రెండేళ్లలోగా వచ్చేవి ఐదే!
రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 8 తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే ఉన్నాయి. వైఎస్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడపలో 3 ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి. ఇపుడు ఆయన
కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే
రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 8 తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే ఉన్నాయి. వైఎస్ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడపలో 3 ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి. ఇపుడు ఆయన కుమారుడి ఆధ్వర్యంలోని వైకాపా ప్రభుత్వంలో మరో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నాం. మొత్తం 28లో 20 కళాశాలల్ని మేమే కట్టాం. కడుతున్నాం. అలాంటపుడు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టకూడదనటం న్యాయమేనా?
- శాసనసభలో ఈ నెల 21న సీఎం జగన్
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. కానీ శాసనసభలో ఆయన చెప్పినట్లు 17 కొత్త వైద్య కళాశాలలూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వచ్చే అవకాశం లేదు. ఐదు మాత్రమే వస్తాయి. మిగిలిన 12 కళాశాలలు రావాలంటే 300 పడకలతో అనుబంధ ఆసుపత్రులు ఏర్పాటై తప్పనిసరిగా మూడేళ్లపాటు నడవాలి. వాటి నిర్మాణాలు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సిద్ధమైనప్పటికీ.. వాటిలో తరగతులు ప్రారంభించాలంటే.. 2026 లేదా 2027 వరకు సమయం పడుతుంది. అదికూడా ప్రణాళిక ప్రకారం జరిగితేనే సాధ్యమవుతుంది. ఈలోపు ప్రస్తుత జగన్ ప్రభుత్వ పదవీకాలం 2024 మార్చి లేదా ఏప్రిల్తో ముగుస్తుంది.
ఈనాడు, అమరావతి: కొత్తగా వైద్య కళాశాలల స్థాపనలో అనేకరకాల సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా నిధుల సంక్షోభం వెంటాడుతోంది. వాటి ఏర్పాటుకు 7,880 కోట్లు అవసరమవుతాయి. ఆ నిధుల గురించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. కొత్తగా ప్రకటించిన 17 కళాశాలల్లో ఐదింటికి మాత్రమే కేంద్రం నుంచి నిధులకు ఆమోదం లభించింది. బ్యాంకులు, నాబార్డు ద్వారా రుణాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏదోలా వచ్చేస్తాయన్న ఉద్దేశంతో నిర్మాణాలు ప్రారంభించినా.. నిధుల లభ్యతను బట్టి మాత్రమే ఇవి వేగాన్ని అందుకుంటాయి. నిధులు పొందే మార్గాలపై స్పష్టత లేకుండానే 17 కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం కొత్తగా ప్రకటించినవాటిలో ఐదు కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచే ప్రవేశాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతి లభించే వరకు చెప్పలేని పరిస్థితి. నవంబరు లేదా డిసెంబరులో ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు జరిపి, నిర్మాణాల పట్ల సంతృప్తి చెంది, ఆమోదం తెలిపే వరకు ప్రవేశాల ప్రారంభంపై సస్పెన్స్ తప్పదు. ఇపుడు సాధ్యం కాకుంటే 2024-25లోనే తరగతులు ప్రారంభమవుతాయి. నంద్యాల, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరంలో జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చే పనులు యుద్ధప్రాతిపాదికన జరిగితేనే యూజీలో 150 చొప్పున 750 సీట్లు ఎన్ఎంసీ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
ఆసుపత్రులు పూర్తయ్యేదెప్పుడు?
పులివెందుల, పాడేరు, అనకాపల్లి, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, పెనుకొండ, మదనపల్లి, ఆదోని, పార్వతీపురంలో వైద్య కళాశాలలు రావాలంటే అక్కడ 300 పడకలతో రోగులకు నిరాంటకంగా మూడేళ్లపాటు చికిత్స అందించాలి. అలాగే.. 30 పడకలు ఎమర్జెన్సీ విభాగంలో ఉండాలి. 300 పడకల అవసరాలకు తగ్గట్లు వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు సమకూరాలి. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నియామకాలు జరగాలి. 300 పడకలకు తగ్గట్లు నిర్మాణాలు జరిగేందుకు వచ్చే ఏడాది డిసెంబరు వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. పులివెందుల, పాడేరు, అనకాపల్లి నిర్మాణాల పనుల్లో కాస్త పురోగతిలో ఉండగా.. మిగిలినచోట్ల పనులు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. అనకాపల్లిలో స్థల సమస్య రావడంతో నర్సీపట్నానికి మార్చారు. ప్రభుత్వం ప్రకటించినట్లు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తయి, మూడేళ్లపాటు 300 పడకలతో ఆసుపత్రులు కొనసాగితేనే ఎంబీబీఎస్లో తరగతుల ప్రారంభానికి దరఖాస్తు చేసేందుకు వీలుంటుంది.
సంకట స్థితిలో బ్యాంకులు
ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో 17 వైద్య కళాశాలలు ప్రారంభించేలా హడావుడి చేస్తోంది. కొత్తవాటి ఏర్పాటు, ప్రస్తుత బోధనాసుపత్రుల అభివృద్ధికి కలిపి రూ. 11,700 కోట్లు కావాలి. ఇంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ప్రతిపాదించిన రీపేమెంట్ విధానం సంతృప్తికరంగా లేనందున అవి రుణాలు ఇచ్చేందుకు సంశయిస్తున్నాయి. నిధుల సంక్షోభం కారణంగా ఈ నిర్మాణాలు ఎంతవరకు సాఫీగా జరుగుతాయో సంబంధిత వర్గాలు చెప్పలేకపోతున్నాయి. రీపేమెంట్ విధానంలో కొత్త వైద్య కళాశాలల్లో ‘బి’ కేటగిరి సీట్లకు ఫీజులు వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. బ్యాంకులు మాత్రం సంకటస్థితిలో ఉన్నాయి. జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు నడిపి, మౌలిక సదుపాయాలు కల్పించి యూజీలో సీట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తేనే ఎన్ఎంసీ బృందాలు తనిఖీల కోసం రాష్ట్రానికి వస్తాయి. అప్పటివరకు ఇక్కడ జరిగే నిర్మాణాలతో ఎన్ఎంసీకి సంబంధం ఉండదు.
కేంద్రం నుంచి మూడింటికే సాయం?
ఒక్కో కొత్త కళాశాల ఏర్పాటుకు రూ. 7,880 కోట్లు అవసరమవుతాయి. నాబార్డు నుంచి దశలవారీగా నిధుల రాక మొదలైంది. ప్రస్తుత కళాశాలలు, బోధనాసుపత్రుల అభివృద్ధికి మరో రూ. 3,820 కోట్లు అవసరం అవుతున్నాయి. కేంద్రం నుంచి వివిధ రకాల పద్దుల కింద నిధులు పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం కళాశాలలకు రూ. 195 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొంతమేర నిధులు వచ్చాయి. ఇవికాకుండా పాలకొల్లు, బాపట్ల, మదనపల్లి, పెనుకొండ, నర్సీపట్నం, మార్కాపురం, ఆదోనిలో కళాశాలలకు కూడా ఆర్థిక సాయం అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కొత్త జిల్లాల దృష్ట్యా ఆర్థిక సహకారం అవసరమని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం