డిసెంబరు 21కల్లా ఐదు లక్షల ఇళ్లు
రాష్ట్రంలో డిసెంబరు 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షల ఇళ్లు, 1.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం
నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం
20 రోజుల్లో ఇళ్ల స్థలాల ఆడిటింగ్ పూర్తవ్వాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో మంజూరు చేసిన పనుల్ని నెల రోజుల్లో ప్రారంభించాలి
స్పందనపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో డిసెంబరు 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షల ఇళ్లు, 1.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికే విద్యుత్, తాగునీరు, మురుగునీటిపారుదల కాలువ సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. మిగిలిపోయిన లబ్ధిదారులకు ఫేజ్-3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విశాఖపట్నంలో కేటాయించిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణం అక్టోబరు నాటికి మొదలయ్యేలా చూడాలని సూచించారు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిటింగ్ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో పూర్తవ్వాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సమీక్షించారు. స్పందనపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు, సూచనలివీ..
మంజూరైన నెల రోజుల్లో పనులు మొదలవ్వాలి
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన పనుల్ని నెల రోజుల్లోగా ప్రారంభించాలి. మొత్తం 15,004 గ్రామ/ వార్డు సచివాలయాల్నీ ఈ కార్యక్రమం కింద కవర్ చేస్తున్నాం. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నాం. ఆ పనుల్లో ఎలాంటి ఆలస్యానికి, అలసత్వానికి తావివ్వద్దు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది నెలలో కనీసం ఆరు సచివాలయాల్ని సందర్శించాలి. ఒక్కో సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే కనీసం రెండు రోజులపాటు కార్యక్రమంలో పాల్గొనాలి. రోజులో కనీసం ఆరు గంటలపాటు కార్యక్రమం నిర్వహించాలి. ఇప్పటికే కార్యక్రమం జరిగి పనులు మంజూరు చేయనిచోట అక్టోబరు 5లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఈ-క్రాప్ నమోదు నూరు శాతం జరగాలి
నూటికి నూరుశాతం ఈ-క్రాప్ నమోదు పూర్తి చేయాలి. ఈ సీజన్లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. 96 శాతం ఈ-క్రాపింగ్ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 4శాతాన్ని శుక్రవారానికి పూర్తి చేయాలి. రైతుల్ని పొలాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకుని, వివరాలు నమోదు చేసే ప్రక్రియ శుక్రవారానికి పూర్తవ్వాలి. రెండో దశ కింద అక్టోబరు 3లోగా గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు బయోమెట్రిక్ ద్వారా వాటిని అధీకృతం చేయాలి. అక్టోబరు 10లోగా కేవైసీలు పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి 15లోగా రైతులకు ఈ-క్రాప్లో రశీదులివ్వాలి. 15 నుంచి సోషల్ ఆడిట్ చేయాలి. 25నుంచి వారంపాటు తుది జాబితాను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1నుంచి పోర్టళ్లలో అందుబాటులో ఉంచాలి.
ఉపాధి పనులకు సగటు వేతనం పెరగాలి
ఉపాధి హామీ పనులకు ఇప్పటి వరకు సగటు వేతనం రూ.210.02గా ఉంది. కనీసం రూ.240 వేతనం అందాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,400 కోట్ల బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే విడుదల చేస్తాం. ఇప్పటి వరకు 17.05 కోట్ల పనిదినాలు సృష్టించడం అభినందనీయం.
* 4,500 గ్రామ సచివాలయాలకు డిసెంబరులోగా కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందుతుంది. అక్కడ డిజిటల్ లైబ్రరీలు పూర్తి చేయాలి.
* భూహక్కు-భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 5,738 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తయింది. 2,662 గ్రామాలకు సంబంధించిన ఓఆర్ఐలు జిల్లాలకు విడుదల చేశాం.
అర్జీదారుతో సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేయాలి
స్పందనలో వచ్చే అర్జీల పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారుకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. అర్జీదారుతో లొకేషన్లో సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేయడం తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి.
* సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. వీటిలో సాధించిన పురోగతి ఆధారంగా కలెక్టర్ల పనితీరు, సమర్థతను నిర్ణయిస్తాం.
* ప్రతి ఇంట్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు మాక్కాల్స్ చేసి దిశ పనితీరును పర్యవేక్షించాలి.
* ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నెంబర్ 14400 ఉన్న పోస్టర్ అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఆ పోస్టర్ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ముఖ్య అధికారిని బాధ్యుణ్ని చేయండి.
* బెంగళూరు- విజయవాడ ఎక్స్ప్రెస్వే సహా వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
* అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత విడుదల చేస్తున్నాం. అదే రోజు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. వసతి దీవెన నవంబరు 10న విడుదల చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.