కర్ణాటక మద్యం.. నాటుసారాతో ఆతిథ్యం

ఇతర రాష్ట్రాల మద్యాన్ని అడ్డుకుంటున్నామని, నాటుసారాని అరికడుతున్నామని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ... ఏకంగా ఆర్థిక మంత్రి నిర్వహించిన సభలో కర్ణాటక

Updated : 30 Sep 2022 14:40 IST

మంత్రి సభలో పోలీసుల ముందే ఇష్టారాజ్యం

డోన్‌ పట్టణం, డోన్‌, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాల మద్యాన్ని అడ్డుకుంటున్నామని, నాటుసారాని అరికడుతున్నామని పోలీసులు పదేపదే చెబుతుంటారు. కానీ... ఏకంగా ఆర్థిక మంత్రి నిర్వహించిన సభలో కర్ణాటక మందు, నిషేధిత నాటుసారా గుప్పుమంటున్నా అదే పోలీసులు చూస్తూ ఉండిపోయారు. దీనికి నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల వేదికైంది. డోన్‌ మండలం వెంకటనాయునిపల్లెకు చెందిన ఓ పార్టీ నాయకుడితోపాటు మరికొందరు వైకాపాలో చేరుతుండటంతో గురువారం డోన్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నా... జనానికి కర్ణాటక మద్యాన్ని పంచారు. నాటుసారాను బిందెలో తీసుకొచ్చి గ్లాసులు, సీసాల్లో పోశారు. వాటిని తీసుకోవడానికి ఒకరిపై ఒకరు తోసుకుంటూ ఎగబడ్డారు. వాహనం వద్దకు విలేకరులు వచ్చేసరికి ఓ నాయకుడు గుంపులను చెదరగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని