట్ల మేర డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మన్కీ బాత్లో చెప్పారు. ఓ వైపు కేంద్రం నగదు చలామణీని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. రాష్ట్రప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారంలో నగదును మాత్రమే అనుమతించటం వెనుక ఉన్న కారణాలేమిటి? అనేది అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సీఎఫ్ఎంఎస్తో ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియ నడుస్తోందని, అది పూర్తయిన తర్వాత డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి తీసుకొస్తామని బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్ లావాదేవీలు.. ఇక్కడెందుకు లేవు?
‘ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనేవారిలో ఎక్కువమంది రోజుకూలీలు, ఏ పూట సంపాదనను ఆ పూట ఖర్చు చేసేవారే. వారికి డిజిటల్ పేమెంట్లపై అవగాహన ఉండదు. వారి ఖాతాల్లో డబ్బులూ ఉండవు. డిజిటల్ చెల్లింపులు ప్రవేశపెట్టినా ఆ లావాదేవీలు నామమాత్రంగానే ఉంటాయి. దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదు’ అని ఎక్సైజ్ అధికారులు అనధికారిక సంభాషణల్లో చెబుతున్నారు. అదే నిరుపేదలు, రోజుకూలీలు సహా అనేకమంది సామాన్యులు నిత్యం ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల డిజిటల్ చెల్లింపులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, యాప్ల ద్వారా చెల్లించి, బస్సుల్లో టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. రోజుకు రూ.16 కోట్ల రాబడి వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనే ఇలా చేస్తున్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎందుకు వీలు కావట్లేదో, దాని లోగుట్టు ఏమిటో? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు