CM Jagan: ఇదే ఫైనల్ వార్నింగ్
‘ఇకపై ఇలా అయితే కుదరదు.. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికీ తిరగాల్సిందే. పనితీరు మార్చుకోకపోతే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు
మీరు మారకపోతే కొత్త అభ్యర్థులు వస్తారంతే
27 మంది ‘గడప గడపకూ’ 10 రోజులు కూడా తిరగలేదు
వీళ్లలో ఆరుగురు మంత్రులు
ఇకపై రోజుకు ఎన్ని గంటలు తిరిగారో తేలుస్తా
మీరంటే ప్రేమ ఉన్నా.. గెలవలేకపోతే టికెట్ ఇవ్వలేను
మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ‘ఇకపై ఇలా అయితే కుదరదు.. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికీ తిరగాల్సిందే. పనితీరు మార్చుకోకపోతే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కొత్త అభ్యర్థులొస్తారు. ఇప్పటి నుంచి ప్రజల్లో తిరిగితేనే మీరు గెలవగలరు. మీరు గెలిస్తేనే మనందరం నిలవగలం. అందువల్ల గెలవలేని వారికి టికెట్లు ఇచ్చేది ఉండదు’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులతో సీఎం సమావేశం నిర్వహించారు. ‘మొహమాటాల్లేవు. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ తిరగాల్సిందే. షార్ట్ కట్స్ లేవు. వారానికి 4 రోజులు, నెలకు 16 రోజులు తిరగాల్సిందే. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికీ ఈ కార్యక్రమంలో సరిగా తిరగడం లేదు. ఇవన్నీ ఇకపై కుదరవు’ అని హెచ్చరించారు.
గంటల లెక్కన నివేదికలు తీస్తా
‘కొంతమంది ఒక్కో సచివాలయం పరిధిలో నాలుగైదు ఇళ్లకు వెళ్లొచ్చేసి మొత్తం పూర్తి చేశామనేస్తున్నారు. ఆ సచివాలయ పరిధిలోని అన్ని గడపలకూ వెళితేనే మీరు తిరిగినట్లు. లేకపోతే లెక్కలోకి తీసుకోం. ఆ సచివాలయాల పరిధిలో మీరు మళ్లీ తిరగాల్సిందే. లేకపోతే వాటి పరిధిలో మీరు ప్రతిపాదించే పనుల మంజూరు, వాటికి నిధుల కేటాయింపు ఉండవు. ఇన్ని రోజులు తిరిగేశామనే లెక్క కోసం చాలా మంది చేస్తున్నారు. అలాంటివి కుదరవు. నెలకు 16 రోజులు తప్పనిసరిగా తిరగాల్సిందే. ఇకపై ఈ 16 రోజుల్లో ఎన్ని గంటలు ఏయే గ్రామాల్లో, ఏయే ప్రాంతాల్లో ఎన్ని గడపలకు తిరిగారనేదీ కూడా తేలుస్తాం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలందరి వెంటా ఐప్యాక్ ప్రతినిధి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు, మీ కదలికలను వాళ్లు రిపోర్ట్ చేస్తారు’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘ఇప్పటి వరకూ 10 మంది చాలా బాగా చేశారు, కానీ, వాళ్ల పేర్లు ఇప్పుడు చదివితే వాళ్లను పెంచి మిగిలినవాళ్లను తగ్గించినట్లవుతుందని ప్రకటించడం లేదు’ అని సీఎం చెప్పారు.
ఆర్నెల్ల ముందే అభ్యర్థులు
‘ఎన్నికలకు 19 నెలల సమయం ఉంది. ఇది చాలా కీలక సమయం. ఇకమీదట కూడా మీ పనితీరును మార్చుకోకపోతే కష్టం. మీలో ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలున్నాయి. ప్రతి ఒక్కరూ నాతో అడుగులు వేశారు. అందుకే ఎవర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. పనితీరు బాగాలేని వాళ్ల గేర్ మార్చడమే నా లక్ష్యం. అయినా తీరు మార్చుకోకపోతే, ఓడిపోతారని తెలిసీ మీకు టికెట్లు ఇవ్వలేం కదా? ఎన్నికలకు ఆరు నెలల ముందే సర్వే చేయిస్తాను. మీలో ప్రజాదరణ ఉన్నవారికే మళ్లీ టికెట్లు ఇస్తాను’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.
ఆర్థిక మంత్రివి తిరక్కపోతే ఎలా రాజా?
10 రోజులు కూడా తిరగని వారి పేర్లను ముఖ్యమంత్రి చదివిన సమయంలో సమావేశ మందిరంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కనిపించకపోవడంతో.. ‘అదే పనిగా విమానంలో ఎక్కించుకుని వచ్చానే. రాజా ఎక్కడున్నాడు? లోపలికి రమ్మనండి’ అని సీఎం పిలిపించినట్లు తెలిసింది. లోపలికి వచ్చిన బుగ్గనతో సీఎం మాట్లాడుతూ...‘ఎంతో నమ్మకంతో ఆర్థిక శాఖ వంటి కీలక బాధ్యత కూడా అప్పగించాం కదా. మీ నియోజకవర్గంలోనే తిరగకపోతే ఎలా? తిరగాలి కదా’ అని అన్నట్లు సమాచారం.
మా అబ్బాయిలు తిరుగుతున్నారంటే కుదరదు
‘కొంతమంది మా అబ్బాయిలు తిరుగుతున్నారని చెబుతున్నారు. వాళ్లనే తిప్పుతున్నారు. అవేవీ కుదరవు. మీ బిడ్డల్ని ప్రమోట్ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ ఈసారికి మీరే పోటీ చేయాలి. మీతో నాకు ర్యాపో, అనుబంధం ఉంది, మీరు పోటీ చేయాలి’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘మా వారసులకు అవకాశం కావాలని అని మన నాని, రాజా లాంటివాళ్లు అడుగుతున్నారు’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్లను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. పేర్ని నాని కల్పించుకుంటూ ‘నేను పోటీ చేయలేను, మా అబ్బాయి చేస్తాడు’ అని చెప్పబోగా ‘లేదు నువ్వే చేయాలి, ఈసారి కూడా నాతోపాటు నువ్వుండాలి’ అని సీఎం అన్నట్లు తెలిసింది. ‘నేను పార్టీకి పూర్తి సమయం పని చేస్తున్నాను. పోటీ మాత్రం చేయలేను’ అని నాని సమాధానమివ్వగా.. ‘కాదు.. ఈసారి చేయి’ అని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది.
ప్రాంతీయ సమన్వయకర్తలు విఫలమయ్యారు
‘ఎమ్మెల్యేలు తిరగకపోతే వారి ప్రాంతానికి సంబంధించిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాల్సిందే. ప్రాంతీయ సమన్వయకర్తలుగా సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, బాలినేని, అనిల్కుమార్ యాదవ్ ఫెయిలయ్యారు. మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత అప్పగిస్తే, పని చేయకపోతే ఎలా? మీరు చేయలేకపోతే చెప్పండి.. చేసే వాళ్లకు బాధ్యతనిస్తా’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఈ 27 మంది సంగతి చూడండి
‘గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ఇప్పటివరకూ కనీసం 10 రోజులు కూడా తిరగని వారు దాదాపు 27 మంది ఉన్నారు’ అని వారి పేర్లను ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ‘డిసెంబరులో మళ్లీ కలిసి సమీక్షించుకుందాం.. అప్పటికి తిరగనివారు ఉండకూడదు.. ఇప్పుడు ఈ 27 మంది పేర్లు చదువుతున్నా. అప్పుడు సున్నా పేర్లుండాలి’ అని సీఎం చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..
గడప గడపకూ సరిగా తిరగని మంత్రులు
బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, విశ్వరూప్, రోజా, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత
ఎమ్మెల్యేలు
ధనలక్ష్మి (రంపచోడవరం)
జి.శ్రీనివాసులు నాయుడు (నిడదవోలు)
గ్రంధి శ్రీనివాస్ (భీమవరం)
ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి)
శాసనసభాపతి తమ్మినేని సీతారాం (ఆమదాలవలస)
వల్లభనేని వంశీ (గన్నవరం బాధ్యుడు)
దూలం నాగేశ్వరరావు (కైకలూరు)
మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు గ్రామీణ)
శ్రీధర్రెడ్డి (పుట్టపర్తి), నవాజ్ బాషా (మదనపల్లి)
మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట)
అదీప్రాజ్ (పెందుర్తి), శిల్పా చక్రపాణి (శ్రీశైలం)
ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట)
మేకపాటి చంద్రశేఖర్రెడ్డి (ఉదయగిరి)
శ్రీనివాసులు (రైల్వేకోడూరు)
బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి (కోవూరు) (ఈ ఎమ్మెల్యే పేరును సీఎం చదవడంపై పూర్తి స్పష్టత రాలేదు)
నియోజకవర్గ బాధ్యులు
తోట త్రిమూర్తులు (మండపేట)
ఎంపీ మార్గాని భరత్ (రాజమహేంద్రవరం సిటీ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే