గజల్‌ శ్రీనివాస్‌కు లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారం

గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారాన్ని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ‘మై హోమ్‌ ఇండియా మహారాష్ట్ర’ అందజేసింది. భారతరత్న లతా మంగేష్కర్‌ జయంతి

Published : 30 Sep 2022 03:18 IST

ఈనాడు, అమరావతి: గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారాన్ని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ‘మై హోమ్‌ ఇండియా మహారాష్ట్ర’ అందజేసింది. భారతరత్న లతా మంగేష్కర్‌ జయంతి సందర్భంగా బుధవారం పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో మరాఠీ కళాకారుడు ప్రశాంత్‌ దామ్లే, భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. లతా మంగేష్కర్‌పై ప్రముఖ కవులు రచించిన హిందీ, ఉర్దూ గజల్‌లను శ్రీనివాస్‌ ఈ సందర్భంగా ఆలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని